Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి గురించి అందరికీ సుపరిచితమే.ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియా వేదికగా తన కూతురిని పరిచయం చేశారు.

ఈ క్రమంలోనే సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సుప్రీత వెండితెర ఎంట్రీ ఎప్పుడు అంటూ ఇది వరకు ఎంతోమంది అభిమానులు ఆమెను ప్రశ్నించారు. అయితే ఇప్పటివరకు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉన్నటువంటి సుప్రీత తాజాగా వెండితెర ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
సుప్రీత ఏ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయానికి వస్తే… మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేచింది మహిళా లోకం అనే ఈ సినిమా ద్వారా సుప్రీత వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాకు కార్తీక్ అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.ఈ క్రమంలోని మంచు లక్ష్మి ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.
కీలక పాత్రలో సుప్రీత…
ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని మంచులక్ష్మి వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సురేఖవాణి కూతురు సుప్రీత సందడి చేయనుంది. సుప్రీతతోపాటు ఈ సినిమాలో హరితేజ, హేమ, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇలా ఎన్నో రోజులుగా సుప్రీత వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. మరి వెండితెరపై సుప్రీత ఎలా ప్రేక్షకులను సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.
































