Donates: సాధారణంగా మనం ఏదైనా పండుగల సమయంలోను లేదా ఎప్పుడైనా ఇతరులకు దానధర్మాలను చేస్తూ ఉంటాము. ఇలా ఇతరులకు మనం చేసే దానధర్మాల వల్ల వారు సంతోషించినప్పుడే మనం చేసిన దాన పుణ్యఫలం మనకు దక్కుతుంది. అందుకే పెద్ద ఎత్తున మన ఆర్థిక స్థోమతకు అనుకూలంగా దాన ధర్మాలను చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం మన ఇంటికి వచ్చిన వారికి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యానికి బదులు పాపం కలుగుతుంది.
ఇంటికి వచ్చినటువంటి వారికి మనం ఎప్పుడూ కూడా చిరిగిపోయిన బట్టలను అలాగే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలను లేదా లోహపు వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదు. ఇలా ఈ వస్తువులు కనుక ఇచ్చాము అంటే దానం చేసిన పుణ్యఫలం ఏమో కానీ పెద్ద ఎత్తున పాపం రావడమే కాకుండా లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది.
పుణ్యం కలుగుతుంది..
Advertisement
అందుకే పొరపాటున కూడా ఇలాంటి వస్తువులను పేదవారికి గాని ఇతరులకు కానీ దానం చేయకూడదు ముఖ్యంగా కొబ్బరి నూనెను కూడా మనం ఇతరులకు ఎప్పుడు దానం చేయకూడదు. మనం ఇతరులకు పెట్టే ఆహార పదార్థమైన ఇచ్చే దుస్తులు వల్ల అయినా కూడా వారు సంతోషంగా ఉన్నప్పుడే ఆ దానం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిరిసంపదలు కూడా కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ విధంగా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మహేష్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఈ క్రమంలోనే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఈ హీరోయిన్లతో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ మళ్లీ మళ్లీ హీరోయిన్లతో షేర్ చేసుకోవాల్సి వస్తే షేర్ చేసుకుంటానని తెలిపారు. త్రిషతో నటించడం చాలా సులభంగా ఉంటుందని అంతేకాకుండా తనతో నా స్క్రీన్ స్పేస్ బాగుంటుందని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య సీన్స్ అద్భుతంగా ఉండడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అని ఈయన తెలిపారు.
Advertisement
ఫ్రెండ్షిప్ కారణం… ఇక త్రిష తర్వాత సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఇష్టపడతానని తెలిపారు. అయితే ఈయన భార్య నమ్రత కూడా హీరోయినే, ఈమెతో కలిసి కూడా మహేష్ బాబు సినిమాలలో నటించారు కానీ ఈయన మాత్రం తన భార్య పేరు చెప్పకుండా త్రిష సమంత అంటూ తనకి ఇష్టమైనటువంటి హీరోయిన్లు మళ్లీమళ్లీ సినిమాలలో నటించాలనుకునే హీరోయిన్ల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Lakshmi Devi: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం ఎన్నో రకాల పూజలు వ్రతాలు హోమాలు చేస్తూ ఉంటారు. మనం కష్టపడి సంపాదించిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలని ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంది అంటే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సంకేతాలు కనుక మనకి ఎదురవుతూ ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉన్నట్టే.
మన ఇంటి ఆవరణంలో కోకిల తరచూ కూస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం అయితే ఉదయం సమయంలో ఆగ్నేయ మూలలో కోయిల కూస్తూ ఉంటే అది అశుభానికి సంకేతం కానీ సంధ్య సమయంలో ఆగ్నేయ దిశగా కోయిల కూస్తూ ఉంటే మంచిది. అలాగే మామిడి చెట్టుపై కోయిల కూస్తూ ఉంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని అర్థం.
ఇకపోతే నల్ల చీమలు ఇంట్లో కనపడితే అది లక్ష్మీదేవి రాకను చూచిస్తుంది ముఖ్యంగా చీమలు బియ్యాన్ని కనుక తీసుకు వెళుతూ ఉన్నట్టయితే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని అర్థం. ఇక బల్లి కూడా మనపై అనుకోకుండా పడితే అది కూడా అదృష్టమని కానీ కుడి వైపు బల్లి పడటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది.
Advertisement
నల్ల చీమలు సంపదకు సూచిక…
ఇంట్లో కనుక నల్ల చీమలకు బదులు ఎర్రటి చీమలు కనపడితే మనపై అప్పుల భారం పెరుగుతుందని అర్థం. ఇక చాలామంది ఇళ్లల్లో కొన్నిసార్లు అనుకోకుండా పాము కనబడుతూ ఉంటుంది ఇలా పాము కనబడటం వల్ల ఏదైనా దోషం ఉందా అని భావిస్తూ ఉంటారు కానీ పాము కనబడటం లక్ష్మీదేవి రాకకు సూచిక అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంకేతాలు కనుక కనపడితే మీ పై లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లే.
