Connect with us

Featured

బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ.. కాని ప్రజల ఓట్లే నిర్ణయించాయనడం శుద్ధ అబద్ధం, ఇదిగో సాక్ష్యం

Published

on

‘బిగ్ బాస్’ షో చాలా బాగుందని, ఈ షో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని శివబాలాజీ లాస్ట్ వర్డ్స్ చెప్పాడు. ‘బిగ్ బాస్’ ట్రోఫీని, రూ.50 లక్షల ఫ్రైజ్ మనీని అందుకున్న అనంతరం శివబాలాజీ మాట్లాడుతూ, ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను.. నా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాస్తవం చెప్పాలంటే వాళ్ల వల్లే నేను ఇంత ప్రశాంతంగా ఈ షోలో ఉండగలిగాను. నేను సాధించిన ఈ విజయంలో వాళ్ల పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రుల లాగా. ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఊహించలేదు. ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. పిల్లలకు నా ముద్దులు.. థ్యాంక్యూ సో మచ్’అని చెప్పాడు. ఇక..

Advertisement

బిగ్‌బాస్ షో మొదలైన రోజు నుంచే బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. పార్టిసిపెంట్స్ అంతా ఒకచోట చేరి చేసే అల్లరి వేషాలు, సందడి, హ్యాపీ మూమెంట్స్, బాధాకర గుర్తులు ప్రేక్షకుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోయేలా ఉన్నాయి. ఎన్టీఆర్ హోస్టింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 70 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ షో ఫైనల్ ఆదివారం జరిగింది. ఈ షో ఫైనల్ విన్నర్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూసిన ఎదురు చూపులకు తెర పడింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరిగా పార్టిసిపెంట్స్ అంతా ఎలిమినేట్ అవుతూ చివరకు శివబాలాజీ, ఆదర్శ్ మిగిలారు. వాళ్లిద్దర్నీ ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ పైకి తీసుకొచ్చి బిగ్‌బాస్ సీజన్1 ఫైనల్ విన్నర్ ని ప్రకటించారు. ఆయనే శివబాలాజీ. 3 కోట్ల 34 లక్షల 3 వేల 154 ఓట్లతో విన్నర్‌గా నిలిచారు. అయితే బిగ్ బాస్ మొదటి నుంచీ బల్ల గుద్ది మరీ చెబుతున్నట్లు ఈ విన్నర్ ని నిజంగా ప్రేక్షకుల ఓట్లే నిర్ణయించాయా? మరి అయితే మధ్యలో ఈ పిచ్చి పనులు ఎందుకు? నాలుగున్నర గంటల పాటు సాగిన గ్రాండ్ ఫినాలేలో ఓవరాల్ విన్నర్ ని ప్రకటించడానికి ముందు జరిగిన మిస్టేక్స్ ని ఓసారి చూద్దాం..

చాలా మంది బిగ్ బాస్ విన్నర్ హరితేజ అవుతుందని భావించారు. అయితే చాలా మంది ఊహలు తారుమారు అయ్యాయి. ఆమె మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదుగురు ఫైనలిస్టుల్లో మొదట అర్చన ఎలిమినేట్ అవ్వగా….. అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయ్యారు. నవదీప్ ఎలిమినేట్ అయ్యే క్రమంలో నలుగురు సభ్యులతో ఎన్టీఆర్ బాక్సుల గేమ్ ఆడించారు. గేమ్ ఉత్కంఠగా సాగిన అనంతరం నవదీప్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఐదుగురు హౌస్ మేట్స్ నుండి…ఒకరిని విజేతగా ప్రకటించే క్రమంలో అందరి కంటే ముందుగా అర్చన ఎలిమినేట్ చేశారు. ప్రేక్షకులు ఊహించినట్లే అందరికంటే ముందుగా అర్చన ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. అయితే మొదటి నుంచీ బిగ్ బాస్ చెబుతున్నదేమిటంటే ప్రేక్షకుల ఓట్లే అంతిమ విజేతను నిర్ణయిస్తాయన్నారు. మరి నలుగురి పోటీదారుల్లో నవదీప్ ను ఎలిమినేట్ చేయించడానికి బాక్సుల గేమ్ ఆడించడం ఏమిటి? అక్కడ తక్కువ ఓట్లు వచ్చిన (తక్కువ వచ్చాయని చెబుతున్నారు ఇందులో నిజం ఎంతో?) నవదీప్ నిష్ర్కమించాడు కాబట్టి సరిపోయింది. అదే నవదీప్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయనుకుందాం? అప్పుడు బిగ్ బాస్ పక్కా లాటరీ లాంటి ట్విస్టు పెట్టడం మిస్టేక్ కాదా? అలాగే చివరకు..

Advertisement

ఐదుగురు ఫైనల్ కన్టెస్టెంట్స్‌లో అర్చన, నవదీప్‌లు నిష్క్రమించగా.. హౌస్‌లో హరితేజ, శివబాలాజీ, ఆదర్శ్‌లు మాత్రమే మిగిలారు. ఇక వీళ్లలో మూడో స్థానం సరిపెట్టుకుని బిగ్‌బాస్ హౌస్‌ను ఇప్పుడే వీడాలనుకుంటే 10 లక్షల తీసుకుని వెళ్లొచ్చని ఎన్టీఆర్ ఆఫర్ ఇవ్వగా కన్టెస్టెంట్స్ ముగ్గురూ ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాని అక్కడ శివబాలాజీ ఆ పది లక్షలను తీసుకుని వెళ్లిపోయాడే అనుకుందాం.. మరి అది ప్రేక్షకుల ఓట్లను తక్కువచేసినట్లే కదా..

సుమారు 12 లక్షల మంది వేసిన ఓట్లను ఇలా బిగ్ బాస్ అనేక ట్విస్టులతో అగౌరవపర్చడంపై ఓటు చేసిన వారిలో చాలా మంది బాధ కలిగించింది. ఏది ఏమయినా బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 షో 71 రోజుల ఎపిసోడ్ కు శుభం కార్డు వేసింది స్టార్ మా యాజమాన్యం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!