Connect with us

Featured

శోభన్ బాబు గొప్పతనం తెలిస్తే.. చెయ్యి ఎత్తి దండం పెడతారు !!

Published

on

తెలుగు సినీ చరిత్రలో ఎందరో గొప్ప నటీ నటులను మనము చూసే ఉంటాము. జీరో స్థాయి నుంచి ఎదిగి ఎన్నో అవార్డులను సాధించి, ఎంతో పేరు ప్రఖ్యాతలను ఎంతో కీర్తిప్రతిష్టలను సాధించిన వాళ్లను కూడా మనం చూసే ఉంటాము. అలా ఒక గొప్ప స్థాయికి ఎదిగి, ఎందరో అభిమానులను సొంతం చేసుకుని, వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న నటుడు శోభన్ బాబు. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు అనే చెప్పాలి. ఎందుకంటే శోభన్ బాబు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. శోభన్ బాబు అంటే సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకత ఉంది.

మన తెలుగు చిత్రసీమ అందగాడు మన శోభన్ బాబు. ఎందరో ఆడవాళ్ళ మనసుని కుడా దోచుకున్న నటుడు ఈయన. శోభన్ బాబు చాలా అందంగా ఉండేవాడు. అలాగే శోభన్ బాబు కి జుట్టే అందం. శోభన్ బాబు జుట్టుకు ఉండే రింగ్ చాలా ఫేమస్ అయింది. అంతటి గొప్ప సినీ నటుడు గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఈ రోజు మీకోసం. ఈయన 1937 జనవరి 13న జన్మించాడు. అంటే సంక్రాంతి పండుగ రోజున జన్మించారు. అలాగే 1952 లో భక్త శబరి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగప్రవేశం చేశాడు. ఆయన సినిమా రంగంలోకి రాక ముందు అనేక నాటక ప్రదర్శనలను ఇచ్చారు. ఆయన రాక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక కొత్తదనాన్ని తీసుకువచ్చింది. అప్పట్లో మంచి అందగాడుగా, రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో శోభన్ బాబు గారు ఒకరు. అలనాటి మేటి హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి టాప్ హీరోల జాబితాలో చేరిపోయారు శోభన్ బాబు గారు. దాదాపు 200 పైగా సినిమాలు చేసి ఎక్కడలేని స్టార్ డమ్ ను సంపాదించుకుని, చిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపేశాడు శోభన్ బాబు.

ఆయన గురించిన ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే.. అప్పట్లో శోభన్ బాబుతో నటించాలంటే హీరోయిన్లు అందరూ పడి చచ్చిపోయేవారట. శోభన్ బాబుతో సినిమా అంటే హీరోయిన్లంతా నేనంటే నేను అని పోటీపడేవారట. అయితే కేవలం సిల్వర్ స్క్రీన్ మీద మనకు కనిపించే శోభన్ బాబు ఎంత మంచివారో, వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో విలువలతో ముందుకు సాగిపోయేవారు. శోభన్ బాబు తన జీవితాన్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో సాధించకొచ్చాడు. తనకు తగ్గ పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్రలో ఎలా నటించాలో అనే తరహాలో ఆయనను ఆయనే మలుచుకునే వాడు. అభిమానులు ఆరాధించే తన అందాన్ని కాపాడుకోవడానికి, అలాగే తాను అందంగా కనిపించడానికి ఎప్పటికప్పుడూ శరీరంపై దృష్టి పెట్టే వాడు. యోగ, వ్యాయామాలు చేస్తూ ఎంతో ఆరోగ్యంగా కనిపించేవాడు. అలా సినిమా రంగంలో ఎన్నో సినిమాలు తీసి మంచి హిట్లు సాధించి, ఒక గొప్ప నటుడిగా గుర్తింపు పొందాడు. అయితే కొంతకాలం తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. వయసు పెరుగుతున్న కొద్దీ మిగతా హీరోల లాగా శోభన్ బాబు బయట అభిమానులకు కనిపించడం మానేసాడు. కారణం ఏంటి అని అడిగితే తాను అందగాడిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి, ఎందరో అభిమానుల దృష్టిలో సోగ్గాడుగా చెరగని ముద్రగా మారిపోయాను. ఇంకా వాళ్ళ అందరి గుండెల్లో నా ముఖచిత్రం అంతే అందంగా అలాగే ఉండిపోవడం నాకిష్టం. ఇంకా ఈ వృద్ధాప్యంలో ఇక తాను తన అభిమానులకు కనిపించి వాళ్ళని నిరుత్సాహపరచడం నాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు నన్ను చూసి నా అభిమానులు నిరుత్సాహ పడకూడదు, అందుకనే వయసు పైబడిన తరువాత నేను అభిమానులకు కనపడటం నాకు ఇష్టం లేదు అని సినిమారంగం నుంచి విరామం తీసుకున్నాడు.

అయితే అలా సినీ రంగం నుంచి విరామం తీసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా ఏ సినిమా ఫంక్షన్స్ కు గాని, చిత్ర సీమలో జరిగే అవార్డుల ఫంక్షన్స్ కు గాను రాలేదు. శోభన్ బాబు వ్యక్తిగత విషయానికి వస్తే తన మాస్టారు కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. శోభన్ బాబు భార్య పేరు శాంత కుమారి. శోభన్ బాబుకు నలుగురు పిల్లలు. వాళ్లలో ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కూతుర్ల పేర్లు ప్రశాంతి, నివేదిత, మృదుల. కొడుకు పేరు కరుణ శేషు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. సినిమా రంగంలో ప్రవేశించిన వాళ్ళు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ వారసులల్లో ఎవరో ఒకరని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ, ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న శోభన్ బాబు.. తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పేవాడు కాదు. అలాగే తన వారసులను ఎవరిని కూడా సినిమా రంగంలోకి తీసుకురావటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు శోభన్ బాబు. ఎందుకంటే సిల్వర్ స్క్రీన్ పై కనిపించడమే కాకుండా సినీ రంగంలో ఉన్న రాజకీయ ఒడిదొడుకులను తన కుటుంభ సభ్యులు ఎవ్వరు కుడా ఎదుర్కోకూడదని, ఆ కష్టాలు తన పిల్లలు పడకూడదని, తన పిల్లల్ని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనివ్వలేదు. ఎవరికి నచ్చినట్టు వారి యొక్క జీవితాన్ని మలిచారు.

ఇక పిల్లలందరినీ మంచి వ్యాపారాల్లో పెట్టి, మంచి వ్యాపారస్తులుగా తీర్చిదిద్ది, వాళ్లకు ఇష్టమైన పని ఎంచుకోమని చెప్పారు. భార్య శాంతకుమారి. పేరుకి తగ్గట్టే శోభన్ బాబు భార్య కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో శాంతంగా అణుకువగా ఉంటూ శోభన్ బాబు సినీ ప్రయాణంలో చేదోడు వాదోడుగా ఉండేది. శోభన్ బాబు గారు తన 71 వ ఏట గుండెపోటుతో మరణించారు చెన్నైలోని తన స్వగృహంలో మరణించారు. ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితం గడపలేదు. డబ్బును పొదుపు చేయడంలో, మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఎందరికో సహాయాలు, దానాలు చేసినా, ఎందరికో ఇళ్ళు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు. సిల్వర్ స్క్రీన్ పై ఒక ఊపు ఊపేసిన అంతకాలం శోభన్ బాబు గారు తన వ్యక్తిగత విషయాలను ఎవరికీ పంచుకోవటానికి ఇష్టపడేవారు కాదు. ఇకపోతే శోభన్ బాబు అభిమానులు అంతా తమ హ్యాండ్సమ్ హీరో అయిన శోభన్ బాబే ఇలా ఉంటే శోభన్ బాబు యొక్క వారసులు ఇంకా ఎంత అందంగా ఉంటారో అని చాలా ఆతృతగా ఎదురు చూసేవారు. కానీ, శోభన్ బాబు తన పిల్లల్ని తన భార్యను కానీ, బందు మిత్రులను కానీ ఎలాంటి పరిస్థితులలోనూ బహిర్గతం చేయలేదు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!