Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత పూర్తిగా తన సినిమా షూటింగులకు కూడా దూరమయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఈమె తిరిగి తన సినిమా షూటింగులలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే సమంత ఆరోగ్యం కాస్త కోలుకోవడంతో ఈమె పలు ఆలయాలను దర్శిస్తూ తన ఆరోగ్యం గురించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సమంత తమిళనాడులోని పళనిశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈమె కొండకింది భాగం నుంచి పై వరకు మెట్ల మార్గం గుండా వెళ్తూ పూజలు చేశారు.

Samantha: ప్రతి మెట్టుపై దీపాలు వెలిగించిన సమంత…
ఇలా ప్రతి మెట్టు ఎక్కుతూ ప్రతి మెట్టుపై కర్పూర హారతులు వెలిగిస్తూ సమంత ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా సమంత ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె త్వరలోనే తాను కమిట్ అయినా సినిమా షూటింగులలో పాల్గొనబోతున్నారు. సమంత ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటించగా, తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో కూడా నటిస్తున్నారు.


































