Tag Archives: sridevi drama company

Kumari Aunty: మరో బుల్లితెర షోలో సందడి చేసిన కుమారి ఆంటీ…ఈమెను నాశనం చేసేదాకా వదిలేలా లేరే?

Kumari Aunty: నాన్న బుజ్జి కన్నా అంటూ తన ఫుడ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఈమె హైదరాబాద్లో ఫుట్ పాత్ పక్కన బిజినెస్ జరుపుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఈమె పాపులారిటీ ఎంత అంటే ఏకంగా టీవీ షోస్ లో వచ్చే అంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె పేరుతో డిజె సాంగ్ క్రియేట్ చేసే అంతగా పాపులర్ అయ్యారు.

ఇలా ఫుడ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుపుకుంటూ ఉన్నటువంటి ఈమెను ఏకంగా బుల్లితెర సెలబ్రిటీగా మార్చేశారు. ఇటీవల బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో సందడి చేస్తున్నటువంటి కుమారి అంటే తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ కార్యక్రమంలో 90s వెబ్ సిరీస్ టీం కూడా పాల్గొని సందడి చేశారు. ఇక కుమారి ఆంటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎప్పటిలాగే అందరికీ నాన్న బుజ్జి అంటూ ఫుడ్ పెడుతూ సందడి చేశారు. ఇలా ఈమె ఆ నాన్న ఏం కావాలి చెప్పు అంటూ మాట్లాడటంతో హైపర్ ఆది కలుగజేసుకొని ఇదే అసలైన బిజినెస్ ట్రిక్ అంటూ ఆమెపై సెటైర్ వేశారు.

అసలైన బిజినెస్ ట్రిక్..

ఇలా కుమారి ఆంటీ తాజాగా ఈ కార్యక్రమంలో కనిపించడంతో పలువురు ఈమె పట్ల వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా బుల్లితెర కార్యక్రమాలకు తీసుకువచ్చి తన బిజినెస్ మరింత పాపులర్ చేశారని కామెంట్లు చేయగా మరికొందరు ఈమెను ఇలా తీసుకువచ్చి సెలబ్రిటీ వచ్చేసి తర్వాత తనకు తన బిజినెస్ పట్ల కూడా ఆసక్తి లేకుండా చేస్తున్నారని ఇలా ఇప్పటికే ఎంతోమంది జీవితాలతో బుల్లితెర షోస్ ఆడుకున్నాయని ఇప్పుడు ఈమెను కూడా నాశనం చేసే వరకు వదిలేలా లేరే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Kumari Aunty: శ్రీదేవి డ్రామా కంపెనీలోకి కుమారి ఆంటీ.. ఒక్క దెబ్బతో సెలబ్రిటీ అయ్యిందిగా?

Kumari Aunty: కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నటువంటి పేరు. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకొని జీవనం గడుపుతూ ఉన్నటువంటి ఈమెను సోషల్ మీడియా వాళ్ళు భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఈమె వద్దకు వెళ్లి ఇంటర్వ్యూ చేయడంతో భారీగా పాపులర్ అయింది.

ఇకపోతే ఇటీవల ఈమె ఫుడ్ బిజినెస్ కి భారీగా డిమాండ్ రావడంతో ఏకంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ట్రాఫిక్ పోలీసులు ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తిరిగి ప్రారంభించారు. ఇలా రేవంత్ రెడ్డి వరకు ఈమె విషయం వెళ్లడంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఈమె ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉండగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వెళ్లబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు యాంకర్ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది అసలు ఎప్పుడు మీకు కాల్ చేశారు ఎప్పుడు వెళ్తున్నారు అంటూ ప్రశ్నించగా ఈమె మాత్రం నవ్వుతూ దయచేసి ఇవేవీ అడగకండి అంటూ సమాధానం చెప్పారు.

సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ…

ఈ విధంగా కుమారి ఆంటీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడంతోనే ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఫుడ్ బిజినెస్ ద్వారా పాపులర్ అయ్యి అదే పాపులారిటీతో బిజినెస్ క్లోజ్ అయ్యి సీఎం చొరవతో తిరిగి ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన ఈమె భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. దీంతో ఏకంగా సెలబ్రిటీ హోదా దక్కించుకున్నారని చెప్పాలి.

Rashmi: రాత్రికి వస్తావా అంటూ రశ్మిని అవమానించిన కమెడియన్… ఇంద్రజ రియాక్షన్ ఇదే?

Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకొంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ పట్ల స్టార్ కమెడియన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆటో రాంప్రసాద్ రష్మీ పట్ల చేసినటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఆటో రాంప్రసాద్ స్కిట్ లో భాగంగా రష్మీ వద్దకు వెళ్లి ఈ రాత్రికి వస్తావా అంటూ తనతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తూ మాట్లాడారు. అసలు నేనెందుకు రావాలి రాత్రికి అంటూ రష్మీ అనడంతో రాత్రికి ఎందుకు వస్తారో తెలియదా అంటూ తెగ సిగ్గు పడిపోయారు. ఇలా రాంప్రసాద్ సిగ్గుపడుతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి జడ్జ్ ఇంద్రజ స్పందించారు.

Rashmi: రాంప్రసాద్ పై సీరియస్ అయిన ఇంద్రజ…


రశ్మిని ఇలా అడుగుతూ రాంప్రసాద్ సిగ్గుపడుతూ ఉండగా వెంటనే ఇంద్రజ ఏయ్ అంటూ గట్టిగా అరిచారు. దీంతో రాంప్రసాద్ ఒక్కసారిగా ఉలికి పడుతూ మా ఊర్లో జాతరుంది అందుకే పిలిచామండి అంటూ కవర్ చేసుకుంటారు.అయితే ఇదంతా కూడా స్కిట్ లో భాగమని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో మీరు మీ చెత్త డబుల్ మీనింగ్ డైలాగులు ఇకపై మీరు మారరా అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Rashmi: తన పై పడిన ఆ స్టాంప్ కారణంగానే సినిమా అవకాశాలు రాలేదు…. సినిమా అవకాశాలపై ఓపెన్ అయిన రష్మీ!

Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బుల్లితెరపై వరుస కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. బుల్లితెరపై యాంకర్లుగా చేసిన వారందరూ కూడా వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రశ్మి సైతం పలు సినిమాలలో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈమెకు వెండితెరపై ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదని చెప్పాలి. ఇలా వెండితెరపై రష్మికి సరైన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి గుర్తింపు రాకపోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రష్మీ మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలతో కలిసి ఓపెన్ హార్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రష్మి పలువురు సెలబ్రిటీలను అడుగుతూ సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఇంద్రజ సైతం రశ్మిని ప్రశ్నిస్తూ టెలివిజన్ రంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మి వెండితెరపై ఎందుకు రాణించలేకపోతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ పలు విషయాలను వెల్లడించారు.తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని అయితే రాత్రికి రాత్రికి నా పాత్రలు మారిపోతున్నాయని తెలియజేశారు.

Anchor Rashmi: రాత్రికి రాత్రి పాత్రలు మారిపోతున్నాయి…


సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు వీళ్ళే చేయగలరు అనే స్టాంప్ ఉంది కొందరు తల్లి పాత్రలకు మాత్రమే పరిమితం మరికొందరు చెల్లెలు పాత్రలకు మాత్రమే పరిమితం మరికొందరు సెకండ్ హీరోయిన్గా మాత్రమే పరిమితం అనే స్టాంపు ఉంది. అయితే తనపై కూడా అలాంటి స్టాంప్ పడిన కారణంగా మంచి పాత్రలలో నటించే అవకాశం రాలేదని అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాను అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Anchor Rashmi: హైపర్ ఆది చేసిన పనికి వేదికపై కంటతడి పెట్టుకున్న రష్మీ.. అసలు ఏం జరిగిందంటే?

Anchor Rashmi: నటిగా బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాంకర్ గా ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై అవకాశాలను అందుకునే పలు సినిమాలలో కూడా నటిస్తూ రష్మీ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే రష్మీ బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నప్పటికీ ఈమెకు కమెడియన్ సుధీర్ తో ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వీరిద్దరి గురించి వార్తలు వచ్చేవి అయితే ప్రస్తుతం సుధీర్ ఈటీవీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ సుదీర్ రష్మిల రిలేషన్ గురించి ప్రస్తావనకు తీసుకురావడం గమనార్హం.అయితే త్వరలోనే ప్రేమికుల దినోత్సవం రానున్న నేపథ్యంలో మరోసారి రష్మీ సుధీర్ గురించి ఆది ప్రస్తావనకు తీసుకువచ్చారు.

వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా చెప్పు బుజ్జి కన్నా అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా చివర్లో హైపర్ ఆది FLAMES ఆడారు.

Anchor Rashmi: సుధీర్ ను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ…

ముందుగా వర్ష ఇమ్మానియేల్ ఇద్దరి పేర్లను ఫ్లేమ్స్ చేయగా మ్యారేజ్ అని వచ్చింది అనంతరం హైపర్ ఆది రష్మీ సుధీర్ పేర్లను రాస్తూ ఫ్లేమ్స్ చేయబోతూ ఉండగా వెంటనే రష్మీ తన చేతిలో ఉన్న పేపర్ లాక్కొని చింపేయడమే కాకుండా అక్కడే ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సుదీర్ ను గుర్తు చేసుకుంటూ రష్మీ కంటతడి పెట్టుకుందని పలువురు భావిస్తున్నారు.

Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కోసం జబర్దస్త్ జడ్జిలకి మల్లెమాల ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో తెలుసా?

Jabardasth: ఈటీవీలో మల్లెమాల వారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈ కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

జబర్దస్త్ కార్యక్రమానికి మొదట్లో రోజా, నాగబాబు జడ్జిలుగా వ్యవహరించేవారు.అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి సింగర్ మనో వచ్చారు.అదేవిధంగా రోజా గారికి మంత్రి పదవి రావడం చేత రోజా కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో రోజా స్థానంలోకి ఇంద్రజ వచ్చారు. ఇక మనో కూడా ఈ కార్యక్రమానికి స్థిరంగా లేకపోవడంతో ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తున్నారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ జడ్జ్ ల కోసం మల్లెమాలవారు ఒక్కో ఎపిసోడ్ కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. రోజా ఎక్కువ ఎపిసోడ్ కోసం ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారట.ఇక ఈమె హీరోయిన్ కావడంతో ఈమెకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చారు ఇక ఈమెతో పాటు జడ్జిగా వ్యవహరించిన నాగబాబుకు మాత్రం ఒక్కో ఎపిసోడ్ కు మూడు లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేవారు.

Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యూనరేషన్..

రోజా స్థానంలో కొనసాగుతున్న ఇంద్రజకు ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కు రెండున్నర లక్ష రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. అదేవిధంగా నాగబాబు స్థానంలో కొనసాగుతున్న కమెడియన్ కృష్ణ భగవాన్ కు ఒక్కో ఎపిసోడ్ కి 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. ప్రస్తుతం మల్లెమాలవారు జడ్జిలకు ఇస్తున్నటువంటి ఈ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Gajuwaka Conductor: ఒక్కమగాడు అంటూ ఓ రేంజ్ లో డాన్స్ చేసిన కండక్టర్ ఝాన్సీ.. వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!

Gajuwaka Conductor: గాజువాక కండక్టర్ ఝాన్సీ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి మల్లెమాలవారు ముందు వరుసలో ఉంటారు.ఈ క్రమంలోనే డాన్స్ లో ఎంతో టాలెంట్ కలిగి ఉన్నటువంటి గాజువాక బస్సు కండక్టర్ ఝాన్సీ గత 11 సంవత్సరాల నుంచి డాన్స్ చేస్తూ ఎంతో కష్టపడుతోంది. అయితే ఆమె కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కిందని తెలుస్తుంది.

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత తనలో ఉన్నటువంటి టాలెంటును బయట పెడుతూ డాన్స్ వీడియోలు చేశారు. ఇలా ఈమె డాన్స్ చూసినటువంటి మల్లెమాలవారు ఏకంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పల్సర్ బండి అనే పాటకు డాన్స్ చేస్తూ అందరినీ ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్నారు.

ఈ విధంగా ఒక సాధారణ బస్ కండక్టర్ డాన్స్ పై ఉన్న మక్కువతో ఇలా సెలబ్రిటీగా మారిపోవడంతో చాలామంది ఈమె వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడమే కాకుండా ఈమెకు సంబంధించిన ఓల్డ్ వీడియోలను కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇక ఈమె ఒకవైపు బస్ కండక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పలు కార్యక్రమాలలో డాన్స్ చేస్తూ సందడి చేశారు.

Gajuwaka Conductor: ఝాన్సీ పర్ఫామెన్స్ కు నేటిజన్స్ ఫిదా…

ఇలా ఝాన్సీ ఓ కార్యక్రమంలో భాగంగా సీతయ్య సినిమాలోని ఒక్క మగాడు అనే మాస్ పాటకు మాస్ పర్ఫామెన్స్ చేసి అందరిని సందడి చేశారు. అయితే ఈ పాటకు సంబంధించిన ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఈమె పెర్ఫార్మెన్స్ చూసిన నేటిజన్స్ ఫిదా అవుతూ తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ashu Reddy: పల్సర్ బైక్ ఎక్కి అంటూ రెచ్చిపోయిన అషు రెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో!

Ashu Reddy: సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతున్న పాటలకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ట్రెండింగ్ లో ఉన్న పాటలకు లెక్కలేనన్ని వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి.

Ashu Reddy: ముద్దిస్తా అంటూ యాంకర్ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన అషు రెడ్డి .. వీడియో వైరల్!

