Road Accident: ఈ మధ్య కాలంలో దేశంలో ప్రతిరోజు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.మునుపటి కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సులు ట్రైన్లు ఎక్కి వెళ్లేవారు. కానీ ప్రస్తుత కాలంలో మనిషికి ఒక వాహనం తప్పనిసరి అయిపోయింది. ఒక విధంగా వాహనాల సంఖ్య పెరగటం కూడా ప్రమాదాలకు కారణం. అంతేకాకుండా వాహనాన్ని నడిపే వ్యక్తులు అజాగ్రత్త వల్ల ,నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతో మంది నిర్ధాక్షణ్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు అమలులో ఉంచినా కూడా ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.ఇటీవల అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వివరాలలోకి వెళితే.. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రాంనేపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినిలారీ రిపేర్ రావటంతో ఇంకొక లారీ సహాయంతో మిని లారీని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మిని లారీని తరలిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటన గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా..మినీ లారీని తరలిస్తున్న వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉండటంతో ఒక వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం…
అయితే వారిద్దరూ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




























