ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సినిమా డైలాగ్లు సైతం రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ సినిమాలోని “రప్పా… రప్పా” డైలాగ్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఈ డైలాగ్ను ప్రస్తావించడంతో, టిడిపి వర్గం తీవ్రంగా స్పందిస్తోంది. పై స్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకు ప్రతీ ఒక్కరూ జగన్ వ్యాఖ్యలకు తగిన కౌంటర్ ఇస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంతోనే ఏపీ మంత్రి కింజరపు అచ్చం నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. “వైఎస్ జగన్ను ఏపీలో కనిపించకుండా చేస్తాం. అతడు మాయం అయిపోయినట్టే..” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీకి 42 ఏళ్ల అనుభవం, కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. “మేము ఒక్క పిలుపు ఇస్తే, మీరు ఎక్కడా కనిపించకుండా పోతారు. మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తే ఖబర్దార్,” అంటూ ఘాటుగా హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. జగన్పై ఇంత స్థాయిలో విమర్శలు, హెచ్చరికలు రావడం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందుగా వీటి ప్రభావం రాజకీయ పరంగా ఎలా ఉంటుందనేది చూడాలి.



































