మన దగ్గర ఏమైనా పాత వెహికిల్స్ ఉంటే.. అంటే 15 ఏళ్ల కంటే ఎక్కువ గడువు ఉన్నవి వాటి రెన్యూవల్ కు ఎక్కువ డబ్బులను ఇక నుంచి పే చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2022 నుంచి కొత్త రూల్స్ అమలులోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

నోటిఫికేషన్ లో పేర్కొన్న విషయాలు ఏంటంటే.. రిజిస్ట్రేషన్ జరిగి 15 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు అయితే ట్రక్, లేదా బస్సుల ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్కు 8 రెట్లు అధిక చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం దాని రెన్యూవల్ కు రూ.1500 ఉండగా.. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అదనంగా రూ.12500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాత కారు విషయానికి వస్తే.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ రెన్యూవల్ రూ.600 ఉండగా.. 15 ఏళ్ల నాటి కారు అయితే ఏప్రిల్ 1, 2022 నుంచి రూ.5వేల కట్టాల్సిందే. ఇక టూవీలర్ల విషయంలో కూడా నియమ, నిబంధనలను వర్తింపజేశారు. ప్రస్తుతం రూ.300 తీసుకోనుండగా 15 ఏళ్లు దాటిని టూవీలర్ అయితే వచ్చే ఏప్రిల్ నుంచి రూ.1000 రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చార్జీ చెల్లించుకోవాలి.
అంతేకాకుండా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకునే వాహనాలకు ఆ గడువు ముగిసిపోయిన రోజు నుంచి ప్రతీ రోజు రూ.50 అదనపు ఫీజు వసూలు చేయనున్నారు. అదే రిజిస్ట్రేషన్ గడువు అయిపోతే మాత్రం.. రూ.200 అదనపు చార్జీ ప్రతీ రోజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుము కింద మరో రూ.300 నుంచి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కఠిన నిబంధనలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.































