కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభ బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఆ గ్రౌండ్ లోనే అతడు నటించిన ఎన్నో సినిమాల వేడుకలు జరిగాయి. అదే వేడుకలో ఇలా జరుగుతుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సభకు వచ్చిన ప్రతీ ఒక్కరూ కళ్లల్లో నీళ్లతోనే కనిపించారు. అతడి మరణం జీర్ణించుకోలేక ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. తన అంత్యక్రియలకు దాదాపు 25లక్షల మందికి పైగా హాజరయ్యారు.

దానిని బట్టే అర్థం అవుతుంది.. అతడంటే.. ఎంతమందికి ప్రేమ ఉందో. ఈయన మరణించి 20 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు కన్నడ ప్రజలు. ఇక ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప, ప్రస్తుత సీఎం బసవరాజు బొమ్మై తో పాటు మరికొంత మంది నాయకులు కనిపించారు. కన్నడ సినీ పరిశ్రమ అంతా అక్కడే కనిపించారు. మంచు మనోజ్ కూడా ఆ సభలో కనిపించారు.
ఇక తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా కనిపించారు. ఈ సభలో అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు. రాజకుమార సినిమాలో పునీత్ రాజ్ కుమార్ తండ్రిగా నటించాడు శరత్ కుమార్. ఆ సినిమా పెద్ద హిట్ కూడా అయింది. దాంతో వాళ్లిద్దరి మధ్య బాండింగ్ పెరిగిపోయింది. పునీత్ చివరి సినిమా జేమ్స్ లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు శరత్ కుమార్.
అతడితో తనకున్న అనుబంధాన్ని తలచుకొని.. అతడిని బదులు తాను చనిపోయినా బాగుండేదని ఎమోషనల్ అయ్యాడు శరత్ కుమార్. 100 రోజుల ఫంక్షన్ జరిగే ఈ వేదికలో .. ఇలా శ్రద్ధాంజలి గడించడం అనేది కలలో ఊహించలేదన్నారు. తన శ్రద్దాంజలికి పునీత్ వస్తాడు అనుకున్నా గానీ.. అతడి శ్రద్ధాంజలికి తాను వస్తానని అనుకోలేదన్నారు. అతడు స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రతీ ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు.
































