Krishna – NTR : భారతదేశంలో సినీ రంగం నుంచి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా ఎం.జి.రామచంద్రన్ పేర్కొనవచ్చు. ఆ తర్వాత 1982 ప్రాంతంలో నందమూరి తారక రామారావు సినిమాలలో అగ్ర కథానాయకుడు గా కొనసాగుతూన్న క్రమంలో బడుగు బలహీన వర్గాల్లో ఆశా కిరణంలా రాజకీయరంగంలో ఎన్టీరామారావు అడుగు పెట్టారు. స్థాపించిన అతికొద్ది కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని చేపట్టారు. ఇక ఆయన సినిమాలకి విరామం ప్రకటించారు. పూర్తిగా రాజకీయాలకే పరిమితమై ప్రజల సంక్షేమానికి పాటు పాడడం జరిగింది.
Advertisement
అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో రాణిస్తున్నప్పటికీ ఎంతో మంది రాజకీయ నాయకులు ఆహ్వానించిన రాజకీయ రంగం వైపు ఆయన చూడలేదు. కానీ 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ పిలుపుమేరకు రాజకీయాల్లోకి రావడానికి కృష్ణ గారు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎన్టీ రామారావు కు వ్యతిరేకంగా కొన్ని వ్యంగ్య చిత్రాలను నిర్మించారు. 1986లో పద్మాలయ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సింహాసనం సినిమాలో హీరో కృష్ణ, రాజగురు పాత్ర ధరించిన సత్యనారాయణచే ఎన్టీఆర్ తరచూ చెప్పే..ఇంకేం మిగిలింది బూడిద అనే డైలాగ్ చెప్పించారు.
ఆ తర్వాత ఇదే సంవత్సరంలో పద్మాలయ బ్యానర్ లో పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నా పిలుపే ప్రభంజనం సినిమాను పూర్తిగా ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా రూపొందించారు. ఒకప్పుడు ఎన్టీరామారావుకి డూపు గా వ్యవహరించిన నటుడు కైకాల సత్యనారాయణచే ఎన్టీరామారావు ను పోలిన కోదండ రామయ్య అనే పాత్రను చేయించారు. ఆ తర్వాత నా పిలుపే ప్రభంజనం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ప్రముఖ దర్శక, నిర్మాత, నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో మండలాధీశుడు అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పూర్తిగా ఎన్టీ రామారావు పై వ్యంగ్యాస్త్రం గా వచ్చింది.
అంత సులువుగా సినిమాలో నటించడానికి ఒప్పుకుని భానుమతి గారు ఈ సినిమాలో ఓ వేషం ధరించడం విశేషం. జమున కూడా మరొక ప్రధాన పాత్ర వేశారు. విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ, నరేష్, వాణి విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా మళ్లీ ఎన్టీరామారావు పై ఓ సెటైరికల్ మూవీగా ‘సాహసమే నా ఊపిరి’ సినిమా వచ్చింది. ఆ తర్వాత 1989 లో ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో విజయనిర్మల, నరేష్ ప్రధానపాత్రలో గండిపేట రహస్యం సినిమా విడుదలైంది.
ఇది కూడా ఎన్టీరామారావును ఆధారం చేసుకొని తీసిన ఓ వ్యంగ్య చిత్రంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు నిర్మాణ సారధ్యంలో ప్రదీప్ శక్తి దర్శకత్వంలో బాలచందర్ ప్రధాన పాత్రలో ’కలియుగ విశ్వామిత్ర’ సినిమాని ఎన్టీరామారావు పై మరో వ్యంగ్యాస్త్రంగా విడుదల చేశారు.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె చివరిగా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటి నుంచి ఎలాంటి సినిమాలు విడుదల కాలేదు కానీ ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.
Advertisement
ఇక త్వరలోనే ఈమె నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక పుష్ప సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఈమె తన పాత్ర గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డీ గ్లామర్ పాత్రలో నటించాలి అంటే మామూలు విషయం కాదు. మేకప్ వేయటం కోసమే ఎన్నో గంటల సమయం పడుతుంది. అయితే ఇలాంటి పాత్రలో నటించడం కోసం రష్మిక చాలా ఇబ్బందులు పడినట్లు ఈమె తెలిపారు.. మేకప్ కోసం గంటలు కూర్చుని వేయించుకోవాలని మేకప్ ఎక్కడ చెరిగిపోతుందోనని కొన్నిసార్లు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా కేవలం లిప్స్ ఒక్కటే క్లియర్ చేసుకొని జ్యూస్ మాత్రమే తాగేదానినని తెలిపారు.
మేకప్ రిమూవ్.. ఇక ఇలాంటి మేకప్ వేసుకున్న తర్వాత దానిని రిమూవ్ చేయాలంటే ఎంతో నొప్పిగా ఉండేది అలాంటి నొప్పిని మనం భరించినప్పుడే హీరోయిన్స్ గా సక్సెస్ అవుతాము అంటూ రష్మిక పుష్ప సినిమాలోని డీ గ్లామర్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈయన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Advertisement
ప్రస్తుతం నాగచైతన్య ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య తాజాగా తనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటినుంచి కూడా నాగచైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి పలు సందర్భాలలో వెల్లడించారు. తనకు ఏదైనా కొత్త రకం బైక్ లేదా కారు కనిపిస్తే అసలు ఆగలేనని వెంటనే డ్రైవ్ చేస్తానని నాగచైతన్య తెలిపారు.
ఇటీవల కాలంలో తాను కార్ రేసింగ్ జోలికి వెళ్లలేదని ఈయన తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని అదేవిధంగా నా స్నేహితులు తాను ఈ అలవాటు మానుకుంటే మంచిదని చెప్పడంతో ఈ అలవాటును కాస్త తగ్గించుకుంటున్నానని తెలిపారు. తాను రేస్ వెళ్లేటప్పుడు చాలా వేగంగా వెళ్తాను అందుకే ఈ అలవాటు మానుకోమని తన స్నేహితులు చెప్పారని చైతన్య వెల్లడించారు.
జాలరి నేపథ్యంలో.. ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే నిజ జీవిత కథ ఆధారంగా ఓ జాలరి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య పలు సినిమాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయారు.
Allu Aravind: సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా ,అల్లు ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా బేదాభిప్రాయాలు ఉన్నాయనే మాట వాస్తవమే అని తెలుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వచ్చారో అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. ఈ ఘటన తర్వాత ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించలేదు.
Advertisement
ఈ క్రమంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వినిపించిన వాటిని ఖండిస్తూ ఇటు మెగా ఫ్యామిలీ గాని అటు అల్లు ఫ్యామిలీ గాని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు నిజమేనని అందరికీ స్పష్టత వచ్చింది. అయితే తాజాగా మరో ఘటన కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు నిజమైనని రుజువు చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్లోనే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అదే రోజు చిరంజీవి విశ్వంభర కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిరంజీవిని బ్రతిమలాడి అదే రోజుకు రాంచరణ్ సినిమాని విడుదల చేస్తున్నారు.
రామ్ చరణ్ కు పోటీగా చైతన్య.. ఇలా రామ్ చరణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు పోటీగా ఉండకుండా సంక్రాంతి బరిలో దిగగా అల్లు అరవింద్ మాత్రం తన అల్లుడు రామ్ చరణ్ ను టార్గెట్ చేశారని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటిస్తున్న తండేల్ సినిమాని చరణ్ సినిమాకు పోటీగా విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని జనవరి 14వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలబడునుంది. ఇలా అల్లుడు పోటీగా మామ బరిలోకి దిగడంతో ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు.