Connect with us

Featured

శ్రీదేవి నటించిన “పదహారేళ్ళ వయసు” సినిమాకు సంబంధించిన మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..!!

Published

on

సిరిమల్లె పువ్వా..సిరిమల్లె పువ్వా..చిన్నారి చిలకమ్మా..నా వాడు ఎవరే… నా తోడు ఎవరే.. అనే కోయిల లాంటి జానకి పాడిన ఈ పాట వింటే టక్కున శ్రీదేవి నటించిన పదహారేళ్ళ వయసు చిత్రం గుర్తుకు వస్తుంది. 1978 ఆగస్టు 31న పదహారేళ్ళ వయసు సినిమా విడుదలైంది. తమిళంలో భారతిరాజా దర్శకత్వం వహించిన “పదునారు వయనదిలే” చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్ నటించారు.

Advertisement

ఈ సినిమా వెనుక ఆసక్తికర విషయాలు ఏమిటంటే.. ఒక లారీ డ్రైవర్.. భారతీరాజా వద్దకు వచ్చి తను ఒక సినిమా నిర్మిద్దాం అనుకుంటున్నానని చెప్పడంతో.. తన దగ్గర ఒక మంచి కథ ఉందని..దానికి సుమారుగా మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని భారతీరాజా లారీ డ్రైవర్ కు చెప్పడం జరిగింది. కానీ ఆ లారీ డ్రైవర్ పోగు చేసుకున్న డబ్బు కేవలం మూడు లక్షలు కానీ సినిమాకి దాదాపుగా రూ.4.5లక్షల కంటే ఎక్కువగా ఖర్చయింది. అప్పుడు లారీ డ్రైవర్ తన సొంత లారీని, ఇతర ఆస్తిని అమ్మి ఆ సినిమా తీయడం జరిగింది.

కేవలం సినిమా మీద ఉన్న అభిమానంతో అంత మొత్తాన్ని ఆ లారీడ్రైవర్ ఆ సినిమాపై కర్చు చేశారు. ఫలితం ఎలా ఉంటుందో అని భయపడుతూ ఎదురుచూస్తున్న సమయంలో.. మొదటగా డివైడ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో సినిమా ఘన విజయం సాధించింది. లారీ డ్రైవరు ఊహించినదానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు రావడం, వివిధ భాషల నుంచి రీమేక్ హక్కులను ఇవ్వాలని నిర్మాతలు వెంటపడడం. అలాగే ఇన్ కమ్ టాక్స్ వాళ్లు రైడ్ చేయడం లాంటివి నుంచి తప్పించుకోవడానికి ఆయన ఎక్కడికో వెళ్లి ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది.

ఆ లారీడ్రైవర్ అడ్మిట్ అయినా ఆస్పత్రి చిరునామా తెలుసుకొని తెలుగు నిర్మాత మిద్దె రామారావు వెళ్లి ఆ రోజుల్లో ఒక సినిమాకి రైట్స్ కి కేవలం 40 వేల రూపాయలు ఇచ్చేవారు. కానీ మిద్దె రామారావు లక్ష రూపాయల కంటే ఎక్కువ చెల్లించి తమిళ మాతృక సినిమా రైట్స్ తీసుకోవడం జరిగింది. అప్పటికే అడవిరాముడు సినిమా ఘనవిజయంతో ఉన్న కె.రాఘవేంద్రరావుని ఈ సినిమాకి నిర్మాతలు దర్శకుడిగా ఎన్నుకున్నారు. తెలుగులో తిరిగి శ్రీదేవినే హీరోయిన్ గా తీసుకున్నారు.

కమల్ హాసన్ పాత్రకి చంద్రమోహన్ ని అదేవిధంగా రజినీకాంత్ పాత్రకి తిరిగి రజనీకాంత్ తెలుగులో నటిస్తానని ముందుకు వచ్చిన కూడా.. మోహన్ బాబునే ఎంచుకున్నారు. అయితే ఇంకో విషయం ఏమిటంటే పదహారేళ్ళ వయసులో చంద్రమోహన్ పాత్రను ముందుగా శోభన్ బాబు చేయాలనుకున్నారు. కానీ డిగ్లామర్ రోల్, పంచె, గోచి కట్టాల్సివస్తుందని శోభన్ బాబు పదహారేళ్ళ వయసు సినిమాని వదులుకున్నారు. ఈ సినిమాకి శ్రీదేవి 50 వేల రూపాయలు అడగగా..నిర్మాతలు 35 వేల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా చంద్రమోహన్ కి 17వేల రూపాయలు, మోహన్ బాబుకి 10 వేలరూపాయలు పారితోషికంగా ఇచ్చారు.

