Connect with us

Featured

డిసెంబర్ నెలలో థియేటర్లో సందడి చేసే సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి..

2021 చివరి నెల బాక్సాఫీస్ వద్ద సంచలనం స్పష్టించనుంది. నందమూరి బాలకృష్ణ సినిమాతో మొదలై థియేటర్లలో సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ

Published

on

2021 చివరి నెల బాక్సాఫీస్ వద్ద సంచలనం స్పష్టించనుంది. నందమూరి బాలకృష్ణ సినిమాతో మొదలై థియేటర్లలో సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ డిసెంబర్ 2021లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల జాబితా ఇక్కడ చూద్దాం. వాటిపై ఓ లెక్కేద్దాం.. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో డిసెంబర్ 2న ‘అఖండ’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘అఖండ’లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

Advertisement

ఈ వారాంతంలో థియేటర్లలోకి రానున్న మరో తెలుగు చిత్రం ‘స్కైలాబ్’. డిసెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉది. ‘స్కైలాబ్’ అనేది 1979 నాటి కామెడీ, డ్రామాగా తెరకెక్కింది. తమ గ్రామం పై స్పేస్ స్టేషన్ పడిపోతుందని ఒక గ్రామ ప్రజలు హృదయపూర్వకంగా భావించే సంఘటనల హాస్య మలుపుతో వ్యవహరిస్తారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
డిసెంబర్ రెండో వారంలో కొత్త సినిమాల హంగామా కనిపిస్తోంది. అవి నాగశౌర్య ‘లక్ష్య’, కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ మరియు శ్రియ ‘గమనం’.

అవన్నీ ఒకే రోజున – డిసెంబర్ 10న విడుదలకానున్నాయి. ‘లక్ష్య’ అనేది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ‘గుడ్ లక్ సఖి’ కూడా లంబాడా అమ్మాయి గురించి మాట్లాడే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గమనం’.. శ్రియా శరణ్, నిత్యా మీనన్, శివ కందుకూరి మరియు ప్రియాంక జవాల్కర్ చుట్టూ తిరిగే కథ. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

ఈ నెలలో అతిపెద్ద చిత్రం అల్లు అర్జున్ తొలి పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ – ‘పుష్ప ది రైజ్’. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ‘పుష్ప ది రైజ్’ డిసెంబరు 17న ఏకకాలంలో ఐదు భాషల్లో విడుదలవుతోంది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత దర్శకుడు సుకుమార్‌ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ బిగ్గీ ‘స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్’ తెలుగులో కూడా విడుదలవుతోంది, ఇది ‘పుష్ప’కి ఒక రోజు ముందే థియేటర్లలోకి రానుంది. నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ డిసెంబర్ 25 న విడుదల అవుతుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది ఈ సినిమా. రాహుల్ సంకృతియన్ దర్శకత్వం వహించిన ఈ చింద్రంలో .. సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ మరియు కృతి శెట్టి నటించారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే రోజున కపిల్ దేవ్ బయోపిక్ ’83’ కూడా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.

Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!