Saripoda Ee Dasara: ప్రతీ పండుగకు ఈటీవీ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లను కండక్ట్ చేస్తూ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. దసరా, సంక్రాంతి, దీపావళి ఉగాది ఇలా ప్రతి పండుగకు ప్రేక్షకుల కోసం కొత్త కొత్త ప్రోగ్రామ్ లను తీసుకువస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ లలో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు వెండితెర సెలబ్రిటీలు కూడా సందడి చేస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ లతో పాటు సీరియల్ నటీనటులు అలాగే సింగర్స్ డాన్సర్లతో ప్రతి ఈవెంట్ ను కండక్ట్ చేస్తూ ఉంటారు.
Advertisement
అయితే ఎప్పటిలాగే ఈ దసరాకి కూడా ఈటీవీ టీం మంచి ఈవెంట్ ను ప్లాన్ చేసింది. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ టీమ్ కలిసి ఈ ఈవెంట్ ను నిర్వహించినట్టుగా కనిపిస్తోంది. ఈ ఈవెంట్ కు బ్రహ్మాజీ, అలీ, శ్రీదేవీ విజయ్ కుమార్, సంగీత వంటి వారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉన్నారు. ఇక ఈ ఈవెంట్ను నందు తన ఎనర్జిని రెట్టింపు చేసి హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ తో నందు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రోమోలో జాను మాస్ పర్ఫామెన్స్, ఆట సందీప్ జ్యోతి డివోషనల్ పర్ఫామెన్స్, సింగింగ్ పర్ఫామెన్స్ లు, మధ్య మధ్యలో కామెడీ ఇలా అన్నీ కూడా హైలెట్ కానున్నట్లు ప్రోమో ని చూసి తెలుస్తోంది.
జాతకాలు హైలెట్..
ఇక కామెడీ యాంగిల్ లో ఆది, బ్రహ్మాజీ, అలీ ట్రాకులు కూడా ఉన్నాయి. అన్నింట్లో కెల్లా రియాజ్, నరేష్ జాతకాలు చెప్పే ఎపిసోడ్ మరింత హిలేరియస్ గా ఉండేట్టు కనిపిస్తోంది. అన్నిటికంటే నుంచి ఈ ఈవెంట్ లో అమ్మవారి శక్తిని చాటే విధంగా చూపించే భక్తి పాటలు ఈ షోకి హైలెట్ గా పిల్లి జిల్లా కనిపిస్తున్నాయి. ఈవెంట్ కి సరిపోదా ఈ దసరాకి అనే పేరును కూడా పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మరింత ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే మరి.
Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇండస్ట్రీ సపోర్ట్.. కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.
Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.
Advertisement
ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది. పెళ్లి ఫోటో.. మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.
Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.
Advertisement
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.
ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.
బాహుబలి 3.. ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.