Connect with us

Featured

Unstoppable: ఉన్న ప్రేమ ఓట్లుగా ఎందుకు మారలేదు….పవన్ కి బాలయ్య సూటి ప్రశ్న!

Published

on

Unstoppable: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న బాలకృష్ణ ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షోలో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ హోస్టుగా వ్యవహరించిన అన్ స్థాపబుల్ సీజన్ వన్ మంచి హిట్ అవటంతో ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు.

ఈ అన్ స్టాపబుల్ సీజన్ టు మొదలైనప్పటినుండి ఇప్పటివరకు మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది. ఈ రెండవ సీజన్లో మొదటి ఎపిసోడ్ లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అతిథిగా హాజరయ్యారు. ఇక ఆ తర్వాత ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు, యంగ్ హీరోలు ఈ షోలో పాల్గొని బాలకృష్ణ తో కలిసి సందడి చేశారు. ఇక ఇటీవల ప్రభాస్ కూడా ఈ షోలో పాల్గొని సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈ షోలో మరొక స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.ఆ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి ఇద్దరు లెజెండరీ హీరోలను ఒకే వేదికపై చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Unstoppable: రాజకీయాల పై ప్రశ్నించిన బాలయ్య..


ఈ క్రమంలో తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఆహా విడుదల చేసింది.ఈ ప్రోమో లో బాలయ్య పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలకు సంబంధించిన చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ కళ్యాణ్ ని కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు అడిగాడు. అయితే పవన్ కళ్యాణ్ వాటికి సమాధానం చెబుతున్న సమయంలో వీడియో మ్యూట్ చేసి ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెంచారు. పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ ఫిబ్రవరిలో ప్రసారం కానుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Featured

Pawan Kalyan: ఆ రోజు నుంచే డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించబోతున్న పవన్ కళ్యాణ్?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనగా మారారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మొదటిసారి గెలుపు అందుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పిఠాపురం నుంచి 70 వేల కోట్ల మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా ఈయన కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేయగా 100కు 100% విజయం సాధించారు.

ఇక పవన్ కళ్యాణ్ తో పాటు మరికొంతమంది జనసేన నాయకులకు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా ఈయన నియమింపబడ్డారు.

ఇలా మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను త్వరలోనే తీసుకుపోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సెక్రటేరియట్లో ఈయనకు ఛాంబర్ సిద్దమవుతుందని త్వరలోనే ఈయన మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకుపోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ నెల 19వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మాత్రమే కాకుండా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు.

Advertisement

ప్రజాసేవకే పరిమితం..
ఇక రాజకీయాలలో ఈయన బిజీగా మారిన నేపథ్యంలో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పవన్ కళ్యాణ్ తెరపై మనం చూడలేమా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈయన కమిట్ అయిన మూడు సినిమాలు షూటింగ్ పనులు సగం వరకు పూర్తి చేసుకున్నాయి. అయితే ఆయనకు వీలైనప్పుడు మిగతా సినిమాలను పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల పైన ప్రజాసేవకే దృష్టి సారిస్తారని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: రేవంత్ రెడ్డికి తెలియకుండానే జగన్ రెడ్డి ఇంటి ముందు కూల్చివేతలు జరిగాయా?

Published

on

YS Jagan: తెలంగాణలో ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చోటు చేసుకున్నటువంటి కూల్చివేతల సంచలనంగా మారాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులోని బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద భవనం ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్నందున ఈ ఇంట్లో చాలాకాలం నుంచి నివాసం ఉండట్లేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే లోటస్ పాండ్ వద్ద ఉన్నటువంటి తన ఇంట్లో తన చెల్లెలు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన తల్లి విజయమ్మ ఉంటున్నారు. ఈమె తెలంగాణ ఆంధ్ర రాజకీయాలలో చురుగ్గా ఉన్నా కూడా ఇక్కడి నుంచే కార్యాచరణ నిర్వహించేవారు. అయితే తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సెక్యూరిటీ కోసం వేయించుకున్న మూడు షెడ్లను కూల్చి వేశారు.

ఈ విధంగా జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలు నిర్వహించడంతో రహదారి చాలా అసౌకర్యంగా మారిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ హేమంత్‌ ఈ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయం పై అధికారులకు కూడా తెలియకుండా జరిగాయని తాజాగా మరొక వైరల్ గా మారింది.

Advertisement

సీఎంకు తెలియదా…
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను తొలగిస్తున్నటువంటి విషయం తెలియదని, అయితే ఈ కూల్చివేతలు జరిగిన 24 గంటల లోపే సదరు అధికారిపై సస్పెన్స్ వేటు వేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.జగన్ ఇంటి వద్ద ఆక్రమణలను తొలగించాలంటూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు మౌఖిక ఆదేశాలను జారీ చేయడం వల్లే జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ కూల్చివేతలు నిర్వహించారు. అయితే ఈ కార్యాచరణలో భాగంగా అధికారి హేమంత్ పై సస్పెన్షన్ వేటుపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారండి.

Advertisement
Continue Reading

Featured

Ap: ఏపీ రుషికొండ భవనాలపై విమర్శలు.. సంచలన పోస్ట్ చేసిన వైసీపీ!

Published

on

Ap: జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈయన ఋషికొండను తవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇలా కొండలను తవ్వి సంపదను మొత్తం దోచుకుంటున్నారంటూ అప్పటి ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు అయితే ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ కు మరింత అందాన్ని రెట్టింపు చేస్తూ అక్కడ ప్రభుత్వ భవనాలను నిర్మించారు.

ఇక తాను రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ నుంచి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ధీమా వ్యక్తం చేశారు కానీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు రావడంతో ప్రస్తుతం ఈ బంగ్లాలు అన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతల చేతులలోకి వెళ్లిపోయాయి.

ఇప్పటివరకు ఋషికొండ ప్రాంతంలో కట్టిన ఆ బంగ్లా ఎలా ఉంది అనే విషయాలు బయటకు రాలేదు కానీ మొదటిసారి తెలుగుదేశం పార్టీ నేతలు బంగ్లాలలోకి అడుగుపెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆ ఫోటోలను వైరల్ చేస్తూ ఎవరికోసం ఈ బాత్రూములు కట్టించావు అంటూ వైసీపీ పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

జగన్మోహన్ రెడ్డి ఎవరికో స్కెచ్ వేసే ఇలా ఖరీదైన బాత్రూం కట్టించారు అంటూ విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఈ విమర్శలపై వైసీపీ స్పందించింది.

అవి ప్రభుత్వ భవనాలే..
రిషి కొండల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ప్రభుత్వ భవనాలే అవేవీ ప్రైవేట్ భవనాలు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని నిర్మించారు.. విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు 1995 నుంచి ఊదరగొడుతున్నారు.. అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి విశాఖకు వస్తే ఆదిత్యం ఇవ్వడానికి సరైన భవనం లేకపోవడం వల్లే వీటిని నిర్మించారని కానీ ఇప్పుడు టిడిపి పార్టీ ఈ ఫోటోలను విమర్శిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోంది అంటూ తెలిపారు.. టిడిపి వక్ర బుద్ధి అంటే ప్రజలకు తెలుసు అంటూ తెలియజేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!