Connect with us

Featured

Allu Aravind: చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్… అల్లుడికి పోటీగా రానున్న తండేల్!

Published

on

Allu Aravind: సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా ,అల్లు ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా బేదాభిప్రాయాలు ఉన్నాయనే మాట వాస్తవమే అని తెలుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వచ్చారో అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. ఈ ఘటన తర్వాత ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించలేదు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వినిపించిన వాటిని ఖండిస్తూ ఇటు మెగా ఫ్యామిలీ గాని అటు అల్లు ఫ్యామిలీ గాని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు నిజమేనని అందరికీ స్పష్టత వచ్చింది. అయితే తాజాగా మరో ఘటన కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు నిజమైనని రుజువు చేస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్లోనే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అదే రోజు చిరంజీవి విశ్వంభర కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిరంజీవిని బ్రతిమలాడి అదే రోజుకు రాంచరణ్ సినిమాని విడుదల చేస్తున్నారు.

రామ్ చరణ్ కు పోటీగా చైతన్య..
ఇలా రామ్ చరణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు పోటీగా ఉండకుండా సంక్రాంతి బరిలో దిగగా అల్లు అరవింద్ మాత్రం తన అల్లుడు రామ్ చరణ్ ను టార్గెట్ చేశారని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటిస్తున్న తండేల్ సినిమాని చరణ్ సినిమాకు పోటీగా విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని జనవరి 14వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలబడునుంది. ఇలా అల్లుడు పోటీగా మామ బరిలోకి దిగడంతో ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jani Master: జానీ మాస్టర్ చాలా మంచోడు… ఇది చాలా దారుణం: ఆనీ మాస్టర్

Published

on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల లైంగిక ఆరోపణల కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా అరెస్ట్ అయిన ఈయనకు బెయిల్ రాకపోవడంతో రిమాండ్ లోనే ఉన్నారు. ఇక జానీ మాస్టర్ కు ఇటీవల అవార్డు కూడా ప్రకటించారు అయితే ఈయన పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో అవార్డు కూడా క్యాన్సిల్ అయింది.

Advertisement

ఇలా జానీ మాస్టర్ అరెస్ట్ కావడంతో సినీ పెద్దలు ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు అయితే తాజాగా మరో డాన్స్ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ స్పందించారు. తాజాగా ఈమె మాట్లాడుతూ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటూ అరెస్టు అయ్యారు అనే విషయం తెలిసే షాక్ అయ్యానని తెలిపారు.

జానీ మాస్టర్ అమ్మాయిలను ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు ఆయన చాలా మంచివారు తన వద్ద నేను రెండు సంవత్సరాల పాటు పని చేశాను. ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని తెలిపారు. ఇక ఈయన తప్పు చేశారని రుజువు కాకుండానే ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు వెనక్కి వెళ్లిపోవడం దారుణం అని తెలిపారు.

నేరం రుజువు కాలేదు…
జానీ మాస్టర్ విషయంలో ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించలేదని బహుశా ఇది అమ్మాయితో వ్యవహారం కావడంతో ఎవరు స్పందించలేదు అంటూ ఈ సందర్భంగా ఆనీ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే జానీ మాస్టర్ సైతం తన పట్ల వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశారు. నా ఎదుగుదలను చూడలేదే కొందరు ఉద్దేశపూర్వకంగానే నాపై కుట్ర చేశారంటూ ఆయన పోలీస్ విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ntr: మనసులో ఏది పెట్టుకోను.. బాలయ్యతో విభేదాలపై ఓపెన్ అయిన తారక్!

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈయన తదుపరి సినిమాలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఇక దేవర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన బాబాయ్ బాలకృష్ణతో విభేదాలపై ఓపెన్ అయ్యారు.

Advertisement

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా విలేఖరి ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తూ బాలయ్యతో విభేదాలపై అడిగారు. దీంతో తారక్ మాట్లాడుతూ తనకు బాలయ్యతో విభేదాలేంటండి.. ఎటువంటి సమస్యలు తమ మధ్య లేవని, సమస్య అనేదే లేదని తేల్చిచెప్పారు. సమస్య ఏంటనేది నాకు తెలియదు. ఆయన మా నాన్న హరికృష్ణ గారికి సోదరుడు అంటే నాకు తండ్రి సమానులు.

తండ్రి సమానులు..
తండ్రి సమానులు అయిన ఆయనతో తనకు విభేదాలెందుకు ఉంటాయని ఎదురు ప్రశ్నించారు. ఏ విషయాన్ని తాను మనసులో పెట్టుకోనని, ఏ విషయంలోనైనా తాను ఓపెన్ గా ఉంటానని తారక్ స్పష్టం చేశారు. ఇలా తన బాబాయ్ తో విభేదాల గురించి ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Nagababu: బన్నీ తారక్ ఎందుకు పనికిరారు… సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు!

Published

on

Nagababu: సినీ నటుడు నాగబాబు ఇటీవల కాలంలో తన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయం నుంచి ఈయన సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తూ చేసే పోస్టులు వివాదానికి కారణం అవుతున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ నాగబాబు మధ్య కూడా వివాదాలు తారస్థాయికి చేరాయి.

Advertisement

ఇలాంటి తరుణంలోనే నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసినా దానిని నెగిటివ్ వేలో ప్రచారం చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే గతంలో నాగబాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా నాగబాబు మాట్లాడుతూ చాలామంది లైఫ్ లో నిన్ను దేనికి పనికిరాను అంటూ బాధపడుతుంటారు.

ఇలాంటి వారు రవితేజ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.. రవితేజకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి లైట్ బాయ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అసలు పేరే తెలియని హీరోల సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించి నేడు స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు.

రవితేజ..
ఇక ఇండస్ట్రీలో ఎనర్జిటిక్, డాన్స్ చేసే హీరోలు అంటే మనకు బన్నీ తారక్ మాత్రమే గుర్తుకు వస్తారు కానీ రవితేజ కూడా అంతే ఎనర్జిటిక్ గా డాన్స్ చేస్తారని నాగబాబు తెలిపారు. ఇక కొంతమంది నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలను కాంట్రవర్సీగా మారుస్తూ అంటే రవితేజతో పోలిస్తే బన్నీ తారక్ లు వేస్టా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!