Connect with us

Movie News

పద్మశ్రీ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన దర్శకులు..!!!

Published

on

వైఫ్ చిత్ర దర్శకులు, రచయిత, నటులు రావిపల్లి రాంబాబు గారి జన్మదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం పద్మశ్రీ చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించింది. ఈ సందర్భంగా రాంబాబు గారు మాట్లాడుతూ “తన అభిమాన ఆత్మీయుడు, అయిన ఎస్. ఎస్. పట్నాయక్ చిత్ర దర్శకునిగా మారడమే కాకుండా సొంతంగా ఎస్.ఎస్.పిక్చర్స్ అంటూ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది” అని… ఈ సందర్భంగా పద్మశ్రీ మోషన్ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు శివ నాగేశ్వర రావు, దేవి ప్రసాద్, వీరశంకర్, మోహన్ గౌడ్, చిత్తరంజన్, వర్ధమాన నటుడు దినేష్ తదితరులు హాజరయ్యారు.
అందరికీ క్యాచీగా ఉండే పేరు పద్మశ్రీ అని పోస్టర్స్ కూడా ఇన్నోవేటివ్ గా ఉన్నాయని దర్శకులు శివ నాగేశ్వరావు గారు కొనియాడ గా… అంతా కొత్తవారితో చేసిన ప్రయత్నం సక్సెస్ అయితే ఎంతోమంది నూతన నటీనటులకు సాంకేతిక నిపుణులకు గుర్తింపు అవకాశాలు లభిస్తాయని దర్శకులు దేవి ప్రసాద్ గారు తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు! అయితే పద్మశ్రీ అనే టైటిల్ తోనే దర్శక నిర్మాతలు సగం సక్సెస్ సాధించేశారని దర్శకులు వీర శంకర్ గారు కొనియాడారు!

చిత్ర రచయిత, దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ మాట్లాడుతూ సినిమా ప్రారంభం నుండి ప్రతి విషయానికి ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించకుండా తనపై ఎంతో.. పూర్తి నమ్మకంతో వారి వారి సహాయ సహకారాలు అందిస్తు… ఈ కార్యక్రమానికి హాజరైన చిత్ర ఎడిటర్ కంబాల శ్రీనివాస రావు గారికి, కో ప్రొడ్యూసర్స్ మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ గార్లకి తన కృతజ్ఞతలు తెలియజేశారు!

Advertisement

ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై జ్యోతి, రావిపల్లి సంధ్య, కనిక ఖన్నా, రమ్య, కిషోర్, సతీష్, హర్ష, కాళీ చరణ్, చక్రి, ఫన్నీ రాజు, డా. ప్రవీణ్, జయశ్రీ, ఎస్ ఎస్ పట్నాయక్ ఇలా అంతా వర్ధమాన నటీనటులతో చేసిన ఈ యాక్షన్ ఓరియంటెడ్ హారర్ కామెడీ ఫిలిం పద్మశ్రీ కి నిర్మాత: సదాశివుని శిరీష, ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, సంగీతం: జాన్ పోట్ల, ఆర్ట్: మణిపాత్రని, ఫైట్స్: దేవరాజు మాస్టర్, డాన్స్ తారక్, వెంకట్, గ్రాఫిక్స్: డాట్ యానిమేషన్ కంపెనీ. డిజిటల్ పబ్లిసిటీ: బి.ఆర్.కె అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ Pvt ltd.  పి ఆర్ ఓ: సతీష్ పాలకుర్తి, పర్వతనేని రాంబాబు

 

 

Advertisement

Continue Reading
Advertisement

Featured

Pushpa 2: పవన్ తో బన్నీ వైరం.. పుష్ప 2 కి దెబ్బ తప్పదు… డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

Published

on

Pushpa 2: ప్రస్తుతం టాలీవుడ్ డ్రెస్ లో మెగా వర్సెస్ అల్లు అనే వివాదం కొనసాగుతుంది. మెగా కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించగా పవన్ కళ్యాణ్ మాత్రం తన స్నేహితుడు వైసీపీ నేతకు మద్దతుగా నిలవడంతో మెగా వర్సెస్ అల్లు అనే విధంగా వివాదం కొనసాగుతుంది.

ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియకపోయినా ఆయన భారీ మెజారిటీతో గెలిచి నేడు ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమాలకు భారీ దెబ్బ పడుతుందంటూ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ గీతాకృష్ణ ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ సినిమాలలో తోపు కాని రాజకీయాలలో ఒక బచ్చా అని తెలిపారు.. ప్లాన్డ్ గా సినిమాలు చేసి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక అనుకోకుండా ఈయనకు నేషనల్ అవార్డు రావడంతో ఈయన క్రేజ్ ఎక్కడికో పెరిగిపోయింది.

Advertisement

ఇక మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య వివాదం నడుస్తుంది. ముఖ్యంగా అల్లు అరవింద్ కు పవన్ కళ్యాణ్ అంటే చిన్నచూపు ఈయన వివిధ విధానాలు పవన్ కళ్యాణ్ కు నచ్చకపోవడంతో మొదటి నుంచి కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక గేమ్ ఛేంజర్ అవుతారని అల్లు అరవింద్ ఊహించలేదు.

గేమ్ ఛేంజర్…
ఇలా పవన్ కళ్యాణ్ కు కాకుండా ఒక పబ్ లో పరిచయం అయిన శిల్పా రవి కోసం అల్లు అర్జున్ వెళ్లడం తప్పేనని ఆ ప్రభావం తన తదుపరి సినిమా పై పడుతుందని ఇప్పటికైనా అల్లు అర్జున్ మెగా కుటుంబంతో సంధి చేసుకుంటే మంచిది అంటూ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Raviteja: తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రవితేజ.. వైరల్ అవుతున్న హరీష్ శంకర్ పోస్ట్?

Published

on

Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రవితేజ సైతం వరుస కాల్ షీట్స్ సినిమా కోసం కేటాయించారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లోకేషన్ నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ ఫోటో చూస్తున్నటువంటి అభిమానులు ఒక్కసారిగా కంగారు వ్యక్తం చేస్తున్నారు. రవితేజకు ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోలో భాగంగా రవితేజ మెడకు బెల్ట్ పెట్టుకుని ఉండగా పక్కనే హరీష్ శంకర్ దానిని పట్టుకొని ఉన్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన ఈయన రవితేజ మెడకు తీవ్రమైన నొప్పి వస్తుందని వెల్లడించారు.

Advertisement

మెడ నొప్పి సమస్య..
మీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్.. ఇంత తీవ్రమైన మెడ నొప్పిలో కూడా షూటింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు థాంక్యూ అన్నయ్య అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈయన తీవ్రమైన మెడ నొప్పి సమస్యతో బాధపడుతున్నప్పటికీ షూటింగ్ ఆగిపోకూడదని నిర్మాతలు నష్టపోకూడదని తన నొప్పిని సైతం లెక్కచేయకుండా షూటింగ్లో పాల్గొన్నారు తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Niharika: బన్నీని అన్ ఫాలో చేసిన తేజ్.. అలా రియాక్ట్ అయిన నిహారిక?

Published

on

Niharika: నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిహారిక మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు మీడియా నుంచి వివిధ రకాలుగా ప్రశ్నలు ఎదురయ్యాయి.

ముఖ్యంగా ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మెగా వెర్సెస్ అల్లు అనే విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే మెగా సంబరాలలో కానీ పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కానీ అల్లు కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు.

ఇకపోతే మెగా హీరో అయినటువంటి సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డిని కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో ఈయన అన్ ఫాలో కావడంతో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలోనే మీడియా వారు తేజ్ బన్నీని అన్ ఫాలో చేయడం గురించి ప్రశ్నించారు.

Advertisement

అవునా.. నిజమా
మీడియా వారి నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురు కావడంతో నిహారిక స్పందిస్తూ అవునా నిజమా మీరు చెప్పే వరకు నాకు అసలు తెలియదు అంటూ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు అలాగే అన్ ఫాలో చేసి ఉంటారంటే ఎవరి రీజన్స్ వారికి ఉంటాయి కదా అంటూ ఈమె ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు.. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!