Connect with us

Movie News

ఎన్టీఆర్ నువ్వే కాపాడాలి.. పూనమ్ కౌర్ వివాదాస్పద ట్వీట్..!!!

Published

on

ఒకప్పుడు వెండితెరపై కనిపించి సందడి చేసిన నటి పూనమ్ కౌర్.. సినిమాల్లో ఉన్నపుడు అంత పెద్ద సక్సెస్ కాలేదు కానీ సినిమా ల నుంచి వెళ్ళిపోయాక మాత్రం ఆమె చాల ఫేమస్ అయిపొయింది. అప్పట్లో కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన సోషల్ మీడియా యుద్దంలో పూనమ్ ని లాగి ఆమె ఇమేజ్ ని రచ్చ రచ్చ చేశారు. ఆమెపై రక రకాల పుకార్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. పూనమ్ కు పవన్ కళ్యాణ్ తో ఎఫైర్ ఉందనే వార్తలు ఈ ఇష్యూ తర్వాత వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పటికీ ఆమెపై పలు యూట్యూబ్ చానెళ్ళు పలు రకాల వార్తలను ప్రచారం చేస్తున్నాయి. వివాదం ఏమో కానీ సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అవుతూ రోజు రోజుకి తన ఇమేజ్ పెంచుకుంటుంది..అయితే ఆ విషయంపై అప్పుడేం స్పందించలేదు కానీ ఆమధ్య తనపై యూట్యూబ్‌లో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సినీనటి పూనం కౌర్ సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలీదు.

ఇకపోతే తాజాగా ఆమె ఎన్టీఆర్ గురించి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్టీఆర్ గార్డెన్స్ అని రాసి ఉన్న ల్యాండ్ మార్క్ ఫోటో తో పాటు ‘రే స్ ఆఫ్ హోప్'(ఆశా కిరణాలు) అనే కామెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సాధారణ సందర్భం అయితే ఈ ట్వీట్ కి అంత ప్రాధాన్యం ఉండేది కాదు.కానీ నిన్న వెలువడిన ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ ఎన్నికల పలితాలలో టీడీపీ ఘోరపరాజయం చవిచూసింది. దారుణంగా రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ గెలుచుకుంది.టీడీపీ పార్టీ ఘోర ఓటమి తరువాత చాలా మంది టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నాయకత్వ మార్పు కావాలని, జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మాత్రమే టీడీపీని కాపాడగలడు అని అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. పూనమ్ కౌర్ ట్వీట్ క్రింద ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చూసినా… ఆమె ఉద్దేశం ఏమిటో అర్థం అవుతుంది.

Advertisement

 

 

 

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pushpa 2: పవన్ తో బన్నీ వైరం.. పుష్ప 2 కి దెబ్బ తప్పదు… డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

Published

on

Pushpa 2: ప్రస్తుతం టాలీవుడ్ డ్రెస్ లో మెగా వర్సెస్ అల్లు అనే వివాదం కొనసాగుతుంది. మెగా కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించగా పవన్ కళ్యాణ్ మాత్రం తన స్నేహితుడు వైసీపీ నేతకు మద్దతుగా నిలవడంతో మెగా వర్సెస్ అల్లు అనే విధంగా వివాదం కొనసాగుతుంది.

ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియకపోయినా ఆయన భారీ మెజారిటీతో గెలిచి నేడు ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమాలకు భారీ దెబ్బ పడుతుందంటూ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ గీతాకృష్ణ ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ సినిమాలలో తోపు కాని రాజకీయాలలో ఒక బచ్చా అని తెలిపారు.. ప్లాన్డ్ గా సినిమాలు చేసి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక అనుకోకుండా ఈయనకు నేషనల్ అవార్డు రావడంతో ఈయన క్రేజ్ ఎక్కడికో పెరిగిపోయింది.

Advertisement

ఇక మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య వివాదం నడుస్తుంది. ముఖ్యంగా అల్లు అరవింద్ కు పవన్ కళ్యాణ్ అంటే చిన్నచూపు ఈయన వివిధ విధానాలు పవన్ కళ్యాణ్ కు నచ్చకపోవడంతో మొదటి నుంచి కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక గేమ్ ఛేంజర్ అవుతారని అల్లు అరవింద్ ఊహించలేదు.

గేమ్ ఛేంజర్…
ఇలా పవన్ కళ్యాణ్ కు కాకుండా ఒక పబ్ లో పరిచయం అయిన శిల్పా రవి కోసం అల్లు అర్జున్ వెళ్లడం తప్పేనని ఆ ప్రభావం తన తదుపరి సినిమా పై పడుతుందని ఇప్పటికైనా అల్లు అర్జున్ మెగా కుటుంబంతో సంధి చేసుకుంటే మంచిది అంటూ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Raviteja: తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రవితేజ.. వైరల్ అవుతున్న హరీష్ శంకర్ పోస్ట్?

Published

on

Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రవితేజ సైతం వరుస కాల్ షీట్స్ సినిమా కోసం కేటాయించారని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లోకేషన్ నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ ఫోటో చూస్తున్నటువంటి అభిమానులు ఒక్కసారిగా కంగారు వ్యక్తం చేస్తున్నారు. రవితేజకు ఏమైంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోలో భాగంగా రవితేజ మెడకు బెల్ట్ పెట్టుకుని ఉండగా పక్కనే హరీష్ శంకర్ దానిని పట్టుకొని ఉన్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన ఈయన రవితేజ మెడకు తీవ్రమైన నొప్పి వస్తుందని వెల్లడించారు.

Advertisement

మెడ నొప్పి సమస్య..
మీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్.. ఇంత తీవ్రమైన మెడ నొప్పిలో కూడా షూటింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు థాంక్యూ అన్నయ్య అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈయన తీవ్రమైన మెడ నొప్పి సమస్యతో బాధపడుతున్నప్పటికీ షూటింగ్ ఆగిపోకూడదని నిర్మాతలు నష్టపోకూడదని తన నొప్పిని సైతం లెక్కచేయకుండా షూటింగ్లో పాల్గొన్నారు తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Niharika: బన్నీని అన్ ఫాలో చేసిన తేజ్.. అలా రియాక్ట్ అయిన నిహారిక?

Published

on

Niharika: నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిహారిక మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆమెకు మీడియా నుంచి వివిధ రకాలుగా ప్రశ్నలు ఎదురయ్యాయి.

ముఖ్యంగా ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత మెగా వెర్సెస్ అల్లు అనే విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే మెగా సంబరాలలో కానీ పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కానీ అల్లు కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు.

ఇకపోతే మెగా హీరో అయినటువంటి సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డిని కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో ఈయన అన్ ఫాలో కావడంతో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమైంది. ఈ క్రమంలోనే మీడియా వారు తేజ్ బన్నీని అన్ ఫాలో చేయడం గురించి ప్రశ్నించారు.

Advertisement

అవునా.. నిజమా
మీడియా వారి నుంచి ఇలాంటి ప్రశ్న ఎదురు కావడంతో నిహారిక స్పందిస్తూ అవునా నిజమా మీరు చెప్పే వరకు నాకు అసలు తెలియదు అంటూ తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు అలాగే అన్ ఫాలో చేసి ఉంటారంటే ఎవరి రీజన్స్ వారికి ఉంటాయి కదా అంటూ ఈమె ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పేశారు.. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!