Connect with us

Featured

Anchor Udaya Bhanu: కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ తో ఉదయభానుకు బిగ్ బాస్ అవకాశం.. షో మొత్తం రచ్చ రచ్చే?

Published

on

Anchor Udaya Bhanu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించారు. అనంతరం యాంకర్ గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఈ విధంగా నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయభానుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఉదయభానుకు బిగ్ బాస్ సీజన్6 లో పాల్గొనే అవకాశం వచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.ఇప్పటికే తెలుగులో ఈ కార్యక్రమం ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది.

Advertisement

ఇప్పటికే నిర్వాహకులు ఈ కార్యక్రమం ప్రసారం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయ్యిందని, కొందరి కంటెస్టెంట్ ల పేర్లు వినపడుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిని అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారిని ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

గతంలో బిగ్ బాస్ అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసిన ఉదయభాను…

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నిర్వాహకులు యాంకర్ ఉదయభానుకి కూడా ఈ సీజన్ లో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.ఈమెకు గత సీజన్లోనే బిగ్ బాస్ అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈమె ఈ కార్యక్రమంలోకి వెళ్ళలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఈమెకు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం కల్పించాలని ఎలాగైనా తనని ఈ కార్యక్రమంలోకి తీసుకురావాలని నిర్వాహకులు తనకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.మరి ఉదయభాను గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈమె కనుక షోలోకి ఎంట్రీ ఇస్తే ఈ కార్యక్రమం మరో లెవల్ కు వెళ్తుందని చెప్పాలి.

Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!