Son Of India Movie: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఓటీటీ కోసం నిర్మించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు థియేటర్లో విడుదల చేయాలని పట్టుబట్టి ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 265 థియేటర్లలో విడుదలయింది.

కేవలం ఒకటిన్నర గంట నిడివిగల ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మోహన్ బాబు తెలియజేశారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాటరీ సమస్థలు కలిపి ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఈ విధంగా ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో నిన్ననే ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమాకు వంద టికెట్లు కూడా బుక్ కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఓటీటీలో విడుదల చేసిన గౌరవంగా ఉండేది…
అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ పరిస్థితి ఇలా ఉంటే ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి వస్తారా అనే సందేహం కూడా కలుగుతుంది. కేవలం అతి తక్కువ నిడివిగల ఈ సినిమాని ప్రేక్షకులు చూడటానికి ఇష్ట పడుటలేదా? నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ కానున్నాయి. ఈ క్రమంలోనే 265 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కోవడం టాలీవుడ్ చరిత్రలోనే ఇదే మొదటి సినిమా.ఓటీటీ కోసం నిర్మించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసి ఉంటే కొంచెం అయినా గౌరవం ఉండేదని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

































