సినిమా పెట్టుబడి అనేది..కథ మీద దర్శకుడి మీద కంటే హీరో మార్కెట్ మీదే ఇప్పుడు ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. గతంలో కథకు ఏం కావాలో అది చేసే వారు దర్శక నిర్మాతలు. ఆ తర్వాత ట్రెండ్ మారింది. హీరో ఎలాంటి కథ అయితే ఒప్పుకుంటాడో.. జనాలు, అభిమానులు ఎలాంటి కథల్లో అయితే చూడాలనుకుంటున్నారో అలాంటి కథలను దర్శక రచయితలు అల్లేస్తున్నారు. శత చిత్ర దర్శకుడు కోడి రామకృష అన్నట్టుగా సినిమాలో గ్రాఫిక్స్ ఉండాలి గానీ గ్రాఫిక్స్ కోసమే సినిమా చేయకూడదు. కానీ ఇప్పుడు అదే జరుగుతోంది.
Advertisement
ఒక సాధారణ కథకు కూడా అనవసరమైన గ్రాఫిక్స్ జోడించి సినిమా బడ్జెట్ పెంచేసి.. చివరికి అది ప్రేక్షకులను నచ్చక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి. రాజమౌళి ఓ నార్మల్ కథను హై టెక్నాలజీ, వీఎఫెక్స్ జోడించి హాలీవుడ్ సినిమాగా మార్చేస్తున్నారు. దానికోసం ఆయన పెట్టించే బడ్జెట్ ఎప్పటికప్పుడు ఔరా అనిపిస్తూనే ఉంది. ఇక క్రియేటివ్ జీనియస్ శంకర్ ఒక సాంగ్ కోసమే కొన్ని సార్లు 20 నుంచి 30 కోట్లు ఖర్చు చేయిస్తున్నారు. గ్రాండ్నెస్ ఉంటుంది కాని అది ఎంత సేపు.
ఓ 4 నిముషాల పాట కోసం అన్ని కోట్ల బడ్జెట్ అంటే ఏదైనా సినిమా రిజల్ట్ తేడా జరిగితే నష్ఠపోయేది నిర్మాతే. సుకుమార్ లాంటి వారు గతకొంతకాలంగా మట్టి వాసన అనిపించే కథలను తెర మీద ఆవిష్కరిస్తున్నారు. మంచి విజయాలను అందుకుంటున్నారు. స్టైలిష్ డైరెక్టర్గా పేరున్న సుకుమార్ నుంచి రంగస్థలం లాంటి కల్ట్ కంటెంట్ ఉన్న సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. పైగా హీరోకు చెవుడు. అది కూడా మెగా పవర్ స్టార్ రాం చరణ్ లాంటి స్టార్ అంటే అది ఎంతపెద్ద సాహసమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కథను నమ్మి సుకుమార్, చరణ్, నిర్మాతలు రంగస్థలం సినిమా చేశారు.
ఈ సినిమా చూస్తున్నంతసేపు ఓ 30 – 40 ఏళ్ళ వెనక్కి తీసుకు వెళ్ళింది. ఇలాంటి కథలతో ప్రయోగం చేసినా బావుంటుంది. 30 ఎకరాలలో విలేజ్ సెట్ వేసి షూటింగ్ జరిపినా అది అంతగా ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు రాబోతున్న పుష్ప కూడా ఇలాంటి ఓ విలేజ్ బ్యాక్డ్రాప్ కథనే. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నల గెటప్స్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో 5 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి కథలకు గ్రాఫిక్స్ మీద ఆధారపడి చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం హీరో మేకోవర్.. డైరెక్టర్ మేకింగ్ మీద సినిమా అంచనాలు పెరుగుతాయి. అందుకే మన స్టార్ హీరోలు కష్టమైనా మేకోవర్ కోసం బాగా కష్టపడుతున్నారు.
Samantha: సినీ నటి సమంత ఇటీవల కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈమె తన రాజకీయాలలో భాగంగా సమంత అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా కొండ సురేఖ వార్తలలో నిలవడమే కాకుండా నాగార్జున ఈమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
Advertisement
ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంతతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం స్పందిస్తూ ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక అప్పట్లో సమంత ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. తాజాగా మరోసారి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. సౌత్ సినీ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇండస్ట్రీ ప్రజలు చూపించిన ఈ ప్రేమే నన్ను ఈ వివాదం నుంచి బయటపడేలా చేసింది. లేకుంటే మరింత కృంగిపోయే దానిని. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నాను అంటూ ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇండస్ట్రీ సపోర్ట్.. కొండా సురేఖ సమంత గురించి తప్పుగా మాట్లాడటమే కాకుండా అక్కినేని ఫ్యామిలీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ ఈమె వారి గురించి మాట్లాడటంతో అప్పట్లో తెలంగాణ రాజకీయాలలోనూ,సినీ ఇండస్ట్రీలోనూ ఈ విషయం సంచలనంగా మారింది.
Samantha: సినీ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అయ్యారు.
Advertisement
ఇక సమంత వ్యక్తిగత విషయానికి వస్తే నటుడు నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయారు. సమంత నాగచైతన్య ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను చూపించుకునేవారు. అయితే వీరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకున్న తర్వాత సమంత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపివేసింది. ఇలా తాను ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వెనక్కి పంపియడమే కాకుండా తన మెడలో తాళిని కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలన్నింటినీ కూడా కాల్చేసిన సమంత ఒకే ఒక గిఫ్ట్ మాత్రం భద్రంగా పెట్టుకున్నారని తెలుస్తుంది. పెళ్లి ఫోటో.. మరి సమంత భద్రంగా దాచుకున్న ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత పెళ్లిలో దిగిన ఫోటోని భద్రంగా దాచి ఉంచారని తెలుస్తోంది. తన పెళ్లిలో తన తల్లిదండ్రులతో పాటు నాగచైతన్య సమంత కలిసి దిగిన ఫోటో అంటే తనకు చాలా ఇష్టమని గతంలో పలు సందర్భాలలో సమంత తెలిపారు. ఆ ఫోటోని మాత్రం అలాగే భద్రంగా ఉంచుకున్నారని తెలుస్తోంది.
Bahubali 3: ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ హీరోగా బాహుబలి సినిమా గుర్తింపు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న ప్రభాస్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.
Advertisement
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే బాహుబలి త్రీ కూడా రాబోతోంది అంటూ తాజాగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గతంలో బాహుబలి 3 గురించి ప్రభాస్ రాజమౌళి మాట్లాడిన ఇప్పుడే అలాంటి ఆలోచనలేమీ లేవని తెలిపారు.
ఇకపోతే తాజాగా కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల బాహుబలి నిర్మాతలతో కలిసి మాట్లాడానని అయితే వారు బాహుబలి 3 కూడా ఉండబోతోందని తెలిపారంటూ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు.
బాహుబలి 3.. ఇలా బాహుబలి నిర్మాతలు పార్ట్ 3 కూడా ఉండబోతుందని చెప్పారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రభాస్ ఈ సినిమా చేసిన ఇప్పట్లో రాదని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన సుమారు ఐదు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి వరుస షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతనే బాహుబలి త్రీ గురించి ఆలోచిస్తారని అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.