Health News
ఈ పచ్చడి తింటే ఏకంగా 300 వ్యాధులు మీ దగ్గరకూడా రావు అదేంటో తెలుసుకొని అందరికి తెలియజేయండి.
Published
7 years agoon
By
telugudeskఈ పచ్చడితో 300 వ్యాధులు దూరం!!
మన చుట్టూ ఉన్న ఆకులు, కాయల్లోనే ఎన్నో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. ఎన్నో మొండి వ్యాధులను నయం చేయగలిగిన లక్షణాలున్నాయి. అంతేకాదు వాటిని మన వంటల్లో భాగం చేసుకోవడం వల్ల కొన్ని వ్యాధుల ముప్పు కూడా తప్పిపోతుంది. అందులో ఇప్పుడు తెలుసుకోబోయే ఆకు కూడా ఒకటి. సాధారణంగా మునగ కాయలతో ఇగురు కూరలు చేసుకోవడం మనకు తెలుసు. మునగ కాయలు సాంబారులోనే ఎక్కువగా వేస్తారు. అలాగే పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. మునగ కాయలే కాకుండా ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా..
మనం తినే ఏ ఆకు కూరల్లోనూ లేనన్ని ఆరోగ్య గుణాలు మునగ ఆకులో ఉన్నాయి. అన్నికాలాల్లో దొరికే ఈ మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటే మనం తరచూ ఎదుర్కొనే చిన్న చిన్న వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. దీంట్లో విటమిన్ ఎ అధికంగా ఉండడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా చేస్తుంది. బరువు లావు తగ్గాలనుకునేవారికి మునగాకు బాగా ఉపయగపడుతుంది. దీనిలోని విటమిన్ సి ఎముకలను బలపరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సిలే కాకుండా క్యాల్షియం, ఐరన్ ఫాస్పరస్ ఎక్కువ గా ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకును పచ్చడి లేదా కూర చేసుకుని తింటే..
జీర్ణశక్తిని పెంచుతుంది. మదుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అయితే ఇన్ని ఔషద గుణాలున్న మునగాకు పచ్చడి ఎలాతయారు చేయాలో చూద్దాం. ఒక పాన్ లో కొంచెం నూనె వేసి వేడిగా అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు, పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా వేయించి తీసి ఒక బౌల్ లో పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత రెండు కప్పుల మునగాకు అదే పాన్ లో కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో ముందు వేంపిన దినుసులన్నీ వేసి మిక్సి పట్టి ఆ తరువాత మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిర్చి వేసి తాలింపు పెట్టి రబ్బుకున్న పచ్చడి అందులో వేసి కలిపి దించేయాలి. ఇలా చేసిన పచ్చడిని ఈ సీజన్ లో తరచుగా తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
You may like
Featured
Butter Milk Side Effects: ఆరోగ్యానికి మంచిదని మజ్జిగ ఎక్కువ తాగుతున్నారా… ప్రమాదంలో పడినట్లే?
Published
11 months agoon
26 November 2023By
lakshanaButter Milk Side Effects: మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ ఉండటం సర్వసాధారణం అయితే పెరుగుతో పోలిస్తే చాలామంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉండడంతో ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారు.
ఇలా మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరం కూడా హైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని భావిస్తూ చాలామంది మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కాదని మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మనల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పాలు పాల పదార్థాలలోనూ లాక్టోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందిలో జీర్ణక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. ఎవరికైతే లాక్టోస్ ను జీర్ణం చేసే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కావు లాంటివారికి మజ్జిగ తాగటం వల్ల అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే కడుపు నొప్పి రావడం కడుపు చాలా ఉబ్బర కావడం విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా మంచిగా తీసుకోకపోవడం ఎంతో మంచిది.
చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి…
ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకు కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచిది ఇక చాలా మంది మజ్జిగలో ఉప్పు అధికంగా వేసుకొని తాగుతూ ఉంటారు ఇలా అధికంగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉప్పు నిలువలు పెరిగిపోయి హై బీపీ రావడానికి కూడా కారణం అవుతుంది. ఇక మరికొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రోజు ఒక గ్లాస్ కి మించి మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Featured
Pregnant After 40 Years: మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం మంచిదేనా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Published
11 months agoon
25 November 2023By
lakshanaPregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…
40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.
40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.
18 నెలల గ్యాప్ అవసరం…
మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
Featured
Doctor Kiran : ఫోన్ వల్లే గుండె పోటు… వాక్సిన్ వల్ల జరుగుతోంది…: డాక్టర్ కిరణ్
Published
2 years agoon
8 March 2023By
BhargaviDoctor Kiran : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండె పోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్త వయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు వంటి విషయాలను డాక్టర్ కిరణ్ వివరించారు.
వాక్సిన్ కాదు స్మార్ట్ ఫోన్ వల్లే గుండె పోటు…
మారుతున్న జీవన సరళి వల్ల ఆహారపు అలవాట్లు, పని అన్నీ మారిపోయి మనం ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల భారిన పడటం వలన ఇన్ని రోజులు గుండెపోటు మరణాలు సంభవించేవి. అయితే ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారికే ఎక్కువగా గుండెపోటు సంభవించడానికి గల కారణాలను డాక్టర్ కిరణ్ వివరించారు. యువతలో అనారోగ్యాలకు గుండె ఆరోగ్యం మీద చూపే ప్రభావాలలో మొదటిది ఫోన్ వాడకం.
గంటలు గంటలు ఫోన్లను చూస్తూ చేతులు కాళ్ళు కదల్చకుండా ఉంచడం వల్ల చాలా శరీర భాగలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అపుడు రక్తం సరఫరా చేయడానికి గుండె మరింత బలంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల గుండె మీద భారం అధికమై చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇక బరువు ఉన్నట్టుండి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురావుతున్నాయని తెలిపారు. ఇక కరోనా వాక్సిన్ వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనేది అపోహ మాత్రమే, ఆ వాక్సిన్లు వేయించుకున్నందుకే మనం బ్రతికి ఉన్నాం అంటూ తెలిపారు.
Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?
Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?
Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!
Rakul Preeth Singh: వారం రోజులుగా ఆసుపత్రి బెడ్ పై నటి రకుల్… ఏం జరిగిందంటే?
Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!
Tirupathi Laddu: తిరుపతి లడ్డు వివాదం.. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్?
Roja: తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: రోజా
Chandra Babu: హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్!
Trending
- Featured4 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured2 weeks ago
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!
- Featured2 weeks ago
Tirupathi Laddu: తిరుపతి లడ్డు వివాదం.. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్?
- Featured2 weeks ago
Roja: తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: రోజా
- Featured2 weeks ago
Chandra Babu: హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్!
- Featured4 weeks ago
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్..హింట్ ఇచ్చిన తమన్ సంతోషంలో అభిమానులు!
- Featured3 weeks ago
Anasuya: ఆ విషయంలో ఆ హీరో బాగా ఒత్తిడి చేశాడు… సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ!
- Featured4 weeks ago
Kumari Aunty: వరద బాధితులకు అండగా కుమారి ఆంటీ.. ఎంత సాయం చేశారో తెలుసా?