Varalakshmi: తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అనంతరం విలన్ పాత్రలలో నటిస్తూ లేడీ విలన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక తెలుగులో కూడా క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె పెద్ద ఎత్తున సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈమె తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్ అయినప్పటికీ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని తనని కూడా చాలా మంది అవమానించారంటూ తాజాగా తన కెరియర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాల గురించి వరలక్ష్మి శరత్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా గొంతు కాస్త గంభీరంగా ఉంటుంది దీంతో అందరూ కూడా నన్ను మగవారి గొంతు అంటూ కామెంట్ చేసే వారిని తెలిపారు.ఇలా తన గొంతు గంభీరంగా ఉండటం వల్ల తనకు కనీసం తన పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశాలను కూడా ఇవ్వకుండా తనని అవమానించారని ఈమె చేశారు.

Varalakshmi: నా వాయిస్ కు అభిమానులుగా మారిపోయారు…
ఇలా తనకు ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ తాను ఏమాత్రం బాధపడకుండా ముందడుగు వేశానని అయితే ఒకప్పుడు నా గొంతు చూసి హేళన చేసిన వారే ఇప్పుడు నా గొంతుకు కూడా అభిమానులుగా మారిపోయారని తన వాయిస్ నచ్చడంతో తానే తన పాత్రలకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా వరలక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

































