Connect with us

General News

పుట్టిన నెలను బట్టి ఏ అమ్మాయి మనస్తత్వం ఎలా ఉంటుందో చూడండి..

Published

on

ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే అంటుంటాం. వారు ఎప్పుడు ప్రస్నార్ధకమ. ఓ పట్టాన అర్ధం కారు. ఎంత అర్ధం చేసుకోవాలని ప్రయత్నించినా అర్ధం కావడం లేదు అంటుంటారు. అయితే, ఆడవారిని అర్ధం చేసుకోవడానికి సహనం కావాలి. పురాణ కాలంలో శ్రీకృష్ణుడు, మహావిష్ణువు వంటి వారే ఆడవారిని అర్ధం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇక మానవమత్రులమైన మనం ఎంత. వారు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు. అలాంటి సమయంలో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి. ఇకపోతే, ఆడవారు పుట్టిన నెలను బట్టి వారి మనస్తత్వం ఉంటుందట. మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం.

Advertisement


1. జనవరి: ఈ నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీగా ఉంటారట. వీరిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు మాట్లాడుకుంటుంటే కోపగించుకుంటారు. అలాంటి వారిని ఎక్కువగా ద్వేషిస్తారు. వీరి స్వతంత్రంగా ఉండేందుకే ఆసక్తి చూపుతారు. నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువ.

2. ఫిబ్రవరి: వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అలాగే వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై వీరికి ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. అయితే, వీరు అంత తేలికగా ఎవరికీ అర్ధం కారు. ఎందుకంటే వీరి మూడ్ ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. ఇలాంటి ఆడవారిని ఎవరైనా మోసం చేశారంటే లైఫ్ లో వారిని మళ్లీ నమ్మరు.

3. మార్చి: ఈ నెలలో పుట్టిన అమ్మాయిల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా, విశ్వాసంగా ఉంటారు. వీరు ఎవరినైతే నమ్ముతారో వారిపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు. వీరిని ప్రేమలో దింపాలంటే మాత్రం చాలా కష్టం. ఒక్కసారి వీరు మీ ప్రేమలో పడ్డారనుకో మీరు అదృష్టవంతులే. ఎందుకంటే జీవితాంతం మీతోనే ఉండాలని పిక్స్ అయిపోతారు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్న మీ నుంచి దూరంకారు. మీకు అండగా ఉంటారు.

Advertisement


4. ఏప్రిల్: ఏప్రిల్ నెలలో పుట్టిన అమ్మాయిలు మంచి తెలివైన వారు. ఎలాంటి పనినైనా వీరు ఈజీగా డీల్ చేయగలరు. ప్రతి ఒక్కరి మనస్సును సులభంగా దోచుకుంటారు. ఇక వీరు ప్రేమించిన వ్యక్తులు వీరిని కాకుండా ఇతరుల్ని ప్రేమిస్తే వీరు తట్టుకోలేరు. వీరికి అసూయ ఎక్కువ. వీరు చాలా డైనమిక్ గా, యాక్టివ్‌గా ఎట్రాక్టివ్ గా ఉంటారు.

5. మే: మే నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారు. వీరితో ప్రేమలో పడ్డారంటే ఇంకా అంతేసంగతులు. మీరు కచ్చితంగా డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లే. వీళ్లు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోలేదు. వీరిలో హార్డ్ వర్క్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు కాస్త నిజాయితీగా ఉంటారు.

6. జూన్: జూన్ లో పుట్టిన అమ్మాయిల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మంచి కమ్యూనికేషన్స్ కలిగి ఉంటారు. ఏం మాట్లాడినా దానికి ముందు బాగా అలోచించి మాట్లాడుతారు. ఏ విషయాన్ని అయినా ముఖం మీదే చెప్పేస్తారు. మనుషుల వెనక మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాదండోయ్ వీరు కాస్త ప్రమాదకరమైన వ్యక్తులు కూడా.

SAMSUNG CSC


7. జూలై : ఈ నెలలో పుట్టిన మహిళలు చాలా నిజాయితీగా ఉంటారు. అంతేకాదు చాలా అందంగా ఉంటారు. మంచి తెలివి గల వారు. వీరు విభేదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చుట్టూ ఉన్న వ్యక్తులతో మర్యాదగా ఉంటారు. జాలి గుణం ఎక్కువ. రిలేషన్స్ ను కాపాడుకుంటారు. వీళ్లు ఒక్కసారి హర్ట్ అయ్యారంటే అంతేసంగతి. మళ్లీ వీళ్లు మామాలు మనుషులు కావడానికి చాలా టైమ్ పడుతుంది.

8. ఆగస్టు: ఆగస్ట్ లో పుట్టినవారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. మంచి మనస్సు, మనస్తత్వం కలిగి ఉంటారు. సెన్సార్ హ్యుమర్ కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తారు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు.
9. సెప్టెంబర్: సెప్టెంబర్ లో పుట్టిన అమ్మాయిలకు జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణ కూడా ఎక్కువే. అందానికి ప్రతిరూపంగా ఉంటారు. మోసగించిన వారిని వీరు అస్సలు క్షమించరు. ప్రతీకారం తీర్చుకునే వరకు వదలరు. వీరిని ఎప్పటికి కూడా ఇబ్బంది కలిగించకూడదు. వీరి కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్ పెక్టేషన్స్ కలిగి ఉంటారు. నిజాయితీగా, సెన్సిటివ్ గా ఉంటారు. మనసులో ఉన్న ఫీలింగ్స్ ను బయటకు చెప్పరు. అందుకే వీరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం.

