Connect with us

Movie News

స్వాతిముత్యం హాట్ అందాల బామ అవకాశాలు లేక ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి

Published

on

క్రైస్తవ ప్రచారకర్తగా మారిన అలనాటి అందాల తార దీప…

Advertisement

ఒకప్పటి సౌత్ స్ర్కీన్ మీద ఆమె అందాల రాశి. మతిపోగొట్టే అందం ఆమె సొంతం. చక్రాల్లాంటి కళ్ళతో ఆకర్షణీయమైన ముఖంతో అప్పటి ప్రేక్షకుల హార్ట్ బీట్ వేగాన్ని పెంచేది. ముఖ్యంగా ఆమె ఎక్కువగా శృంగార భరితమైన పాత్రలు పోషించేది.

తెలుగు లో పంతులమ్మ, అమెరికా అమ్మాయి, దశతిరిగింది, కొత్తనీరు,అక్బర్ సలీం అనార్కలి, లేడీస్ టైలర్, డబ్బెవరికి చేదు, స్వాతి ముత్యం, లాంటి చిత్రాలతో బాగా పాప్యులారిటీ తెచ్చుకుంది. స్వతహాగా ఆమె మలయాళీ. మలయాళ తెరమీద ఆమె ఉన్నీ మేరి గా కొన్ని దశాబ్దాల కాలం పాటు అలరించింది. అప్పటి మాలీవుడ్ సూపర్ స్టార్స్ అందిరితోనూ తెరమీద తన అందంతో , అభినయంతో ఆకట్టుకొనేది.

Advertisement

1962 లో కేరళలోని ఎర్నాకుళం లో అగస్టిన్ ఫెర్నాండెజ్ , విక్టోరియా దంపతులకు జన్మించింది. అక్కడే సెయింట్ థెరిసా కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. మూడేళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె తల్లి ప్రొఫెషనల్ బ్యాలే ట్రూప్ ను రన్ చేస్తూ ఉండేది.

1969 లో నవవధు అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో ఉన్ని మేరీ అంటే ఒక హాట్ బ్రాండ్. అప్పటి ఆమె సినిమాలు మాలీవుడ్ యూత్ ను బాగా ఎట్రాక్టివ్ చేసేవి. మలయాళ, తమిళ్, తెలుగు , కన్నడ భాషల్లో లెక్కకుమించిన చిత్రాల్లో నటించింది. 1982లో రిజాయ్ అనే కాలేజ్ ప్రొఫెసర్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు నిర్మల్ అనే ఒక కొడుకు. రిహాన్ అనే మనవడు.

Advertisement

1992 లో వచ్చిన ఎన్నోడిష్టం కూడామో అనే సినిమా ఆమె చివరిది. నైంటీస్ లోకి అడుగుపెట్టేసరికే దీప బాగా లావు అయిపోయింది. భారీ శరీరంతో ఆమె సినిమాల్లో చాలా ఇబ్బందిగా నటించేది. ఆ శరీరంతోనే ఆమె కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత సినీ రంగానికి గుడ్ బై చెప్పేసింది. స్వతహాగా ఆమె క్రిష్టియన్ కావడంతో, సినిమా రంగాన్ని వదిలేసిన నాటినుంచి స్పిరిట్యువల్ వే లో ట్రావెల్ చేస్తోంది.

చాలక్కుడి లోని పొట్ట అనే గ్రామంలో స్పిరిట్యువల్ క్యాంప్ నిర్వహిస్తూ, ఎవాంగ్లిష్ట్ గా మారిపోయింది. క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

Advertisement

ఇప్పుడు దీప.. అప్పటి భారీ శరీరాన్ని కొంత వదిలించుకొని కాస్త నాజూగ్గా తయారైంది. తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటున్నారా అని అడిగితే, నేను సినిమాలు చూసి చాలా కాలమైపోయింది. ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొని రావాలంటే కొంచెం కష్టమే..

దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. నాజీవితాన్నిఇలాగే ఆనందంగా గడిపేస్తానని అంటోంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!