దళిత బంధు ఒక పథకం కాదు మహోద్యమం అన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ కరీంనగర్ లో పర్యటించిన ఆయన.. హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత బంధు కొత్త చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు.

కాగా రైతు బీమా పథకం కూడా విజయవంతంగా కొనసాగుతుందన్నారు సీఎం కేసీఆర్ . రైతు బంధు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుందొన్నారు.తెలంగాణా సాకారం అయినట్లే ఎస్సీలు అభివృద్ధి కూడా జరగాలన్నారు.



































