ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఓ విషాద సంఘటనతో చలించిపోయి, 650 మంది స్టంట్ మ్యాన్లకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు.

పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో ప్రమాదవశాత్తు స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందిన వార్తను విన్న అక్షయ్ కుమార్ తీవ్రంగా కలత చెందారు. దీంతో, పరిశ్రమలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే స్టంట్ మ్యాన్ల భద్రత పట్ల ఆందోళన చెంది, వారికి ఆర్థిక భద్రత కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే, ఆయన చొరవతో 650 మంది స్టంట్ మ్యాన్లకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ చేసిన ఈ పనిపై సినీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
































