Connect with us

General News

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

Budget Session: పార్లమెంట్ లో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇప్పటికే ప్రతిపక్షాలు

Published

on

Budget Session: పార్లమెంట్ లో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారంటూ.. బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా విమర్శించారు. 

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!
Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు తమ విభజన డిమాండ్ల సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రస్తావిస్తున్నారు.

Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!
Budget Session: ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయండి..! రాజ్యసభలో ఎంపీ డిమాండ్..!

రాజ్యసభలో జీరో అవర్ లో రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలంటూ.. టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవతున్నా… కేంద్ర ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఢిల్లీలో తెలంగాణ భవన్ కు భూమి, గిరిజన యూనివర్సీటీని ఏర్పాటు చేయలేదని కేంద్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.


విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని ..

మరోవైపు ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రాజ్యసభలో జీరో అవర్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 8 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాలని కేంద్రాన్ని కోరారు. పేపర్ లీక్, కోర్ట్ కేసులతో ఒక పరీక్ష మూడేళ్ల పాటు నడుస్తోందని… దీని వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!