తెలుగు బిగ్బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. ఎన్నో భావోద్వేగాలు, గొడవలల నడుమ 12వ వారం నడుస్తోంది. మొన్న ఎవిక్షన్ పాస్ టాస్క్ లో చివరిసారిగా ఫైర్ వ్యాన్ ఎక్కిన మానస్, కాజల్.. వాళ్లు ఆడిన ఆట హౌస్ లో చాలామందికి నచ్చలేదు. అందులో కాజల్ సన్నీకోసం తీసుకున్న స్టాండ్ శ్రీరామ చంద్రకు అస్సలు నచ్చలేదు.

ఆ రోజు నుంచి వాళ్లిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే.. భగ్గమనేట్లుగా తయారైంది. ఇక తర్వాత నామినేషన్ ప్రక్రియలో కూడా కాజల్ ఆటతీరు బాలేదని.. తనకు అస్సలు నచ్చలేదంటూ శ్రీరామచంద్ర ఆమెను నామినేట్ చేస్తాడు. అప్పడు కూడా వీరిద్దరి మధ్య వార్ నడిచింది. ఎవిక్షన్ పాస్ విషయంలో కాజల్ తీసుకున్న నిర్ణయంపై శ్రీరామ చంద్ర తట్టుకోలేకపోయాడు.
నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత చివరి కెప్టెన్సీ టాస్క్ లో ‘నియంత మాటే శాసనం’అనే టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. దీనిలో భాగంగా సింహాసనంపై ఎవరు కూర్చుంటారో.. వాళ్లు ఆ గేమ్ రౌండ్ అయి పోయేవరకు నియంతలా వ్యవహరిస్తారు. ఆ రౌండ్ లో వాళ్లు సేవ్ అవ్వడమే కాదు.. ఒకరిని గేమ్ నుంచి బయటకు పంపించేయొచ్చు. ఇక సింహాసనంపై కూర్చోడానికి శ్రీరామచంద్రకు ఒక అవకాశం వస్తుంది.
ఆ రౌండ్లో నియంతలా వ్యవహరిస్తాడు. ఈ గేమ్ లో రవి, కాజల్ అక్కడ ఇచ్చిన టాస్క్ లో చివరి స్థానంలో ఉంటారు. కాజల్ శ్రీరామచంద్రను రిక్వెస్ట్ చేసుకుంటుంది. తాను ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదు.. తనకు ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆమెను శ్రీరామచంద్ర కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దానికి ఆమె దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో డిస్ క్వాలిఫై చేసి.. రవిని సేవ్ చేస్తాడు. దీంతో బాగా హర్ట్ అయిన కాజల్.. బాత్ రూంకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది.

