ఈ క్రమంలోనే ప్రస్తుతం పల్సర్ బండి ఎక్కి అనే పాట బాగా ట్రెండ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేయడంతో ఈ పాట మరింత ఫేమస్ అయ్యింది.అప్పటినుంచి ఈ పాటకు ఎంతోమంది డాన్సులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే ఈ పాటకు బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి అద్భుతమైన స్టెప్పులు వేస్తూ డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన స్టెప్పులతో డాన్స్ ఇరగదీసారు అని చెప్పాలి.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్ లు తమదైన శైలిలో ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Ashu Reddy: జూనియర్ సమంతగా పాపులర్..

సోషల్ మీడియా ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె డబ్స్మాష్ వీడియోలు ద్వారా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమెకు జూనియర్ సమంత అనే ట్యాగ్ రావడంతో మరింత పాపులర్ అయ్యారు. ఇదే పాపులారిటీతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ వెళ్లొచ్చిన ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు, పలు యూట్యూబ్ వీడియోలతో ఎంతో బిజీగా గడుపుతూ అభిమానులను సందడి చేస్తున్నారు.

Sridevi Drama Company: ఇక మీరు మారరా… మరి ఇంత దిగజారి పోయారా.. మల్లెమాలపై మండిపడుతున్న నెటిజన్స్?

Sridevi Drama Company: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఇకపోతే ఈకార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో ఉత్కంఠ భరితంగా ప్రోమోలు కట్ చేయడం మనం చూస్తున్నాము.

ఈ ప్రోమోలు చూడగానే అసలు ఏం జరిగిందోననే కంగారు ఆత్రుత ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలిగేలా కట్ చేస్తున్నారు. వేదికపైనే గొడవపడి సెట్ లో నుంచి వెళ్లిపోవడం, ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితులు కల్పిస్తూ ప్రోమోలు కట్ చేశారు.ఇలా ప్రోమోలు చూసిన అభిమానులు ఈ కార్యక్రమాన్నిఅంతే ఆత్రుతగా చూసినప్పటికీ చివరికి అక్కడ ఏమీ లేకపోవడంతో కార్యక్రమ నిర్వాహకులపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే ఇలా ఈ కార్యక్రమం రేటింగ్ కోసం ఇలాంటి ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడటంతో మల్లెమాల వారిపై ప్రేక్షకులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే ఈ కార్యక్రమం ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమాన్ని తలపించిందని చెప్పాలి.

Sridevi Drama Company: కన్నీళ్లు పెట్టుకున్న ఆది…

ఈ కార్యక్రమంలో భాగంగా మీకు నచ్చని వారి ఫోటోలను చింపడం లేదా కాల్చివేయడం చేయండి అంటూ రష్మి టాస్క్ ఇస్తుంది. అయితే ఈ టాస్క్ లో భాగంగా అందరూ హైపర్ ఆది ఫోటోలను చింపడంతో ఆయన ఎంతో ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ప్రోమో కాస్త ఎపిసోడ్ పై భారీ అంచనాలను పెంచేలా ప్రోమో కట్ చేయడంతో ఇది చూసిన నెటిజన్ లు మరోసారి మీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా మీరు మారరా అంటూ పెద్ద ఎత్తున మల్లెమాలపై నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tik Tok Bhanu: వామ్మో.. టిక్ టాక్ భాను రేంజ్ మామూలుగా లేదుగా… ఒక్క కాల్ షీట్ కోసం భారీగా వసూలు చేస్తున్న బ్యూటీ?

Tik Tok Bhanu: సోషల్ మీడియా ద్వారా కొందరి జీవితాలు విషాదం అయితే మరికొందరి జీవితాలు మాత్రం సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో టిక్ టాక్ భాను ఒకరు. టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమె బుల్లితెర కార్యక్రమాలలో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే భాను శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.సోషల్ మీడియాలో సుమారు 1.5 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మను హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి పరిచయం చేశారు.ఇలా జబర్దస్త్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న భాను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భాను రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Tik Tok Bhanu: భారీగా ముట్ట చెబుతున్న మల్లెమాల..

ఈమె ఒక్కో షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో నటించినందుకు గాను ఈమెకు కేవలం ఒక్క కాల్ షీట్ కోసం మల్లెమాలవారు సుమారు లక్ష పాతిక వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారీటీ సంపాదించుకునేందుకు సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తాను సినిమాలలో నటించిన ప్రస్తుతం ఈ కార్యక్రమాలను వదిలి సినిమాలలోకి వెళ్లిన వారి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ అవకాశాలను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేమని, అందుకే తాను సినిమాలను రిజెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు.