Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వెండితెరపై అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే గత వారం రోజుల నుంచి అనసూయ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సంచలనం రేపింది.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు నేటిజెన్లు సైతం అనసూయ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఈమెను ఏకంగా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.ఈ విధంగా తనని ఆంటీ అన్న వారిపై ఈమె కేసు వేస్తానంటూ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
ఇలా నెటిజన్లతో తీవ్రస్థాయిలో గొడవకు దిగిన అనసూయ ఇక ఈ విషయంపై మర్చిపోయినప్పటికీ నెటిజెన్స్ మాత్రం అనసూయను ఇప్పటికి దారుణంగా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా అనసూయ విజయవాడలో తన ఫ్యామిలీతో కలిసి పలు పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విజయవాడ అని క్యాప్షన్ పెట్టగా ఎంతోమంది నేటిజన్స్ ఈ ఫోటో పై స్పందిస్తూ వెల్కమ్ విజయవాడ ఆంటీ అంకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Anasuya: తగ్గేదేలే అంటున్న నేటిజన్స్..
ఇలా అనసూయ పోస్ట్ పై స్పందించిన 80 శాతం మంది నేటిజన్స్ ఆమెను ఆంటీ అనే పదంతోనే కామెంట్ చేస్తూ చేస్తున్నారు. ఇక మరొక నెటిజన్ అయితే దారుణంగా ఎన్ని రోజులకు మీ మెడలో ఇలా తాళిబొట్టు చూసాము అంటూ కామెంట్ చేశారు.మొత్తానికి అనసూయ ఎన్ని కేసులు పెట్టిన నేటిజన్స్ మాత్రం తగ్గేదే అంటూ ఈమెను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

































