Bigg Boss: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో అన్ని టాస్క్ లు ఒక ఎత్తు అయితే.. ఐస్ టాస్క్ మరో ఎత్తు అయింది. ఎందుకంటే.. ఇది టికెట్టు ఫినాలేకు సంబంధించిన దానిలో మొదటి పార్ట్. ఇందులో మానస్ కు ఎక్కువ పాయింట్లు వచ్చాయి. అందులో దీనిలో సన్నీ చేసిన బిహేవియర్ వల్ల.. కచ్చితంగా కాళ్లను కొంతమంది ఐస్ లోనే ఉంచాల్సి వచ్చింది.

అందులో ముఖ్యంగా సిరి, శ్రీరామచంద్ర ఎక్కువగా బాధపడ్డారు. వాళ్లు వైద్యుడిని సంప్రదించి కాళ్లకు కట్లుకూడా వేయించుకున్నారు. అంత ఎఫెక్ట్ అయింది వారికి. ఇక సీజన్ ముగిసింది. అందురూ ఇంటికి కూడా వెళ్లిపోయారు. అయితే శ్రీరామచంద్ర అతడి కాళ్లను చూపిస్తూ.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..!

అందులో అతడి రెండు లెగ్స్ సంబంధించి చర్మం మొత్తం ఊడిపోయి.. కొత్త చర్మం వచ్చింది. అంతే కాదు అతడికి ఇంకా పెయిన్ కూడా ఉందని చెప్పాడు. అన్నీ భరిస్తూ.. టికెట్టు ఫినాలే సాధించాడు. తర్వాత కూడా తన నొప్పిన సైతం లెక్కచేయకుండా.. చాలా టాస్కులల్లో పాల్గొన్నాడు. సిరి విషయంలో కూడా అంతే. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతుండా.. ఆమె కాళ్లను చూపించింది. అందులో ఆమె పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి.
ఇలా వీళ్లిద్దరు ఇంత బాధను భరిస్తూ.. పైకి నవ్వుతూ ఎలా ఉన్నారంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వీటిపై బిగ్ బాస్ నిర్వాహకులపై నెటిజన్లు దమ్మెత్తిపోస్తున్నారు. శ్రీరామ్, సిరిల పాదాలకు బొబ్బలు వచ్చి చర్మం ఊడిపోయిన విషయాన్ని ఎందుకు వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాస్క్ ల పేరుతో ఇంత ఘోరంగా కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టాలా.. వాళ్లకు జరిగిన నష్టాన్ని బయటకు చూపించి ఉంటే.. కానీసం సానుభూతి ఓట్లు అయినా పడేవి కదా అంటూ కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రాణాల మీదకు వచ్చే టాస్క్ లు బిగ్ బాస్ ఇవ్వడం మానుకోవాలని చెబుతున్నారు.
































