Connect with us

Featured

Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వకు ఎంత ఇచ్చారో తెలుసా?

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ద్వారా ఇద్దరు జానపద కళాకారులకు ఎంతో

Published

on

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం ద్వారా ఇద్దరు జానపద కళాకారులకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్ సాంగ్ ద్వారా 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్యకు మంచి గుర్తింపు రావడమే కాకుండా ఈయనకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది.

Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?
Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

అలాగే ఈ సినిమాలో అడవి తల్లిమాట అనే పాట కోసం మరో జానపద కళాకారిణి దుర్గవ్వ సాహితి చాగంటితో కలిసి పాడిన ఈ పాట ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇలా ఈ పాట ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన సింగర్ దుర్గవ్వ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమెకు ఈ సినిమాలో పాట పాడే అవకాశం ఎలా వచ్చింది? ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయాలను వెల్లడించారు.

Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?
Bheemla Nayak: అడవి తల్లి మాట పాట కోసం సింగర్ దుర్గవ్వ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

ఈ సందర్భంగా ఈమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను సిరిసిల్ల సిన్నది, ఉంగురము పాటలు పాడాను. ఈ పాటలు మంచి హిట్ కావడం చేత ఈ సినిమాలో పాటపాడే అవకాశం వచ్చిందని తెలియజేశారు. ఇలా ఈ సినిమాలో పాట పాడే అవకాశం దక్కించుకున్నానని ఈమె వెల్లడించారు.

ఐదారు నిమిషాల్లోనే పాట పూర్తి చేశాను….


ఇక ఈ సినిమాలో అడవి తల్లి మాట అనే పాటను కేవలం ఐదారు నిమిషాల్లో పూర్తి చేసి వెళ్లిపోయానని అయితే ఈ పాట పాడినందుకు నాకు పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించారని తెలియజేశారు. మిగతా డబ్బులు చిత్రబృందం తన కూతురి చేతికి అందించారని ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

Advertisement

Featured

Renu Desai: బుద్ధి ఉంటే ఇలా మాట్లాడవు… పవన్ అభిమానికి ఇచ్చి పడేసిన రేణు దేశాయ్?

Published

on

Renu Desai: పవన్ కళ్యాణ్ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే అయితే ఈమె పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆయనకు దూరమయ్యారు. తనకు తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతోనే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అంటూ పలు సందర్భాలలో రేణు దేశాయ్ వెల్లడించారు.

ఇలా పవన్ కళ్యాణ్ కు దూరంగా తన పిల్లలతో కలిసి బ్రతుకుతున్న ఈమె పట్ల తరచూ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే కామెంట్లతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవకు దారితీస్తుంది అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఆయన పిల్లలు తన వెంటే ఉంటున్నారు.

ఇక ఈ విషయంపై రేణు దేశాయ్ కూడా సంతోషం వ్యక్తం చేసింది అయితే ఒక అభిమాని మాత్రం రేణు దేశాయ్ ను ట్యాగ్ చేస్తూ చేసిన పోస్టుపై రేణు దేశాయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సుధాకర్ అనే అభిమాని వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది.

Advertisement

పవనే నన్ను వదిలేసాడు..
ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాము అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ పోస్ట్ పై రేణు దేశాయ్ స్పందిస్తూ సుధాకర్ గారు మీరు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా.. బుద్ధి ఉంటే ఇలా మాట్లాడరు పవన్ కళ్యాణ్ కు నేను విడాకులు ఇవ్వడం ఏంటి ఆయనే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి అంటూ ఈమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Continue Reading

Featured

Ram Charan: కూతురి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చరణ్.. నిరాశలో అభిమానులు!

Published

on

Ram Charan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈయన నటుడుగా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయినటువంటి ఈయన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే నేడు ఫాదర్స్ డే కావడంతో చరణ్ తన కుమార్తె క్లిన్ కారాతో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తన కుమార్తె గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తన కుమార్తె అందరిని బాగా గుర్తు పడుతుందని చరణ్ తెలిపారు.

ఇలాంటి సమయంలో తనని వదిలి షూటింగ్ వెళ్లాలంటే చాలా బాధగా ఉంటుందని తనని చాలా మిస్ అవుతున్నానని తెలిపారు. ఇక తను కూడా నన్ను చాలా మిస్ అవుతుందని చరణ్ వెల్లడించారు. ఇక నేను షూటింగ్ లేకుండా ఇంట్లో ఉంటే రోజంతా తనతోనే గడుపుతానని తనకు ప్రతిరోజు నేనే తినిపిస్తానని ఆ విషయంలో నాతో ఎవరూ పోటీ పడలేరని తెలిపారు. నేను తినిపిస్తే తన కుమార్తె మొత్తం తింటుందని ఈయన తెలిపారు.

Advertisement

చాలా మిస్ అవుతున్నా..

ఇలాంటి సమయంలో తనని వదిలి షూటింగ్ వెళ్లాలంటే కాస్త బాధగా ఉంటుంది అందుకే తాను స్కూల్ కి వెళ్లే వరకు కూడా షూటింగ్ కంటే ఎక్కువగా తనకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా ఫాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Surekha: పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన వదిన సురేఖ.. ఈ గిఫ్ట్ ఖరీదు ఎంతో తెలుసా?

Published

on

Surekha: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి అడుగుపెట్టి రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇలా రాజకీయాలలో పవన్ కళ్యాణ్ విజయం చూసి ఆయన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ విజయాన్ని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగలాగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదల చూసి తన అన్నయ్య చిరంజీవి వదిన సురేఖ ఎంతో గర్వపడుతున్నారు. మరి కొద్ది రోజులలో బాధ్యతలు తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్ కు తన వదిన సురేఖ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఈయనపై ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి. అలాగే ఎన్నో ఫైళ్ళ పై సంతకాలు కూడా పెట్టాల్సి ఉంటుంది అయితే ఆ సంతకాలు అన్ని పెట్టడం కోసం సురేఖ తన మరిది కోసం ఖరీదైన పెన్నును కానుకగా ఇచ్చారు..

Advertisement

ఇలా సురేఖ తన మరిది కోసం పెన్ గిఫ్ట్ గా ఇస్తున్నటువంటి ఒక వీడియోని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వెంటనే అభిమానులు ఈమె పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి పెన్ ఇచ్చారు. దాని ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలు పెట్టారు.. ఇక పవన్ కోసం సురేఖ ఇచ్చిన పెన్ మోంట్ బ్లాంక్ కంపెనీకి చెందినది. ఈ పెన్ను ఖరీదు 50వేల రూపాయల నుంచి లక్షల్లో ఉంటాయి.

మూడు లక్షల విలువ..
ఇక పవన్ కళ్యాణ్ కోసం తన వదిన సురేఖ ఇచ్చిన ఈ పెన్ను ఖరీదు ఏకంగా మూడు లక్షల 50 వేల రూపాయలు అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలా తన కోసం తల్లి సమానురాలైన సురేఖ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!