Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత గురించి తెలియని వారంటూ ఉండరు. తన మధురమైన గానంతో పాటలు పాడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న సునీత ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా సునీత భర్త వీరపనేని రామకృష్ణకు ఇటీవల ఫోన్ ద్వారా బెదిరింపులు ఎదురయ్యాయని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.

రామకృష్ణ తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత మొదటి భర్తకు విడాకులు ఇచ్చి చాలా కాలం పిల్లలతో కలిసి జీవించింది. అయితే ఇటీవల పిల్లల సహకారంతో రామ్ వీరపనేనిని రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది. అయితే సునీత ఇలా ఈ వయసులో రెండవ వివాహం చేసుకోవడంతో ఇప్పటికీ ఆమె గురించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
మొదట్లో ఈ విమర్శల గురించి స్పందిస్తూ ఎమోషనల్ సునీత ఇప్పుడు లోకం తీరు తెలిసి ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా వీరపనేని రామకృష్ణ కి గుర్తు తెలియని వ్యక్తి తరచూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. లక్ష్మణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను నిర్మాతల మండలి సభ్యుడినని, ముఖ్యమైన విషయాలు చర్చించాలని తరచూ ఫోన్ చేసి విసగిస్తున్నారట.

Singer Sunitha: బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రామ్..
లక్ష్మణ్ ఎవరో తనకు తెలియకపోవటంతో రామకృష్ణ అతని ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. దీంతో లక్ష్మణ్ అనే వ్యక్తి ఇతర నెంబర్ నుండి ఫోన్ చేసి అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో రామకృష్ణ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
































