Connect with us

Featured

టాప్ హీరో చేయూత ఇచ్చిన దారుణమైన స్థితిలో మరణించిన బాలక్రిష్ణ మొదటి సినిమా హీరోయిన్

Published

on

బాలకృష్ణ మొదటి హీరోయిన్ ఆత్మహత్యచేసుకుందని మీకు తెలుసా….?
విజ్జి…. ఎయిటీస్ లో ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక చక్కటి నటి. అందం, అభినయం రెండూ కలగలిసిన ఆమె 1982 లో గంగై అమరన్ చిత్రం కోళి కూవుదు సినిమాతో తమిళ్ చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో , ఆమెకు తమిళ్ లో ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ఆమె సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఆమె తనకెరీర్ ను ప్లాన్డ్ గా కొనసాగించింది. అప్పటి తమిళ్ ఇండస్ట్రీలోని అందరి ప్రముఖ హీరోల సినిమాల్లోనూ ఆమెకు ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ముఖ్యంగా విజయ్ కాంత్ నటించిన సినిమాల్లో ఆమెకు తరచుగా ఆఫర్స్ వస్తూండేవి. విజయకాంత్ తో ఆమెకున్న మంచి పరిచయం కారణంగానే దర్శకులు ఆమెను తీసుకునేవారు. ఆ టైమ్ లోనే బాలకృష్ణ హీరోగా నటించిన మొదటి చిత్రం సాహసమే జీవితం సినిమాలో ఆమెను హీరోయన్ గా సెలెక్ట్ చేసారు. ఆ సినిమాకి పి.వాసు, మహానది, గుణ సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంతాన భారతి కలిసి భారతి వాసు పేరుతో ఆ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇదిలా ఉంటే, విజ్జీ సినీ జీవితం ఎలా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో సాగేది. ఆమె అప్పట్లో తమిళ్ దర్శకుడు ఎ.ఆర్ .రమేష్ ను గాఢంగా ప్రేమించింది. అతడికి పెళ్ళైనా సరే అతడి తో ఎఫైర్ కంటిన్యూ చేస్తూండేది. అతడ్ని తరుచుగా తనను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేసేది. కానీ అతడు జవాబు చెప్పకుండా తప్పించుకొనేవాడు.
అయితే ఆమెను దురదృష్టం మరో కోణంలో వెంటాడింది. 1996లో పూవే ఉనక్కాగ అనే సినిమా షూటింగ్ లో ఉండగా, ఆమెకు బ్యాక్ పెయిన్ ఎటాక్ అయింది. అది సివియర్ గా మారడంతో , ఆమె వెన్నుపూసకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, చెన్నై అపోలో హాస్పటిల్ లో ఆమెకు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. లోపల ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిందని డాక్టర్లు చెప్పారు. మరి కొన్ని సర్జరీలు చేయడంతో ఆమెకు తాత్కాలిక పక్షవాతం వచ్చింది. దాంతో అపోలో హాస్పటల్ మీద ఆమె కేసు ఫైల్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కలగచేసుకోవడంతో ఆమెకు అపోలో వాళ్లు ముప్పై వేలు నష్ట పరిహారంగా చెల్లించారు. ఆ తర్వాత చేసిన మరో సర్జరీతో ఆమె వెన్నునెప్పి తగ్గిపోయింది. దీని ఫలితంగా ఆమెకు ఛాన్సులు కరువయిపోయాయి. విజయకాంత్ వల్ల ఒకటో రెండో సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. ఆమె హస్పటిల్ లో ఉన్న సమయంలో విజ్జి ప్రేమించిన దర్శకుడు ఎ.ఆర్ .రమేష్ వచ్చిపోతుండేవాడు. అప్పడు అతడ్ని విజ్జి తన పెళ్లిగురించి మరింత వత్తిడి చేసింది. తనుకు పెళ్లైందని , నీతో ఎఫైర్ మాత్రమే కొనసాగిస్తానని , విజ్జి మధ్యవర్తులతో ఖరాఖండిగా చెప్పేసాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజ్జి, 2000 సంవత్సరంలో చెన్నై మహాలింగపురంలో ఉన్న తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు ఉరిపోసుకొని ఆత్మహత్యచేసుకుంది. చనిపోయే ముందు రమేష్ తో తను మాట్లాడిన టెలిఫోన్ సంభాషణను రికార్డు చేసి , తన చావుకు అతడే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. ఆ తర్వాత దర్శకుడు రమేష్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. అలా… కేవలం 34 ఏళ్ల ప్రాయంలోనే తను ప్రేమించిన వాడికోసం అసువులు బాసింది ఆ అందాల హీరోయిన్.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?

Published

on

Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీ సపోర్ట్..
కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?

Published

on

Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.

Advertisement

ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది.
పెళ్లి ఫోటో..
మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Bahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే బాహుబలి 3..హింట్ ఇచ్చిన నిర్మాత!

Published

on

Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.

ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.

బాహుబలి 3..
ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!