Kailasa parvatham mistery : ప్రపంచంలోని ఎత్తయిన పర్వాతాలను చాలా మంది అధిరోహించారు. ఏకంగా ఎవరెస్టును కూడా అధిరోహించారు. కానీ ఎవెరెస్టు కంటే తక్కువ ఎత్తులో ఉండే కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎందుకు ఎక్కలేకపోయారు. అక్కడ అతీత శక్తులు ఉన్నాయా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మన భారతీయ సంస్కృతి రామాయణం, మహా భారతంను దాటి పక్కకు పోదు. చిన్నతనం నుండి మనం ఏదో ఒక సందర్బంలో రామాయణ, మహా భారత గాధలనే కథలుగా వింటూనే ఉన్నాం. అలా రామాయణంలో రావణుడి గురించి తెలుసుకున్నాం. రావణుడు శివని అపరభక్తుడు. ఆయన ఆత్మలింగాన్ని పొందడానికి ఆయన పది తలలను శివునికి అర్పించారు. ఈ విషయం మనం కథలలో తెలుసుకున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. అది మరెక్కడో కాదు ఈ కైలాస పర్వతం మీదనే.
కైలాస పర్వతం మీద నిజంగానే శివుడు ఉన్నాడా…
కైలాస పర్వతంకి అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే, కౌలస అనే సంస్కృత పదం నుండి వచ్చింది. కౌలస అనగా స్పటికం అని అర్థం. కైలాస పర్వతం ఇప్పటి టిబెట్ ప్రాంతంలో అనగా నేడు చైనా ఆక్రమిత టిబెట్ లో ఉంది. దాదాపు ఎన్నో కోట్లమంది ప్రజలు ఈ కైలాస పార్వతంను ఆధ్యాత్మిక ప్రాంతంగా భావించి పూజిస్తున్నారు. ఇక ఈ పర్వతం ఎత్తు 6.6 కిలోమీటర్లు. ప్రపంచంలోని ఎన్నో ఎత్తయిన పర్వతాలలో ఇదీ ఒకటి. ఇక ఈ పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిరోహించలేదు కానీ పర్వతపు మొదలుకు వెళ్లి పూజలు చేస్తారు. అక్కడ ఉన్న రెండు సరస్సులు ఒకటి మానస సరోవర్ మరొకటి రాక్షస్థల్. మానస సరోవరం బ్రహ్మ మనసు నుండి పుట్టింది. ఇక ఇక్కడ మునక వేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని నమ్మకం. ఇది సూర్యుని వెలుగుకు ప్రతీక కాగా పక్కన ఉన్న రాక్షస్థల్ ఉప్పు నీటి సరస్సు. ఇది చంద్రుని ఆకారంలో ఉంటుంది. ఇందులో రావణాసురుడు తన ఒక్కోతలను ఒక్కోరోజు బలిగా శివునికి అర్పించాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ సరస్సులో ఎవరూ మునగరు.
Advertisement
ఇక మానస సరోవరం లో బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే వేకువ జామున కైలాస పర్వతం నుండి శివుడు వచ్చి స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సాక్ష్యంగా కైలాస పర్వతం నుండి ఆ సమయంలో మానస సరోవరం కు ఒక వెలుగు రావడం చూశామని చాలా మంది భక్తులు చెప్పారు. అయితే ఈ వెలుగు ఎందుకు వస్తోందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇక ఈ పర్వతం వద్ద వృద్దాప్యం త్వరగా వస్తుంది, రెండు వారాలలో పెరగాల్సిన గోర్లు, వెంట్రుకలు 12 గంటలలోనే పెరుగుతాయి దీనికి కారణం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఇది కూడా ఈ పర్వతాన్ని అధిరోహించక పోవడానికి కారణం. రేడియేషన్ అధికంగా ఉండే ఈ పర్వతం అధిరోహించడానికి ప్రయత్నించిన ఎంతో మంది విఫలం అయ్యారు. చైనా ప్రభుత్వం హెలీకాప్టర్ ద్వారా ఈ పర్వతం ఎక్కాలని ప్రయత్నించినా హెలీకాప్టర్ కూలిపోయింది. రెండు సార్లు పర్వతారోహకులకు ఎక్కడానికి అవకాశం కల్పించినా వారు విఫలమయ్యారు. అక్కడికి చేరుకున్న ఎంతో మంది మార్గం మధ్యలోనే అదృశ్యమయ్యారు. దీంతో ఇక ఇప్పుడు ఈ పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేదించారు. ఎంతో మంది మత విశ్వాసాలకు భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.