ప్రేమించిన అమ్మాయి, భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ఏప్రిల్ 16వ తేదీని ఖరారు చేశారు. అయితే, పెళ్లి తేదీకి నెల రోజుల ముందు లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇరువురి కుటుంబాలు చర్చించుకుని మే 14వ తేదీని ఖరారు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మే 29 వరకు పొడిగించడంతో ఇక ఈ పరిస్థితి ముగిసే వరకు పెళ్లిని వాయిదా వేయాలని నిఖిల్ అనుకుంటాడట కానీ, దరిదాపుల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో రేపు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఈరోజు హీరో నిఖిల్ ని పెళ్లి కొడుకుని చేసారు. రేపు హైదరాబాద్లో కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు.


నిఖిల్ సిద్ధార్థ, పల్లవి వర్మ రేపు పెళ్లిపీటలు ఎక్కనున్నారు.

పల్లవి వర్మ
































