Rajendra Prasad -Pavitra: సినిమా ఇండస్ట్రీలో నటుడు నరేష్ పవిత్ర జంట గురించి మనకు తెలిసిందే వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని కూడా తెలిపారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయినటువంటి నరేష్ పవిత్ర గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇకపోతే తాజగా నటి పవిత్ర హీరో రాజేంద్రప్రసాద్ కు వరుసకు మరదలు అవుతుంది అనే విషయం వైరల్ గా మారింది.

పవిత్ర రాజేంద్రప్రసాద్ కు మరదలు కావడం ఏంటి? అసలు వీరిద్దరి మధ్య బంధుత్వం ఏంటి అనే విషయానికి వస్తే… తాజాగా నరేష్ రాజేంద్రప్రసాద్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్ని మంచి శకునములే సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ నరేష్ ను దగ్గరకు తీసుకొని నిత్య పెళ్లి కొడుకుల ఉన్నారు అంటూ కామెంట్లు చేశారు.
ఇలా నరేష్ గురించి రాజేంద్రప్రసాద్ కామెంట్లు చేయడమే కాకుండా తనకు నరేష్ తమ్ముడు వరస అవుతారు అంటూ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇలా విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నరేష్ నిత్య పెళ్లి కొడుకు అంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే కొందరు మాత్రం ఈ విషయం ప ఫన్నీ కామెంట్లు తెరపైకి తీసుకువస్తున్నారు.

Rajendra Prasad -Pavitra:మళ్లీ పెళ్లి…
రాజేంద్రప్రసాద్ మాటల ప్రకారం తనుకు నరేష్ తమ్ముడు అయితే నరేష్ తో రిలేషన్ లో ఉన్నటువంటి పవిత్ర రాజేంద్రప్రసాద్ కు మరదలు అవుతుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇలా పవిత్ర లోకేష్ బావ మరదలు అనే కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో భాగంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.































