Connect with us

Featured

Chandra Babu Naidu: మీ గొడవలలోకి మా పార్టీని లాగొద్దు… జగన్ కి బాబు వార్నింగ్!

Published

on

Chandra Babu Naidu: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలకు కారణమయ్యాయి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లి అలాగే తల్లిపై ఆస్తి విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ విషయం గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు సంచలనగా మారాయి. జగన్ షర్మిల ఆస్తి వివాదాలు పూర్తిగా వారి వ్యక్తిగతం.

Advertisement

ఇలా జగన్ తన తల్లి విజయమ్మ చెల్లి షర్మిలపై పిటిషన్ దాఖలు చేయడంతో ఇదే అదునుగా భావించిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా జగన్ గురించి విమర్శలు వర్షం కురిపిస్తుండడంతో జగన్ స్పందించారు. ఇది పూర్తిగా మా కుటుంబ వ్యవహారం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇలాంటి గొడవలు ఉంటాయి.

తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిసారి నా ఫోటో మా చెల్లి ఫోటో నా తల్లి ఫోటో పెట్టి రాజకీయాలు చేయొద్దు ఏం చంద్రబాబు నాయుడు మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు లేవా అంటూ ప్రశ్నించారు. ఇలా జగన్ స్పందించిన తీరుపై చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆస్తి వివాదాలు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం కానీ ఈ వ్యవహారంలోకి మా పార్టీని లాగొద్దు అంటూ జగన్ కి వార్నింగ్ ఇచ్చారు.

చిల్లర రాజకీయాలు…
తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఆయన భార్యకు రాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్ కు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన నిలదీశారు. జగన్ లాంటి ఒక వ్యక్తితో రాజకీయాలు చేయటానికి సిగ్గుగా ఉందని ఆయన చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఇకపై ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు సూచించారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Venu Swamy: ఆ నాయకుడికి గుణపం దిగబోతోంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు?

Published

on

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఈయన ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్పడంతో ఈయన చెప్పిన జాతకాలు నిజం అయ్యాయి. ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం నిజం కావడంతో ఈయన చెప్పిన మాటలను నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది.

Advertisement

ఇలా వేణు స్వామి తరచూ సినిమా సెలబ్రిటీల రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలిచారు. అయితే తెలంగాణ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈయన చెప్పిన జ్యోతిష్యం మాత్రం పూర్తిగా విరుద్ధం కావడంతో ఈయన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక తన జ్యోతిష్యం తప్పు కావడంతో ఈయన కూడా ఇకపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చొప్పనని తెలిపారు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మరోసారి సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. గత కొద్దిరోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమ అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ నాయకులు తనని టార్గెట్ చేస్తూ పూర్తిస్థాయిలో విమర్శిస్తున్నారు.

గుణపం దిగుతుంది..
వీళ్లు ఎవరిని చూసుకోనైతే గింగరాలు తిరుగుతున్నారో ఆ నాయకుడికి త్వరలోనే గుణపం దిగబోతోంది అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఈయన ఓ రాజకీయ నాయకుడు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈయనపై విమర్శలు వస్తున్నాయి. మరి వేణు స్వామి చెప్పిన ఆ నాయకుడు ఎవరు ఏంటి అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Balakrishna: బాలయ్య ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడానికి ఆమె జాతకమే కారణమా?

Published

on

Balakrishna: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు నందమూరి బాలకృష్ణ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు కెరియర్ ఎప్పుడు ఇలాంటి మరుపు తిరుగుతుందో తెలియదు అయితే వరుస సినిమాలతో సక్సెస్ అందుకుపోతున్నవారు ఒక్కసారిగా ఫ్లాప్ సినిమాలని ఎదుర్కొంటూ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలాగే మరికొందరు రాత్రికి రాత్రే స్టార్స్ గా మారిపోతూ ఉంటారు.

Advertisement

ఇలా సీనియర్ హీరో నందమూరి తారకరామారావు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ కెరియర్ లో కూడా హిట్టు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అయితే వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న బాలయ్యకు తన కుమార్తె బ్రాహ్మిని పుట్టిన తర్వాత కెరియర్ పరంగా మంచిగా కలిసి వచ్చిందని తెలుస్తోంది.

బ్రాహ్మణి..
డిసెంబర్ 21, 1988లో బ్రాహ్మణి జన్మించిగా.. బ్రాహ్మణి పుట్టిన తర్వాత బాలయ్య నటించిన.. విడుదలైన భలే దొంగ హిట్ అయింది. ఆ తర్వాత ముద్దుల మామయ్య ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాలగోపాలుడు యావరేజ్ అయినా… నారీ నారీ నడుమ మురారితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇలా బాలయ్య వరుస హిట్లతో దూసుకుపోవడంతో ఇదంతా తన కూతురు
బ్రాహ్మణి జాతకం ప్రభావమే అని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఇక వ్యాపార రంగంలో కూడా బ్రాహ్మణి ఎంతో మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

Advertisement
Continue Reading

Featured

Suriya: అమ్మ అప్పులు తీర్చడానికే హీరో అయ్యాను.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published

on

Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు సూర్య ఒకరు. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు సెలబ్రేట్ చేస్తుంటారు అలాగే ఈయన పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా జరుపుతుంటారు..

Advertisement

గజిని సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సూర్య అప్పటినుంచి తాను నటించిన సినిమాలన్నింటినీ కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య తాను హీరో కావడానికి కారణం తన తల్లి చేసిన అప్పులే అంటూ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

సూర్య తండ్రి శివకుమార్ ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగారు అయితే ఈయనకు సినిమాల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదట ఇక డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుండే వాడినని నెలకు 300 రూపాయల జీతం ఇచ్చేవారని సూర్య తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల నాన్న కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఆ సమయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.

అమ్మ చేసిన అప్పు…
ఇక అమ్మ నాన్నకు తెలియకుండా అప్పట్లో 25 వేల రూపాయలు అప్పు చేశారు. ఆ విషయం నాకు చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. అయితే నాన్న సినిమాలలో నటించడంతో ఓసారి మణిరత్నం గారు ఓ సినిమా కోసం మా ఇంటికి వచ్చారు.అదే 1997లో వచ్చిన నెరుక్కుర్ నేర్. ఈ సినిమాలో విజయ్ హీరో. నేను సెకండ్ హీరో. నేను చేయను నాకు ఇష్టం లేదు అని చెప్తే మణిరత్నం బలవంతంగా ఒప్పించారు. అలా నా సినీ జర్నీ ప్రారంభమైందని, మొదటి సినిమాతోనే అమ్మ అప్పు తీర్చేశానని అది నాకు ఎప్పటికీ సంతోషం కలిగించే విషయం అంటూ సూర్య తెలిపారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!