Connect with us

Featured

ఇలా చేస్తే పిప్పిపన్ను నొప్పినుంచి క్షణాల్లో ఉపశమనం…

Published

on

పిప్పి పన్ను బాధ అనుభవించినవారికి తప్ప వేరేవారికి తెలియదు. నిజంగా ఆ బాధతో బాధపడేవారు బాధపడలేక చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటారు. ఆ పరిస్థితుల్లో తక్షణం ఉపశమనం కోసం వెతుకులాడటం జరుగుతుది. నరకం కనిపిస్తుంది.

Advertisement

పిప్పి పన్నును పీకించే వరకు చుక్కలు కనిపిస్తాయి. ఇంతకూ ఏం చేస్తే పిప్పి పన్ను నొప్పిని అదిగమించొచ్చో కింద తెలుసుకుందాం…

పిప్పి పన్ను ద్వారా ఏర్పడిన గుంతలో ఆహారం ఇరుక్కొని తెగ బాధ పెడుతుంది…అపుడు కాస్త ఇంగువని తీసుకొని ముద్దగా చేసి ఆ గుంటలో నింపాలి దాని వల్ల అక్కడ ఉన్న నొప్పి అంతా అది గుంజేసి నిమిషాల్లో నొప్పిని తగ్గిస్తుంది…అలాగే మరో మంచి ఉపాయం లవంగం నూనె ఈ లవంగం నూనెలో కాస్త దూదిని ముంచి పిప్పి పన్ను మీద పెట్టి పై పన్ను తో అదిమి పెడితే కొద్దిసేపటిలో నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది..

Advertisement

అలాగే కొన్ని పత్తి గింజలను తీసుకొని వాటిని కాల్చి బూడిద చేయాలి దాంతో రోజు పళ్ళు తోముకొని గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించాలి..కొన్ని సార్లు పిప్పి పళ్లతో విపరీతమైన బాధ కలుగుతుంది..దీనికోసం మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి.

ఏవైపు పంటి నొప్పి ఉన్నదో ఆ వైపు చెవిలో 3 చుక్కలు పొయ్యాలి. దానికి ముందు నోటిలో కంది పప్పు లేక శనగ పప్పు కొంచం వేసుకుని చెవిలో రసం పోసిన తరువాత ఆ పప్పు నమలటం వలన ఆ రసం చెవి రంధ్రం ద్వారా పంటి నొప్పి వున్న చోటు వరకు చేరుతుందన్నమాట. ఇలా మూడు రోజులు చేసెసరికి పంటి నొప్పి దూరమవుతుంది.

Advertisement

అలాగే పసుపు ఉప్పును కలిపి పేస్ట్ లా చేసి పళ్ళు తోముకున్నా పిప్పి పన్ను సమస్య నుండి బయటపడవచ్చు..హాయిగా నవ్వడానికి అందమైన పలువరుస కావాలి… తిన్నది బాగా జీర్ణం కావడానికి బాగా నమలగలిగే దంతాలు కావాలి.. స్పష్టంగా, అందంగా మాట్లాడడానికి ఆరోగ్యకరమైన పళ్ళు ఉండాలి…

అంతేకాదు.. కొన్నిసార్లు కొన్ని ప్రమాదాల నుంచి రక్షించేందుకు కూడా బలమైన దంతాలు కావాలి…
ఒకటా.. రెండా… ఎన్నో రకాలుగా మనకు సేవలందించే మన దంతాలు ఆరోగ్యానికి వాకిళ్లు. రోగాలకు రహదారులు కూడా. అందుకే నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా సంపూర్ణంగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరేమో గాని.. శరీర ఆరోగ్యమైతే మంచిదవుతుంది. మరి ఆ నోటిని, దంతాలను ఎలా కాపాడుకోవాలి?

Advertisement

దంత ఆరోగ్యంలో కీలకమైనది దంతాల పరిశుభ్రత. రోజుకి రెండుసార్లు దంతధావనం తప్పనిసరిగా చేయాలి.
దంతాలకు ఆహారం అతుక్కోకుండా చూసుకోవాలి. తినగానే తప్పనిసరిగా పుక్కిళించాలి. మనం నమిలేటప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి బాగా నమలి తినడం ఒత్తిడినీ తగ్గిస్తుంది. చూయింగ్ గమ్ మంచిదే. దంతాలకు వ్యాయామం నమలడం వల్ల. చక్కెర లేని చూయింగ్ గమ్‌లు నమిలితే మరీ మంచిది.

తాజా పండ్లు ఎక్కువగా తినాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. పిల్లలకు చెరుకు లాంటి ఎక్కువగా నమిలే పదార్థాలను పెట్టడం వల్ల దంతాలు దృఢంగా తయారవుతాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బలమైన దవడలు, దంతాలు ఏర్పడ్తాయి. కాబట్టి మంచి ఆహారమే దంతాలకు క్షేమకరం. గర్భిణులకు కాల్షియం సప్లిమెంట్లు అందుకే ఇస్తారు. కాని టెట్రాసైక్లిన్స్ లాంటి యాంటిబయాటిక్స్, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాల మందుల వల్ల గర్భస్థ శిశువుపై ప్రభావం పడుతుంది.

Advertisement

వాటివల్ల తరువాత ఏర్పడే దంతాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి గర్భిణులుగా ఉన్నప్పుడు యాంటిబయాటిక్స్ లాంటి మందులతో జాగ్రత్త 6 నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి దంతాలను డాక్టర్ చేత శుభ్రం (స్కేలింగ్) చేయించుకోవాలి. దీని వల్ల దుర్వాసన రాదు. దంతక్షయాన్నీ నివారించవచ్చు.
పొగతాగడం, ఆల్కహాల్, గుట్కా లాంటి అలవాట్లు దంతాలకు శత్రువులు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!