Connect with us

Featured

డిసెంబర్ నెలలో థియేటర్లో సందడి చేసే సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి..

2021 చివరి నెల బాక్సాఫీస్ వద్ద సంచలనం స్పష్టించనుంది. నందమూరి బాలకృష్ణ సినిమాతో మొదలై థియేటర్లలో సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ

Published

on

2021 చివరి నెల బాక్సాఫీస్ వద్ద సంచలనం స్పష్టించనుంది. నందమూరి బాలకృష్ణ సినిమాతో మొదలై థియేటర్లలో సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ 2021లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా ఇక్కడ చూద్దాం. వాటిపై ఓ లెక్కేద్దాం.. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో డిసెంబర్ 2న ‘అఖండ’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘అఖండ’లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

Advertisement

ఈ వారాంతంలో థియేటర్లలోకి రానున్న మరో తెలుగు చిత్రం ‘స్కైలాబ్’. డిసెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉది. ‘స్కైలాబ్’ అనేది 1979 నాటి కామెడీ, డ్రామాగా తెరకెక్కింది. తమ గ్రామం పై స్పేస్ స్టేషన్ పడిపోతుందని ఒక గ్రామ ప్రజలు హృదయపూర్వకంగా భావించే సంఘటనల హాస్య మలుపుతో వ్యవహరిస్తారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
డిసెంబర్ రెండో వారంలో కొత్త సినిమాల హంగామా కనిపిస్తోంది. అవి నాగశౌర్య ‘లక్ష్య’, కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ మరియు శ్రియ ‘గమనం’.

అవన్నీ ఒకే రోజున – డిసెంబర్ 10న విడుదలకానున్నాయి. ‘లక్ష్య’ అనేది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ‘గుడ్ లక్ సఖి’ కూడా లంబాడా అమ్మాయి గురించి మాట్లాడే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గమనం’.. శ్రియా శరణ్, నిత్యా మీనన్, శివ కందుకూరి మరియు ప్రియాంక జవాల్కర్ చుట్టూ తిరిగే కథ. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

ఈ నెలలో అతిపెద్ద చిత్రం అల్లు అర్జున్ తొలి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ – ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ‘పుష్ప ది రైజ్’ డిసెంబరు 17న ఏకకాలంలో ఐదు భాషల్లో విడుదలవుతోంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత దర్శకుడు సుకుమార్‌ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ బిగ్గీ ‘స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్’ తెలుగులో కూడా విడుదలవుతోంది, ఇది ‘పుష్ప’కి ఒక రోజు ముందే థియేటర్లలోకి రానుంది. నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 25 న విడుదల అవుతుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది ఈ సినిమా. రాహుల్ సంకృతియన్ దర్శకత్వం వహించిన ఈ చింద్రంలో .. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ మరియు కృతి శెట్టి నటించారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే రోజున కపిల్ దేవ్ బయోపిక్ ’83’ కూడా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.

Advertisement

Featured

Ap: ఏపీ రుషికొండ భవనాలపై విమర్శలు.. సంచలన పోస్ట్ చేసిన వైసీపీ!

Published

on

Ap: జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈయన ఋషికొండను తవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా కొండలను తవ్వి సంపదను మొత్తం దోచుకుంటున్నారంటూ అప్పటి ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు అయితే ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ కు మరింత అందాన్ని రెట్టింపు చేస్తూ అక్కడ ప్రభుత్వ భవనాలను నిర్మించారు.

ఇక తాను రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ నుంచి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు కానీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు రావడంతో ప్రస్తుతం ఈ బంగ్లాలు అన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతల చేతులలోకి వెళ్లిపోయాయి.

ఇప్పటివరకు ఋషికొండ ప్రాంతంలో కట్టిన ఆ బంగ్లా ఎలా ఉంది అనే విషయాలు బయటకు రాలేదు కానీ మొదటిసారి తెలుగుదేశం పార్టీ నేతలు బంగ్లాలలోకి అడుగుపెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆ ఫోటోలను వైరల్ చేస్తూ ఎవరికోసం ఈ బాత్రూములు కట్టించావు అంటూ వైసీపీ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

జగన్మోహన్ రెడ్డి ఎవరికో స్కెచ్ వేసే ఇలా ఖరీదైన బాత్రూం కట్టించారు అంటూ విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఈ విమర్శలపై వైసీపీ స్పందించింది.

