Heroin Sneha : సుహాసిని రాజారామ్ నాయుడు ఆమె వెండితెర పేరు స్నేహ , ప్రధానంగా తమిళం, కన్నడ మలయాళం మరియు తెలుగు భాషా చిత్రాలలో నటించారు.ఆమె అనిల్ బాబు దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఇంగనే ఒరు నీలపక్షి (2000)లో ఆమె రంగప్రవేశం చేసింది.ఆమె తమిళంలో ఆర్. మాధవన్ సరసన నటించిన ఎన్నవలే చిత్రంతో తొలిసారిగా అదే సంవత్సరంలో విడుదలైంది. ఆమె 2001 సంవత్సరంలో “ప్రియమైనా నీకు” చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది, అది కమర్షియల్గా విజయం సాధించింది. దీని తరువాత, ఆమె వెంకీ (2004) వంటి విజయవంతమైన తెలుగు చిత్రాలలో కనిపించింది. రాధాగోపాలం(2005), శ్రీరామదాసు(2006). ఆ తర్వాత కొన్ని మలయాళ కన్నడ చిత్రాల్లో కూడా స్నేహ నటించారు.
ఫాజిల్ నజీమ్ తన ప్రేమకథ “ఇంగనే ఒరు నీలపక్షి “(2000) కోసం హీరోయిన్ కోసం వెతుకుతున్న అనిల్-బాబుకి స్నేహను సిఫార్సు చేశాడు. ఈ చిత్రంలో స్నేహ ఒక అభిరుచి గల డాన్సర్గా కనిపించింది, నటి ఏడు శాస్త్రీయ పాటలకు ప్రదర్శన ఇచ్చింది. 2000లో సుసి గణేశన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం విరుంబుగిరెన్ కోసం ఆమె సంతకం చేయబడింది, అయితే ఇది చాలా ఆలస్యం అయింది మరియు మాధవన్ సరసన నటించిన “ఎన్నవలే” ఆమె మొదటి తమిళ విడుదల అయింది. ఆమె తన అద్భుతమైన నటనకు అనేక ప్రశంసలు అందుకుంది.
“అచ్చముందు”లో తొలిసారిగా ప్రసన్నతో స్నేహ జతకట్టింది. అచ్చముండు (2009) అప్పటి నుండి, వారి సంబంధంపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ప్రసన్న తన అన్ని మోడలింగ్ షోలలో కనిపించింది మరియు సినిమా ప్రివ్యూలలో ఇద్దరూ కలిసి కనిపించారు. ఇద్దరూ దానిని పుకారుగా కొట్టిపారేసినప్పటికీ, తరువాత, 9 నవంబర్ 2011న, ప్రసన్న, “అవును… స్నేహ మరియు నేను మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము” అని ప్రకటించారు. వారు 11 మే 2012 న చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి చెన్నైలో నివాసం ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి.
2015లో, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన, ఉపేంద్ర సరసన అల్లు అర్జున్, సమంతా, నిత్యా మీనన్లతో కలిసి S/O సత్యమూర్తి తెలుగు చిత్రంలో స్నేహ కనిపించింది. ఇది బ్లాక్ బస్టర్గా నిలిచింది. అది ఆమె 2015లో విడుదలైన ఏకైక చిత్రం మరియు అప్పటి నుండి ఆమె ప్రసూతి విరామంలో ఉంది. 2019లో, ఆమె తెలుగు-భాషా చిత్రం వినయ విధేయ రామ మరియు చారిత్రాత్మక కన్నడ-భాషా చిత్రం కురుక్షేత్రలో నటించింది…
ఈ మధ్య కాలంలో స్నేహ ఓ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సౌందర్య చనిపోవడం మీకు “ప్లస్ పాయింట్ అనేది టాక్ “అని యాంకర్ అడుగగా… ఆ విషయంతో నేను ఏకీభవించను, నేను సౌందర్యకు చాలా పెద్ద అభిమానిని నేను ఒక సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఆమె మరణవార్త విన్నాను.ఆ వార్త నన్ను కలచివేసిందని.. సినీ పరిశ్రమలో ఎవరి స్థానం వారిదని సౌందర్యకు ఉండే స్థానం ఎప్పటికి ఉంటుందని దాన్ని ఎవరు పూర్తి చేయలేరని ఆమె భౌతికంగా మనతో లేకపోయినప్పటికీ ఆమె నటించిన సినిమాలతో మనకు దగ్గరగా ఉన్నారని హీరోయిన్ స్నేహ చెప్పుకొచ్చారు.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.