Connect with us

Featured

Mohan Babu : అయోధ్య నుంచి పిలుపు వచ్చింది.. భయపడి వెళ్లలేదు : మోహన్ బాబు

Published

on

Mohan Babu: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రామ మందిరం ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. కనీవిని ఎరుగని రీతిలో ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇక ఈ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, క్రీడారంగం వారు ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరు కానున్నారు.

ఇప్పటికే సెలబ్రిటీలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు అందుకు సంబంధించిన ఆహ్వానాలు కూడా పంపారు. నేడు అనగా 21వ తేదీన కొందరు అక్కడికి చేరుకోనుండగా మరికొందరు రేపు అనగా 22వ తేదీ అక్కడికి చేరుకోనున్నారు. అయితే తనకు కూడా అయోధ్యకు ఆహ్వానం అందింది అని తెలిపారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. తాజాగా ఫిలింనగర్ లో అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్ట సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు అయోధ్యకు ఆహ్వానం అందినప్పటికీ భయపడి తాను వెళ్లలేదని చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరి ఏ విషయంలో మోహన్ బాబు భయపడ్డారు ఆయన ఏం చెప్పారు అన్న వివరాల్లోకి వెళితే.. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్‌లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులు ఉన్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు.

Advertisement

భయపడి వెల్లలేదు..

అయోధ్య రామాలయ ప్రారంభాన్ని ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఈ వేడుక కోసం నాకు ఆహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాము అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. కానీ ఇక్కడి దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఈ సందర్భంగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

https://youtu.be/1UxwX8raSg4

Advertisement

Featured

YS Jagan: ఓటు వినియోగించుకోవడం కోసం…పులివెందల బయలుదేరిన జగన్ దంపతులు!

Published

on

YS Jagan: ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది మరికొన్ని గంటలలో ఎన్నికలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎన్నికల అధికారులు చేరుకొని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వారందరూ కూడా సొంత ఊరికి చేరుకున్నారు.

మరికొన్ని గంటలలో ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పులివెందుల బయలుదేరారు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైయస్ భారతి తో కలిసి నాలుగు గంటలకు పులివెందుల బయలుదేరారు ఇక రెండు రోజులపాటు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఉంటారని తెలుస్తోంది.

పులివెందులకు సీఎం..
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు ఒకవైపు పోలింగ్ ఉండటం మరోవైపు సీఎం వస్తున్నారని విషయం తెలియడంతో పులివెందులలో కట్టదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండటం కోసం ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టారు.

Advertisement

Continue Reading

Featured

Nagababu: నీ గెలుపు సిద్ధమైంది.. తమ్ముడు గురించి ఎమోషనల్ ట్వీట్ చేసిన నాగబాబు!

Published

on

Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఈ ఎన్నికలలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి కానీ కూటమిలో భాగంగా ఆయనకు టికెట్ రాలేకపోయింది కానీ తన తమ్ముడికి గెలుపు కోసం తన పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు.

ఇకపోతే నాగబాబు సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వారికి సూటిగా ఆ వ్యాఖ్యలు గుచ్చుకునేలా ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తన తమ్ముడిపై ఉన్నటువంటి చెమట బొట్టులను తుడుస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిన్ను నమ్మని వాళ్లకోసం ఎందుకు నిలబడతావు అని నేను అడిగితే తను మాత్రం చెట్టును చూపిస్తారు అది తనని నాటిన వారికి మాత్రమే నీడను ఇవ్వదని చెబుతారు. నీపై నిందలు వేసే వారికోసం ఎందుకు నిలబడతావు అని అడిగితే వర్షాన్ని చూపిస్తారు. తనని మొక్కనీ రైతు కంటతడపకుండా పంటనే తడుపుతుందని అప్పటినుంచి అడగటమే మానేశానని నాగబాబు తెలిపారు.

Advertisement

మార్గదర్శకు మెట్టు..
ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను..సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.. విజయీభవ..!అని నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ ఫాన్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పాలి ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలకే అంకితం.. చివరి నిమిషంలో వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. గత కొద్ది రోజులుగా ఈయన పవన్ కళ్యాణ్ జాతకాలు గురించి చెబుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలిపారు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ చాలా మొండోడు ఎవరు చెప్పినా కూడా వినరు ఆయన కేవలం త్రివిక్రమ్ లాంటి వారు చెబితేనే వింటారు చివరికి తన అన్నయ్య చిరంజీవి చెప్పిన వినే వ్యక్తిత్వం తనది కాదని వేణు స్వామి తెలిపారు. ఇక నేను కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని తాను కూడా సీఎం కావాలని నేరు కోరుకుంటాను కానీ ఆయన జాతకం చూస్తే అది జరగదని వేణు స్వామి తెలిపారు.

పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం దాదాపు ఆయన చేసిన పది సినిమాలకు నేనే ముహూర్తాలు పెట్టానని వేణు స్వామి తెలిపారు. ఇలా ఈయనతో కలిసి గంటలు గంటలు మాట్లాడాను అయితే ఆయనంటే ఉండే ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి రావాలనే కాంక్ష వేరని వేణు స్వామి తెలిపారు.

Advertisement

సినిమాలతోనే మంచి పేరు..
ఇక రాజకీయ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు రాజకీయాలలో అవగాహన ఏమాత్రం లేదు. కుటిల రాజకీయాలు ఆయనకు తెలియవు. ఆయన నిర్ణయాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. ఆయనకు రాజకీయాలు కలిసి రావు ఆయన సినిమాలకే అంకితం అవుతారు. మన అంచనాలు 100 శాతం ఉంటే.. రిజల్ట్ 20 శాతమే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెడితేనే సక్సెస్ అవుతారు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ గురించి ఆయన జాతకం గురించి చెబుతూ కామెంట్లు చేయడంతో అభిమానులు కాస్త కలవర పడుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!