అవి ప్రభుత్వ భవనాలే..
రిషి కొండల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ప్రభుత్వ భవనాలే అవేవీ ప్రైవేట్ భవనాలు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని నిర్మించారు.. విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు 1995 నుంచి ఊదరగొడుతున్నారు.. అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి విశాఖకు వస్తే ఆదిత్యం ఇవ్వడానికి సరైన భవనం లేకపోవడం వల్లే వీటిని నిర్మించారని కానీ ఇప్పుడు టిడిపి పార్టీ ఈ ఫోటోలను విమర్శిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది అంటూ తెలిపారు.. టిడిపి వక్ర బుద్ధి అంటే ప్రజలకు తెలుసు అంటూ తెలియజేశారు.

Advertisement
Continue Reading

Featured

Renu Desai: బుద్ధి ఉంటే ఇలా మాట్లాడవు… పవన్ అభిమానికి ఇచ్చి పడేసిన రేణు దేశాయ్?

Published

on

Renu Desai: పవన్ కళ్యాణ్ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే అయితే ఈమె పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆయనకు దూరమయ్యారు. తనకు తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతోనే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అంటూ పలు సందర్భాలలో రేణు దేశాయ్ వెల్లడించారు.

ఇలా పవన్ కళ్యాణ్ కు దూరంగా తన పిల్లలతో కలిసి బ్రతుకుతున్న ఈమె పట్ల తరచూ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే కామెంట్లతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవకు దారితీస్తుంది అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఆయన పిల్లలు తన వెంటే ఉంటున్నారు.

ఇక ఈ విషయంపై రేణు దేశాయ్ కూడా సంతోషం వ్యక్తం చేసింది అయితే ఒక అభిమాని మాత్రం రేణు దేశాయ్ ను ట్యాగ్ చేస్తూ చేసిన పోస్టుపై రేణు దేశాయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సుధాకర్ అనే అభిమాని వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది.

Advertisement

పవనే నన్ను వదిలేసాడు..
ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాము అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ పోస్ట్ పై రేణు దేశాయ్ స్పందిస్తూ సుధాకర్ గారు మీరు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా.. బుద్ధి ఉంటే ఇలా మాట్లాడరు పవన్ కళ్యాణ్ కు నేను విడాకులు ఇవ్వడం ఏంటి ఆయనే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి అంటూ ఈమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Continue Reading

Featured

Ram Charan: కూతురి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చరణ్.. నిరాశలో అభిమానులు!

Published

on

Ram Charan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈయన నటుడుగా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయినటువంటి ఈయన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే నేడు ఫాదర్స్ డే కావడంతో చరణ్ తన కుమార్తె క్లిన్ కారాతో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తన కుమార్తె గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తన కుమార్తె అందరిని బాగా గుర్తు పడుతుందని చరణ్ తెలిపారు.

ఇలాంటి సమయంలో తనని వదిలి షూటింగ్ వెళ్లాలంటే చాలా బాధగా ఉంటుందని తనని చాలా మిస్ అవుతున్నానని తెలిపారు. ఇక తను కూడా నన్ను చాలా మిస్ అవుతుందని చరణ్ వెల్లడించారు. ఇక నేను షూటింగ్ లేకుండా ఇంట్లో ఉంటే రోజంతా తనతోనే గడుపుతానని తనకు ప్రతిరోజు నేనే తినిపిస్తానని ఆ విషయంలో నాతో ఎవరూ పోటీ పడలేరని తెలిపారు. నేను తినిపిస్తే తన కుమార్తె మొత్తం తింటుందని ఈయన తెలిపారు.

Advertisement

చాలా మిస్ అవుతున్నా..

ఇలాంటి సమయంలో తనని వదిలి షూటింగ్ వెళ్లాలంటే కాస్త బాధగా ఉంటుంది అందుకే తాను స్కూల్ కి వెళ్లే వరకు కూడా షూటింగ్ కంటే ఎక్కువగా తనకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా ఫాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!