Balagam Movie: ఇటీవల పల్లెటూరి నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సంగతి అందరికీ తెలిసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ అద్భుతమైన సినిమాకి కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు.

ఇంతకాలం ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించి ఆకట్టుకోవడమే కాకుండా జబర్దస్త్ ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన వేణు బలగం సినిమా ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు.
అయితే తాజాగా ఈ అద్భుతమైన సినిమాని వేణు కళ్ళముందే అపహాస్యం చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో బలగం సినిమా స్పూఫ్ తో స్కిట్ చేశారు.
తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షో కి వేణు అతిథిగా హాజరయ్యారు. దీంతో హైపర్ ఆది, తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ బలగం సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను కూడా వేణు ముందే కామెడీ చేశారు.
తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో ఆది, తాగుబోతు రమేష్, బుల్లెట్ భాస్కర్ కలసి స్కిట్ చేశారు. అలాగే ఈ స్కిట్ చివరిలో యాంకర్ రష్మి కూడా పాల్గొనింది.

Balagam Movie: స్కిట్ లో భాగమైన రష్మీ…
బలగం సినిమాలోని క్లైమాక్స్ లో పాట ఉన్నట్లుగా ఈ స్కిట్ చివర్లో కూడా జబర్దస్త్ ప్రవీణ్ పాట పడుతూ హైపర్ ఆది, రష్మీ ఇలా ఒక్కొక్కరి గురించి కామెడీగా వివరించి అందరినీ నవ్వించాడు. ఈ స్కిట్ చూసి కొందరు నవ్వుకుంటుంటే మరి కొంతమంది మాత్రం దర్శకుడి ముందే సినిమా గురించి ఇలా ఆపహేళన చేయడంతో మండిపడుతున్నారు.






























