ఫిలిప్పీన్స్ దేశంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఆగ్నేయ తీరంలోని పొందగిటాన్లో భూమి కపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1 గా నమోదైంది. ఈ భూకంపం 65.6 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అలాగే సునామీ వచ్చే అవకాశముందని జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే సునామీ వచ్చే అవకాశం తక్కువే అని పలు వాతావరణ కేంద్రాలు తెలిపాయి.

అయితే యూఎస్ సునామీ హెచ్చరిక కేంద్రం ఫిలిప్పీన్స్కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు.






























