దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అసలు ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుంది. పిల్లల స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారు అనే విషయంపై అనేక సందేహాలు దేశ ప్రజలలో నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ ఫాఖ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. స్కూల్లు ఎప్పుడు తెరుస్తారు అనే అంశంపై క్లారిటీ ఇచ్చారు.

అయితే దీనిపై ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ముగిసిన తరువాత కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్ష జరుగుతుందని, ఆ సమీక్షలో తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి విద్యాసంస్థలు ఎప్పుడు పునఃప్రారంభిస్తారు అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్లు రి-ఓపెన్ చేయడం కంటే, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం ముఖ్యమని మంత్రి అన్నారు. ఒకవేళ ఏప్రిల్ 14 తరువాత విద్యాసంస్థలు తెరవడం సాధ్యపడకపోయినా విద్యార్థులు నష్టపోయేది ఏమి ఉండదని చెప్పారు. పరీక్షల నిర్వహణ, పేపర్ల వాల్యుయేషన్ లు ఆ తరువాత అయినా చేసుకోవచ్చని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యపడదు కాబట్టే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు సీబీఎస్ఈ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేస్తూ కేంద్ర మానవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది.




























