Anchor Pradeep: సంక్రాంతి పండుగ సందర్భంగా ఈటీవీలో అమ్మమ్మగారి ఊరు అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా బుల్లితెర ఆర్టిస్టులు, కమెడియన్స్ ప్రేక్షకులను సందడి చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బంగార్రాజు టీమ్ నుంచి హీరోయిన్ కృతి శెట్టి హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ చేసిన హంగామా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందనీ చెప్పవచ్చు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వారి అద్భుతమైన స్కిట్ ల ద్వారా, డాన్స్ పర్ఫార్మెన్స్, ఆట పాటల ద్వారా అందరిని ఆకట్టుకున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి హీరోయిన్ కృతి శెట్టి రావడంతో ఈమెతో పులిహోర కలపడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ప్రదీప్ మాచిరాజు సైతం హీరోయిన్ కృతి శెట్టితో పులిహోర కలిసినట్లు తెలుస్తోంది.
Anchor Pradeep : అన్నీ కలిసొస్తే ఉగాదికే అంటూ…
ఈ క్రమంలోనే వేదికపైకి వచ్చిన కృతి శెట్టితో ప్రదీప్ బాగా పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ మేడమ్ మీరు వచ్చే సంక్రాంతి కైనా (పెళ్లి గురించి) అంటూ.. అన్నారు కదా.. అన్ని బాగుంటే ఉగాదికే అంటూ హీరోయిన్ కృతి శెట్టి వైపు కొంటె చూపులు చూడటం ఈ ప్రోమోకి హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఈ కార్యక్రమం ద్వారా పూర్తి వినోదాన్ని చూడాలంటే జనవరి 15 శనివారం వరకు వేచి చూడాలి.