Advertisement


10. అక్టోబర్ : అక్టోబర్ లో జన్మించిన మహిళలకు చిన్నచిన్న విషయాలకు భయపడే మనసత్వం ఉండదు. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. వీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. అయితే వీరి ఫీలింగ్స్ ను అందరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. వీరు ఇతర మహిళలకు అంతగా నచ్చరు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలంటే మిగతా వారికి అసూయ ఎక్కువ. వీరుకొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు.

11. నవంబర్: వీరు ఇతరులతో పోల్చుకుంటే ప్రతి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. వీరి దగ్గర ఏదైనా అబద్దం చెబతే వెంటనే వీరు గుర్తుపడతారు. అందువల్ల వీరితో ఎప్పుడు కూడా అబద్దం చెప్పకూడదు. వీరు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా ఉంటారు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు, చాలా షార్ప్‌గా ఆలోచిస్తారు.

12. డిసెంబరు: వీరేప్పుడు అసహనానికి గురవుతుంటారు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే బలాన్ని కలగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చి మూడ్ బగాలేకున్నా వెంటనే తిరిగి మాములు స్థితికి ఎలా రావాలో వీరికి బాగా తెలుసు. వీళ్లు ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. చాలా తేలికగా లక్, వెల్త్ పొందుతారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?

Published

on

Ambulance: మనకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి సరైన సమయంలో చికిత్స అందడం కోసం అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం వారు కూడా మన ప్రాణాలను నిలబెట్టడానికి వారి ప్రాణాలను కూడా లెక్కచేయరు కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ తన వృత్తిని మరిచిపోయి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు దిగారు. దీంతో పేషంట్ గా ఉన్న ఆమె భర్త ప్రాణాలను వదిలిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Advertisement

పూర్తి వివరాలలోకి వెళ్తే..ఈ ఘటన లోరి ఘజిపుర్‌లో చోటుచేసుకుంది. మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ తగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో తిరిగి తన భర్తను ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడి తన భర్తను అందులో ఎక్కించి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

మార్గమధ్యమంలో అంబులెన్స్ డ్రైవర్ తన హెల్పర్ ఆ మహిళ పట్ల లైంగిక వేధింపులకు గురి చేశారు. తనని ముందు సీట్లో కూర్చోవాలని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించడంతో ఆంబులెన్స్ లో ఉన్నటువంటి తన భర్త తన సోదరుడు పెద్ద ఎత్తున అరవడంతో ఆంబులెన్స్ డ్రైవర్ ఆ మహిళ దగ్గర 10000 రూపాయలు విలువ చేసే బంగారం లాక్కొని పేషంటును మార్గమధ్యమంలోనే వదిలేసి ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు.

ఆక్సిజన్ తొలగించి..
ఇలా ఆక్సిజన్ తొలగించడంతో సదరు మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అప్పటికే వేరే అంబులెన్స్ కు ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ తీరుపట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!

Published

on

Vijayawada Floods: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం నదులను తలపిస్తోంది. భారీగా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారు.

Advertisement

ఈ వరదల కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది. సరైన సమయంలో కనీసం తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వరదలలో ఎంతో మంది ఇతరులను రక్షించి వారు ప్రాణాలను కోల్పోయిన సంఘటనలను మనం చూస్తున్నాము.

కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్‌(32)కు సింగ్‌నగర్‌లో డెయిరీఫాం ఉంది. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు మరో ఇద్దరు డైరీ ఫామ్ లో పనిచేసే వర్కర్లు ఈ వరదల్లో చిక్కుకున్నారు. అయితే ఆ నలుగురిని చంద్రశేఖర్ రక్షించారు. ఇక తన ఫామ్ లో 50ఆవులను తాళ్లతో కట్టేసి ఉంటే వాటన్నింటినీ కూడా విడదీసి తాను కూడా సురక్షితంగా బయటకు రావడం కోసం షెడ్ పైకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.

నలుగురికి ప్రాణదానం..
ఇలా షెడ్ పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి కింద పడటంతో ఆయన వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అయితే తన డైరీ ఫార్మ్ దగ్గరలోనే తన మృతదేహం కనిపించడంతో తన కుటుంబ సభ్యులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా ప్రస్తుతం తన భార్య 8 నెలల గర్భిణీ. ఇలా తమ ప్రాణాలను రక్షించి చంద్రశేఖర్ ప్రాణాలను కోల్పోవడంతో తన సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

General News

నంద్యాలలో విషాదం.. అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి కుటుంబంలో నలుగురు మృతి

Published

on

ఏపీ, నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. గురువారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికుల సమాచారం. ఈ ఘటనలో తల్లపురెడ్డి గురుశేఖర్ రెడ్డి (45), అతని భార్య దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Advertisement

సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి మిద్దె కూలి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని గ్రామస్థులకు సూచించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!