Priyamani: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రియమణి కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రియమణి తాజాగా నటించిన భామా కలాపం 11వ తేదీ ఆహాలో విడుదలైంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఎంతో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అభిమన్యు దర్శకత్వంలో సుదీర్, బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రియమణి అనుపమ పాత్రలు ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఈమె నిత్యం పక్కింటిలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని ఆత్రుత గల వ్యక్తిగా నటించారు.

ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
తనతో మంచి రిలేషన్ ఉందన్నారు…
ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ ఈ రోజు ఉదయమే మా ఆయన ఈ సినిమా చూశారు చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరి పాత్ర చాలా బాగుందని చెప్పినట్లు ప్రియమణి ఈ వేదికపై మాట్లాడారు. ఇకపోతే అనుపమ(ప్రియమణి), శిల్ప కాంబినేషన్ చాలా బాగుందని, నిజం చెప్పాలంటే నా భర్త కంటే తనతోనే నా రిలేషన్ బాగుందని.. నా భర్త కూడా మా ఇద్దరి కెమిస్ట్రీ గురించి అదే మాట్లాడారని ఈ సందర్భంగా ప్రియమణి తెలియజేశారు.































