Connect with us

Featured

Koratala Siva : ఆచార్య ప్లాప్ లో కొరటాలను మాత్రమే బలి చేసారంటూ అభిమానుల ఆరోపణ… సపోర్ట్ ఇస్తున్న మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

Published

on

Koratala Siva : ఆచార్య సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇద్దరు పెద్ద హీరోలు, అందునా మెగాస్టార్ తన తనయుడితో మొదటి సారి కలిసి నటించడం, దీంతో సినిమా మీద అంచనాల నడుమ సినిమా ప్లాప్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతవరకూ ఓటమి చూడని దర్శకుడు కొరటాలకు మొదటి పరాజయం. అదీకాక సినిమా మొదటి రోజు వసూళ్లు రాకపోవడం విడ్డూరం. సినిమా ఎలా ఉన్నా మొదటి రోజు పెద్ద హీరో సినిమాలకు కలెక్షన్స్ కచ్చితంగా ఉంటాయి. అభిమానులు మొదటి రోజు సినిమాకు వెళ్లడమే కారణం. కానీ ఆచార్య విషయంలో మరి మొదటి రోజు కూడా వసూళ్లు రాకపోవడం విశ్లేషకులను, సీనియర్ నిర్మాతలు, డైరెక్టర్స్ ను కూడా ఆశ్చర్య పరిచింది.

Advertisement

సినిమా ప్లాప్ అయి నింద కొరటాల మీద…

సినిమా డిజాస్టర్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకు వంద కారణాలను అన్న చందంగా ఆచార్య ప్లాప్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ సినిమా ప్లాప్ అవ్వగానే మెగా అభిమానులు నింద మాత్రం కేవలం కొరటాల మీదకు నెట్టేసారు. సినిమా సరిగా స్క్రీన్ ప్లే లేదని కథ సరిగా క్యారీ చేయలేదంటూ విమర్శించారు. కానీ ఒక్క దర్శకుడినే అలా నిందించడం ఎంత వరకూ సరైంది. అంతవరకూ హిట్లు ఉన్న కొరటాల కు డైరెక్షన్ తెలియక సినిమా ప్లాప్ అయ్యిందా అన్నట్లు గా ఆయనను ట్రోల్ చేసారు. ఇక నష్టపోయిన డిస్టిబ్యూటర్లు చిరంజీవిని, కొరటాలను నష్టపరిహారం అందించాలని కోరుకున్నారు.

ఇక కొరటాల వారికి హామీ కూడా ఇచ్చారు రికవరీ చేయిస్తానని. ఇక తాజాగా మరోసారి డిస్ట్రిబ్యూటర్లు ఆయనను కలిసి నష్టం పుడ్చాలని అడిగారు. దీనికి ఆయన త్వరలోనే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఇపుడు ఈ విషయం బయటకు రావడంతో కొరటాల అభిమానులు కొరటాల ను మాత్రమే నిందించడం కరెక్ట్ కాదని ట్విట్టర్ లో # justice for koratalasiva ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక దీనికి ఎన్టీఆర్, మహేష్ అభిమానులు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. కొరటాలను మాత్రమే నిందించకూడదని అంటున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ కు మిగిలిన హీరోల ఫ్యాన్స్ కు ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది. మెగా ఫ్యాన్స్ కొరటాల డైరెక్షన్ చేసుకోకుండా బిజినెస్ లో వేలు పెట్టకుండా ఉండి ఉంటే బాగుండేది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Nagababu: బన్నీ తారక్ ఎందుకు పనికిరారు… సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు!

Published

on

Nagababu: సినీ నటుడు నాగబాబు ఇటీవల కాలంలో తన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయం నుంచి ఈయన సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తూ చేసే పోస్టులు వివాదానికి కారణం అవుతున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ నాగబాబు మధ్య కూడా వివాదాలు తారస్థాయికి చేరాయి.

Advertisement

ఇలాంటి తరుణంలోనే నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసినా దానిని నెగిటివ్ వేలో ప్రచారం చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే గతంలో నాగబాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా నాగబాబు మాట్లాడుతూ చాలామంది లైఫ్ లో నిన్ను దేనికి పనికిరాను అంటూ బాధపడుతుంటారు.

ఇలాంటి వారు రవితేజ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.. రవితేజకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేదు కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి లైట్ బాయ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అసలు పేరే తెలియని హీరోల సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించి నేడు స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు.

రవితేజ..
ఇక ఇండస్ట్రీలో ఎనర్జిటిక్, డాన్స్ చేసే హీరోలు అంటే మనకు బన్నీ తారక్ మాత్రమే గుర్తుకు వస్తారు కానీ రవితేజ కూడా అంతే ఎనర్జిటిక్ గా డాన్స్ చేస్తారని నాగబాబు తెలిపారు. ఇక కొంతమంది నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలను కాంట్రవర్సీగా మారుస్తూ అంటే రవితేజతో పోలిస్తే బన్నీ తారక్ లు వేస్టా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ntr: ఎన్టీఆర్ తో ఒకప్పుడు రొమాన్స్ .. ఇప్పుడు మాత్రం అక్కగా నటిస్తున్న హీరోయిన్.. ఎవరంటే?

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా ఎంతో మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో సమంత నటిస్తున్నారని హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

ఇకపోతే ఈ సినిమా కోసం ఇండియా, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఓ సెట్ కూడా వేయడానికి ప్లాన్ చేసాడు. బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానుంది. బంగ్లాదేశ్ లో స్థిరపడి కష్టాలు పడుతున్న తెలుగు వాళ్ళ కోసం హీరో కష్టపడతాడు. ఆ నేపధ్యంలోనే సినిమా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది.

అక్క పాత్రలో భూమిక..
ఈ సినిమాలో డైరెక్టర్ ప్రశాంత్ హీరోయిన్ భూమిక కోసం అద్భుతమైన పాత్ర సిద్ధం చేశారని తెలుస్తుంది. అయితే ఈమె ఈ సినిమాలో ఎన్టీఆర్ కి అక్క పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో భూమికతో కలిసి సింహాద్రి సినిమాలో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం మాత్రం ఆమెకు తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ విషయాలన్నింటి గురించి మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Samantha: వ్యాధి వల్ల మతిమరుపు వచ్చింది.. సమంత సంచలన వ్యాఖ్యలు!

Published

on

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తిరిగి కెరియర్ పై స్ఫూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఇటీవల నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈమె కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అనంతరం మయోసైటిసిస్ వ్యాధికి గురి అయ్యారు. ఈ వ్యాధి కారణంగా మరోసారి ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చారు.

Advertisement

ప్రస్తుతం ఈమె పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు దీంతో తిరిగి తన కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం సమంత నటించిన హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత తన వ్యాధి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మయోసైటిసీస్ వ్యాధి కారణంగా నేను ఒక్కసారిగా అంతా మర్చిపోయాను. మతిమరుపు వచ్చినట్టు అయింది. ఆ సమయంలో నన్ను ఎవరు ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, ఎవరు నా హెల్త్ గురించి అడగలేదని ఇప్పుడు అనుకుంటుంటాను.

అంతా మర్చిపోయాను..

Advertisement

ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను అయితే ఈ వ్యాధి వల్ల నేను సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికి నిర్మాతలు నేను తిరిగి వచ్చేవరకు నాకోసం ఎదురు చూస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ సమంత ఈ సందర్భంగా మయో సైటిసిస్ సమయంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి వెల్లడించారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!