Flight mode on airplanes : ప్రస్తుతం మన ఊరుకుల పరుగుల జీవితంలో ప్రతి నిమిషం అమూల్యమే.ప్రపంచీకరణం అయిపోవడంతో ప్రపంచం నలుమూలలలోనూ అన్ని దేశాల వాళ్లు అవకాశాల కోసం పయనిస్తున్నారు. దీంతో విమానాలను ఉపయోగించడం ఎక్కువైంది. మనిషి కనుగొన్న గొప్ప ఆవిష్కరణలలో విమానం ఒకటి ఇది ప్రపంచాన్ని అనుసంధానించింది . నేడు దేశియంగాను ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్లాలన్నా, ఇతర దేశాలకు వెళ్లాలాన్న విమానాలే ప్రత్యామ్నాయం అలాంటి విమానాలలో ప్రయాణం ఎంత వరకు సురక్షితం అన్నధే ఇప్పుడు ప్రశ్న.

ఫోన్ వాడితే విమాన ప్రమాదం జరుగుతుంది…..
ప్రస్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరు ఉండటం లేదు. ప్రతి నిత్యం స్మార్ట్ ఫోన్ తో పని ఉంటోంది. అయితే విమానాల్లో వెళ్ళేటపుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని చెప్తారు. తోలుత ఈ నిబంధన అమలు అంత కఠినంగా లేకపోయినా ప్రస్తుతం చైనా వంటి దేశాలు విమానాల్లో వెళ్ళేటపుడు ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకోవాలనే నిబంధన కఠినంతరం చేసింది. పాటించనివారికి జరిమానా జైలుశిక్ష వంటివి కూడా అమలు చేస్తోంది. అయితే అసలు ఎందుకు మొబైల్స్ విమానంలో వినియోగించకూడదు అన్నదే ఇప్పుడు చర్చ. నిజానికి మొబైల్ సిగ్నల్స్ అలాగే రేడియేషన్ వల్ల విమానంలో పైలెట్లకు అంతరాయం కలుగుతుంది. అలాగే అనవసరమైన శబ్దలు వస్తాయి. ఇక మొబైల్ సిగ్నల్స్ వల్ల కాక్ పిట్ లు సరైన సమాచారం అందడంలో అంతరాయం కలుగుతుంది.

అధికాక ఒక సర్వే ప్రకారం దాదాపు 2000 నుండి 2020 వరకు జరిగిన విమాన ప్రమాదాలు మొబైల్స్ ఆన్ లో ఉండటం వల్లే జరిగాయాని చెబుతున్నాయి. విమానం గాలిలోకి ఎగిరే మూడు నిమిషాల ముందు అలాగే కిందికి ల్యాండ్ అయ్యే సమయంలోనే స్మార్ట్ ఫోన్ వల్ల ప్రమాదం జరుగుతోందని అంచనాలు వేస్తున్నారు. అయితే తాజాగా వస్తున్న స్మార్ట్ ఫోన్స్ వల్ల అటువంటి సమస్యలు తలెత్త వంటు మరి కొందరు చెబుతున్నారు. అందుకే విమానల్లో వైఫై సదుపాయంకూడా కల్పిస్తున్నారని చెబుతున్నారు ఏది ఏమైనా బస్ ,ట్రైన్ ప్రయాణం కన్నా విమాన ప్రయాణం సురక్షితం అలాగే వేగవంతం అయిన మొబైల్ ఫ్లైట్ మోడ్ పెట్టడం ఉత్తమం.



























