Pawan Kalyan – Renu Desai : రేణు దేశాయ్.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలవబోతున్నారా? అంటే అవుననమే సమాధానమే వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన రేణుని మెగా అభిమానులు ఇప్పటికీ వదినమ్మగానే చూస్తారు. ఆమె ఎన్నికల సమయంలో పవన్కు చాలా అండగా నిలిచారు. పవన్కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు, మెసేజ్లు పెట్టారు. అకీరా నందన్ను పవన్కు చేరువగానే ఉంచుతున్నారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. పవన్ గురించి ఏం మెసేజ్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. పవన్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్.. ఆ మధ్య మరో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ సమయంలో పవన్ అభిమానుల నుంచి విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందన్నారు. త్వరలోనే పెళ్లన్నారు. అంతలోనే ఏమైందో ఏమో కానీ ఆ ఊసే లేదు. మరి ఇప్పుడు పవన్, రేణు దేశాయ్ కలవడం ఏంటి? ఎందుకు కలవబోతున్నారు? అంటారా? దీనికి ఓ కారణం ఉంది. అదేంటో చూద్దాం.

ఇప్పుడు ప్రత్యేకత ఏంటి?
ప్రస్తుతం అకీరా నందన్, ఆద్యలే తన లోకంగా రేణు దేశాయ్ జీవిస్తున్నారు. పవన్, రేణు కలవరా? అంటే ఎందుకు కలవరు? చక్కగా కలుస్తారు. పవన్ బెంగుళూరులోని రేణు ఇంటికి వెళతారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. ఇక ఆద్య మాటను పవన్ అసలు జవదాటరట. రేణు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరి ఇప్పుడు ప్రత్యేకత ఏంటి అంటారా? రేణు ఇటీవలి కాలంలో ఆధ్యాత్మికత వైపు ఫోకస్ పెట్టారు. అంతేకాదు.. ప్రస్తుతం ఆమె భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కు చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో వేదాలు, భక్తికి సంబంధించిన ఒక ప్రైవేటు యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే పర్మిషన్లు కావాలి కదా.. యూనివర్సిటీ అంటే నాలుగు గోడలు లేపితే అయిపోదు కదా.. ఆ పర్మిషన్స్ కోసం ఇప్పటికే తెలంగాణ దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖతో భేటీ అయ్యారు. కొండా సురేఖ నుంచి సానుకూల సమాధానం వచ్చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలవాలని రేణు భావిస్తున్నారట. వీరిలో ముందుగా పవన్ను కలవాలనుకుంటున్నారట. భక్తికి సంబంధించిన ఒక ప్రైవేటు యూనివర్శిటీ విషయమై పవన్తో చర్చిస్తారట. పవన్కు కూడా భగవంతుడి పట్ల నమ్మకం ఎక్కువ కాబట్టి ఆయన కాదనరని అంతా అంటున్నారు. అయితే ముందుగా ఈ విషయంలో పవన్ సలహా, అభిప్రాయాన్ని సేకరిస్తారట. తప్పక పవన్ నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. దాదాపు సీఎం చంద్రబాబు సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే అంటున్నారు. రెండు రాష్ట్రాల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే త్వరలోనే రేణు దేశాయ్.. తెలుగు రాష్ట్రాల బార్డర్ లేదా అమరావతి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో యూనివర్సిటీని ప్రారంభిస్తారట. ఈ వ్యవహారాన్ని పక్కనబెడితే పవన్ – రేణు కలవబోతున్నారనే వార్తే అటు మెగా అభిమానుల్లోనూ.. ఇటు జనసేన కార్యకర్తల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

































