Connect with us

Movie News

వీల్లు సినిమాలు మానేసి చాల పాపులర్ అయ్యారు..

Published

on

సినిమాని మనం అబిమానులుగా చాలా ప్రేమిస్తాము. సినిమాల్లో నటించిన నటి నటులను కూడ అంతే అబిమానిస్తాం. సినిమా ప్రపంచానికి ఎలాంటి కుల మత దేష భావాలు ఉండవు. సినిమాల్లో నటిస్తున్న నటులకి సినిమా తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. కాని ఈ వీడియో లో ఇప్పుడు మీరు చూడబోతున్న నటినటులు మాత్రం సినిమాల్లో అవకాశాలు ఎలా ఉన్న వాటిపై ఆదార పడకుండా చాల బిజిగా లైఫ్ గడిపేస్తున్నారు.

Advertisement

మరి వీల్లేదో బిజినెస్ లేదా ఉద్యోగం చేస్తున్నారనుకుంటే మీరు పప్పు లో కాలేసినట్టే. ఈ నటి నటులు పూర్తిగా దేవుని సేవ లో నిమగ్నం అయిపోయి సినిమాలను పక్కన బెట్టి మరి మత ప్రబోదకులుగా కొత్త అవతారం ఎత్తారు. మరి ఎవరు ఏ దేవుని సేవ చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో తెలుసుకుందామా..

Lets Start with హీరో రాజా. 2002 లో ఓ చిన్నాదాన సినిమాతో తెరంగేంట్రం చేసిన రాజా, ఆనంద్ సినిమాతో మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012 వరకు ఎదో ఒక సినిమాతో తెర పైన కనబడ్డ రాజా ఇప్పుడు క్రిష్టియన్ మత ప్రబోదకుడిగా బ్రదర్ రాజా గా తన మరో మజిలిని ప్రారంబించాడు. 2014లో అమ్రిత విన్సెంట్ ని పెల్లి చేసుకొని ఒక కూతురు తో పుల్ హ్యాపిగా ఉనాడు. YSRCP కోసం ప్రచారం చేస్తు రాజకీయల్లో కూడ ఆక్టివ్ గా కనబడుతున్నాడు.

Advertisement

నంబర్ 2. హీరోయిన్ నగ్మా. సల్మాన్ ఖాన్ తో హిందీ లో నటించడం మొదలెట్టిన ఈ హాట్ బామ ఇటు సౌత్ అటు నార్త్ అనే తేడా లేకుండా దాదాపు 8 బాషల్లో 1990 నుండి 2007 వరకు 60 కి పైగా చిత్రాల్లో నటించింది. వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడు కాంట్రవర్సిలతో ఉండే బామ సమయం దొరికినప్పుడల్లా క్రిష్టియన్ మత ప్రబోదకాలు చేస్తూ పుల్ జోష్ లో ఉంది..

నంబర్ 3. బాపు బొమ్మ దివ్య వాణి. పెళ్లి పుస్తకం సినిమాతో తెలుగులో పాపులర్ అయిన నటి దివ్య వాణి కొన్ని సినిమాల తర్వాత పెళ్లి చేసుకొని నటన కి స్వస్తి చెప్పింది. చాల గ్యాప్ తీసుకొని మరల బాపు దర్శకత్వం లో వచ్చిన రాద గొపాళం సినిమాలో వేను మాదవ్ తో జోడిగా నటించి అందరికి షాకిచ్చింది. కాని అమే పైన అనేక రూమర్స్ కూడ చక్కర్లు కొట్టాయి. తన స్వతహగ క్రిస్టియన్ కాబట్టి నటించే సందర్బలో కూడ బొట్టు పెట్టుకోనని మెడలో తాలి కూడ వేసుకోనని కరా కండీగా చేప్పేదట. ఇలాంటి ప్రవర్తనతో విసిగిపోయిన దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మానేసినట్టుగా సమాచారం. సినిమాల సంగతి ఎలా ఉన్న నటి దివ్య వాణి మాత్రం యేసు ప్రభువు సేవ చేస్తు మత ప్రబోదకురాలిగా చాల బిజిగా ఉన్నారు.

Advertisement

నంబర్ 4. సూర్య. ఈ పేరు చెప్తే టక్కున గుర్తు రాకపోవచ్చు కాని మగదీర సినిమాలో కాజల్ కి తండ్రి పాత్రలో నటించిన సూర్య అంటే అందరు గుర్తు పడతారు. సూర్య కూడ సినిమాల్లో కంటే బయట ప్రోగ్రాంస్ చేస్తూ చాల బిజిగా ఉన్నారు. తాను సేవ చేయడానికే పుట్టానని మంచి పాత్రలు వస్తే చేస్తున్నానని చెప్తారు.

నంబర్ 5. మోహిని. తమిళ్ తెలుగు మలయాళ బాషల్లో 2011 వరకు 50కి పైగ సినిమాల్లో హీరొయిన్ గా చేసిన ఈ ఆదిత్య 369 హీరోయిన్ పెళ్లి చేసుకొని సినిమాలకు టాటా చెప్పి యేసు సేవలో నే పుర్తిగా తన సమయం గడుపుతుంది. వీల్లే కాకుండ ఉల్లాసంగా ఉత్సాహంగా లో నటించిన సాయి, తమిల్ ఆక్ట్రెస్స్ ఆర్తి లాంటి వాళ్లు కూడ దేవుడి పై వారికి ఉన్న భక్తి ని చాటుకుంటూ ఉన్నారు. హీరో రజినికాంత్ కూడ ఎన్నో సార్లు జీసస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి సినిమాలు లేక వీళ్లు ఈ దారి ఎంచుకున్నారా లేక మరి ఇంకా ఎమైన వేరే కారాణాలు ఉన్నాయో ఎమో కాని మొత్తానికి వీల్లంతా తమ వృత్తిని వదిలేసి పూర్తిగా దేవుడు పైన బారం వేసారు.

Advertisement

ఇంకో మాట ఈ వీడియో ఎవరిని ఏ మతాన్ని ఉద్దేషించి చేసింది కాదు మీకు తెలియని సమాచారన్ని తెలియచేయటమే నా ముఖ్య ఉద్దేషం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!