అయితే ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన చక్రవర్తి తమిళ మాతృక నుంచి.. “సిరిమల్లె పువ్వా..సిరిమల్లె పువ్వా..”అనే హిట్ పాటని తీసుకున్నారు. మిగతా పాటలకి చక్రవర్తి సొంతంగా బాణీ కట్టారు. శ్రీదేవి అందం..చంద్రమోహన్ అమాయకత్వం.. మోహన్ బాబు క్రూరత్వం ఈ సినిమాకి చాలా దోహదపడ్డాయి. 1978 లో విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!

Published

on

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. తన వ్యక్తిగత విషయాలు అలాగే తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏడాదిన్నర పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత తిరిగి సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతున్నారు.

Advertisement

ఇక త్వరలోనే ఈమె నటించిన హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ ఒకటవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సమంత అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా మెగా హీరో పై ఈమె ప్రశంసల వర్షం కురిపిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి రంగస్థలం సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే త్వరలోనే రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా నుంచి రా మచ్చా మచ్చా అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు.

అన్ మ్యాచబుల్..
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ పాటపై సమంత స్పందిస్తూ రామ్ చరణ్ పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ పాట పట్ల సమంత స్పందిస్తూ మిమ్మల్ని ఎవరు మ్యాచ్ చేయలేరు.అన్‌మ్యాచ్‌బుల్‌..అని పేర్కొన్నారు. దానికింద ఫార్మల్‌ ప్యాంట్‌, షర్ట్‌ ధరించి ఎవరు ఇలా డ్యాన్స్‌ చేయగలరు.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ntr: ఆ విషయంలో ప్రణతి నాకు రోజు గొడవే.. ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాలలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబైలో కూడా ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

Advertisement

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబైలోని కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎన్టీఆర్ కి ఎదురయింది. తన భార్యతో తనకు జరిగే గొడవ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ ప్రతి రోజు ప్రణతికి నాకు మధ్య ఏసీ విషయంలో గొడవ జరుగుతుందని తెలిపారు.

ఏసీ టెంపరేచర్ విషయంలో ప్రతిరోజు తనకు నాకు మధ్య గొడవ జరుగుతుందని పాపం ప్రణతి నాకోసం ప్రతిరోజు కాంప్రమైజ్ అవుతుంది అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే భార్య భర్తల అన్న తర్వాత గొడవలు రావడం సర్వసాధారణం. ఇలాంటి చిలిపి గొడవలు కూడా ఎంతో సంతోషంగా ఉంటాయని చెప్పాలి.

ఇక ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జంటకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెద్దలు చూసిన అమ్మాయితో ఎన్టీఆర్ ఏడడుగులు నడిచారు. వీరిద్దరిది ఎంతో చూడముచ్చటైన జంట అని చెప్పాలి ఇక ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోని పెళ్లి చేసుకున్న లక్ష్మీ ప్రణతి మాత్రం ఎంతో సాధారణమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఇక ఈమె పూర్తిగా సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sai pallavi: ఏంటీ సాయి పల్లవి దేవుడితో మాట్లాడుతుందా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు?

Published

on

Sai pallavi: తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి ఎంతో అద్భుతమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. రీమేక్ చిత్రాలకు గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ సక్సెస్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

Advertisement

ఇక సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ అలాగే కోలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె దేవుడి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దేవుడు తనతో మాట్లాడుతాడు అంటూ ఈ సందర్భంగా సాయిపల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ నేను ఏ సెట్ లో అయితే ఓడిపోయానో అదే సెట్ లో ప్రభుదేవా మాస్టర్ గారు రౌడీ బేబీ సాంగ్ కంపోజ్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది… దేవుడు మన కోసం కొన్ని ప్లాన్ చేస్తాడు. కోల్పోయిన దానికంటే ఎక్కువగా ఇస్తారని ఈమె వెల్లడించారు. ఇక నేను ఏదైనా ఒక విషయం గురించి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తూ తనకు తాను ప్రశ్నలు వేసుకుంటూ ఉండగా దేవుడు నాతో మాట్లాడు నాకు సమాధానం చెబుతారని ఈమె తెలిపారు.

సమాధానం చెబుతాడు…
మనం చేసే పని విషయంలో సూచనలు ఇస్తాడు. దేవుడు మనలోనే ఉన్నాడని నమ్ముతాను, అన్నారు. ఇక దేవుడి పట్ల గట్టి విశ్వాసం ఉన్నవాళ్లు చాలా మంది ఇలానే ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది. కాకపోతే, దేవుడు నాతో మాట్లాడతాడు అని చెబితే కచ్చితంగా నన్ను ఎగతాళి చేస్తారు. అయినప్పటికీ ఈ విషయాన్ని దాచుకోకుండా ఈమె తన ఆలోచనలను ఇలా ఓపెన్ గా చెబుతూ వార్తలలో నిలిచారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!