Connect with us

Featured

Naara Rohit: ఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం.. హీరోయిన్ సిరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Published

on

Naara Rohit: సినీ నటుడు నారా రోహిత్ ఇటీవల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నారా రోహిత్ పెద్దగా ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక ఈయన నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. అయితే ఇటీవల హీరోయిన్ సిరితో ఈయన నిశ్చితార్థం జరుపుకున్నారు.

Advertisement

వీరిద్దరూ కలిసి జంటగా ప్రతినిధి 2 సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడిన వీరిద్దరు పెద్దల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక వీరి నిశ్చితార్థం హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్. ఇక హీరోయిన్ తో ఈయన నిశ్చితార్థం జరుపుకోవడంతో హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏంటని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే హీరోయిన్ సిరి అసలు పేరు శిరీష ఈమె మన తెలుగు అమ్మాయి కావటం విశేషం.

పల్నాడు అమ్మాయి..
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల గ్రామానికి చెందిన శిరీష ఉన్నత చదువులు విదేశాలలో పూర్తి చేసిన సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలా ప్రతినిధి 2 సినిమాలో అవకాశం అందుకున్న ఈమె ఏకంగా హీరోతోనే నిజజీవితంలో కూడా పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇక వీరు నలుగురు అక్క చెల్లెలని తెలుస్తుంది. శిరీష ఆఖరి అమ్మాయి కావటం విశేషం. ఇక ఈ ఏడాది చివరిలోనే వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Rakul Preeth Singh: వారం రోజులుగా ఆసుపత్రి బెడ్ పై నటి రకుల్… ఏం జరిగిందంటే?

Published

on

Rakul Preeth Singh: సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ ఆస్పత్రి పాలయ్యారు. ఈమె గత వారం రోజులుగా ఆస్పత్రి బెడ్ పై ఉన్నారనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . అసలు ఈమెకు ఏం జరిగింది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

Advertisement

రకుల్ ప్రీతిసింగ్ సినిమా షూటింగ్స్ కనుక లేకపోతే ఎక్కువ సేపు జిమ్ లోనే సమయం గడుపుతారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా భారీ స్థాయిలో వర్కౌట్స్ చేస్తూ బిజీగా ఉంటారు. ఈ తరుణంలోనే ఇటీవల వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఈమె ఒకేసారి 80 కిలోల బరువు ఎత్తారు. దీంతో తన వెన్నుకు గాయమైంది.

ఇలా గాయమై నొప్పి తీవ్రత ఉన్నప్పటికీ ఈమె లెక్క చేయకుండా సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు. దీంతో దాని తీవ్రత మరింత అధికం కావడంతో హాస్పిటల్ పాలయ్యారు. ఇలా ఆరు రోజులుగా బెడ్ పైనే ఉన్న రకుల్ తాజాగా తన హెల్త్ అప్డేట్ గురించి తెలిపారు. నా శరీరం చెబుతున్న నేను పట్టించుకోకుండా పిచ్చిగా ప్రవర్తించాను.

వెన్నులో నొప్పి..
మీరు కూడా మీ శరీరం చెప్పిన మాట వినండి. మీ శరీరం చెప్పింది అంటే ఆ శ్రద్ధ వహించకండి అంటూ ఈ సందర్భంగా తన హెల్త్ అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఈమె త్వరగా ఈ నొప్పి సమస్య నుంచి కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రకుల్ వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె పూర్తిగా సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక తెలుగులో చివరిగా కొండ పొలం అనే సినిమాలో నటించారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!

Published

on

Aara Mastan: ఇటీవల హర్యానాలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించని విధంగా వచ్చాయి. కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ భావించినప్పటికీ చివరికి బిజెపి హర్యానాలో విజయకేతనం ఎగరవేసింది. అయితే తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

Advertisement

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆరా మస్తాన్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేయడం కుదురుతుందని, అందుకే ఊహించిన ఫలితాలు రాకుండా వేరే ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.తను వైసీపీ గెలుస్తుందని సర్వే చేసే తెలిపామని అది అబద్ధం అయ్యిందని దానికి కారణం ఈవీఎం టాంపరింగ్ అని అన్నారు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించింది. అదే ఈవీఎం కౌంటింగ్ సమయంలో బిజెపి ముందంజలోకి వచ్చింది.

దీన్ని బట్టి మనం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అర్థం చేసుకోవచ్చని ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా ఇక్కడ గెలుస్తామనే నియోజకవర్గాలలో కాకుండా వేరే నియోజకవర్గాలలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని ఆరా మస్తాన్ ఆరోపించారు.

ఈవీఎంలు ట్యాంపరింగ్ .

Advertisement

ఒకప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి చంద్రబాబు ఏ మాట్లాడాలని కానీ ఇప్పుడు మాత్రం ఆయన గప్‌చుప్ గా ఉన్నారని దీన్ని బట్టి ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!